logo

పెళ్లింట విషాదం

ఓ ప్రమాదం.. ఇద్దరు చిన్నారులకు తల్లిని దూరం చేసింది. పెళ్లింట విషాదం మిగిల్చింది. సోదరుడి వివాహ వేడుకలో అప్పటి వరకు సందడి చేసిన ఆ ఇంటి ఆడపడుచు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. తూర్పు గోదావరి జిల్లా

Updated : 20 May 2022 06:17 IST

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం


 అనంతలక్ష్మి (పాత చిత్రం)

రాజమహేంద్రవరం నేరవార్తలు, గోకవరం, ఉంగుటూరు, న్యూస్‌టుడే: ఓ ప్రమాదం.. ఇద్దరు చిన్నారులకు తల్లిని దూరం చేసింది. పెళ్లింట విషాదం మిగిల్చింది. సోదరుడి వివాహ వేడుకలో అప్పటి వరకు సందడి చేసిన ఆ ఇంటి ఆడపడుచు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. తూర్పు గోదావరి జిల్లా గోకవరానికి చెందిన కొత్త సత్యనారాయణ, రాధ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. కుమార్తెలు ఇద్దరికి వివాహాలు కాగా, కుమారుడు రామగుప్తకు ఈ నెల 18న వివాహం జరిగింది. తమ్ముడి వివాహ వేడుక నిమిత్తం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో నివాసముంటున్న పెద్ద కుమార్తె మానేపల్లి శ్రీ వీర వెంకట అనంతలక్ష్మి(33) తన ఇద్దరు పిల్లలతో కలసి నాలుగు రోజుల కిందట గోకవరం వచ్చారు. కుటుంబ సభ్యులంతా కోనసీమ జిల్లా అమలాపురంలోని గుప్త పెళ్లికి వెళ్లారు. గురువారం మధ్యాహ్నం గోకవరంలో సత్యనారాయణస్వామి వ్రతం, సాయంత్రం బంధుమిత్రులతో విందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో తెల్లవారుజామున అనంతలక్ష్మి, ఆమె తల్లిదండ్రులు  కారులో గోకవరానికి బయలుదేరారు. రాజమహేంద్రవరం బొమ్మూరు జాతీయ రహదారిపైకి వచ్చేసరికి వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు విభాగిని(డివైడర్‌)ని ఢీకొంది. ప్రమాదంలో అనంతలక్ష్మి తలకు బలమైన గాయమైంది. సత్యనారాయణ పక్కటెముక విరిగింది. రాధ, డ్రైవరు ఇద్దరికి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను ఆసుపత్రికి తరలించగా అనంతలక్ష్మి చికిత్స పొందుతూ మృతి చెందారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని