ఇక్కడ చెరువుండాలే
స్వలాభం కోసం కొందరు పూడ్చేస్తుంటే.. మరికొందరు ఆక్రమించుకుంటున్నారు. వెరసి ఆనవాళ్లే లేకుండా చేస్తున్నారు. తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలో చెరువుల పరిస్థితి ఇది. రెవెన్యూ రికార్డుల ప్రకారం 101.21 ఎకరాల విస్తీర్ణంలో 25 చెరువులుండాల్సి ఉండగా..
పర్యవేక్షణ కొరవడిన కబ్జా పర్వం
తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్టుడే: స్వలాభం కోసం కొందరు పూడ్చేస్తుంటే.. మరికొందరు ఆక్రమించుకుంటున్నారు. వెరసి ఆనవాళ్లే లేకుండా చేస్తున్నారు. తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలో చెరువుల పరిస్థితి ఇది. రెవెన్యూ రికార్డుల ప్రకారం 101.21 ఎకరాల విస్తీర్ణంలో 25 చెరువులుండాల్సి ఉండగా.. పురపాలక రికార్డుల్లో ఇవన్నీ కానరావడం లేదు. 15 మాత్రమే నమోదై ఉండటం గమనార్హం. అధికారుల పర్యవేక్షణ లోపంతో చాలా వరకు మురుగుతో నిండిపోయి దుర్భరంగా మారాయి. పట్టించుకునేవారు లేకపోవడంతో వీటిపై అక్రమార్కుల కన్ను పడింది. భూగర్భ జలాలను పెంపొందించేందుకు చెరువులు ఎంతగానో ఉపయోగపడతాయి. దశాబ్దాల కిందట వ్యవసాయం, తాగునీటి కోసం చెరువులపైనే ప్రజలు ఆధారపడేవారు.
ఆనవాళ్లు లేకుండా చేశారు
పట్టణంలోని తాళ్లముదునూరుపాడులో సర్వే నెంబరు 79కు సంబంధించి 4.04 ఎకరాల్లో భట్టువానిగుంట చెరువు ఉంది. గతంలో ఇది స్థానికులకు మంచి నీటి అవసరాలను తీర్చేది. కుళాయిలు రావడంతో ఇది మరుగున పడింది. ఆ తరువాత కొంత కాలం వరకు చేపల పెంపకానికి పురపాలక సంఘం లీజుకు ఇచ్చేది. స్థానికులు వ్యర్థాలు వేయడంతో మురికి కూపంలా తయారైంది. ఇదే అదనుగా పలువురు పూడ్చేసి సుమారు 3.5 ఎకరాల వరకు ఆక్రమించుకున్నారు. చెరువు ఆనవాళ్లు లేకుండా చేశారు.
ఎర్ర చెరువు పరిస్థితి ఇలా..
18వ వార్డు పుంతలో ముసలమ్మ ఆలయం సమీపంలో సర్వే నెంబరు 22/2కు చెందిన ఎర్ర చెరువు 7.52 ఎకరాల్లో ఉంది. స్థానికులు ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతుంటే పురపాలక అధికారులు అడ్డుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వ్యవహారం కోర్టులో నడుస్తోంది. ఈ తరహాలో పట్టణంలోని చాలా వరకు ఆక్రమణలకు గురయ్యాయి.
ఆక్రమణకు గురైన శివాలయం చెరువు
పరిరక్షణకు చర్యలు
పట్టణ పరిధిలోని చెరువు ఆక్రమణలపై దృష్టి సారిస్తాం. పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం. కొండయ్య, కృష్ణుడి చెరువులను ఉద్యానాలుగా అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకొస్తాం. - బి.బాలస్వామి, కమిషనర్
ఆక్రమణలు ఇలా..
అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో చెరువులు నామ రూపాలు లేకుండా పోతున్నాయి. పసర్ల, సిద్ధి, బట్టువాని గుంట చెరువులు కబ్జా కోరల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. మంచినీళ్లు, అనంతమ్మ, కొత్త కర్ర, శివాలయం, కోమటివాని చెరువులు క్రమేపీ ఆక్రమణలకు గురవుతున్నాయి. కొంత మంది స్వలాభం కోసం ఎర్ర చెరువు, గొల్లగూడెం చెరువులను పూడ్చి వేశారు. కొండయ్య చెరువు, కృష్ణుడి చెరువులను పార్కులుగా అభివృద్ధి చేస్తున్నారు. నాలుగేళ్ల కిందట చేపట్టిన ఈ పనులు నేటికీ పూర్తి కాలేదు. ఊర చెరువు ఆక్రమణకు గురికావడంతో పలువురు కోర్టును అశ్రయించారు. ఇదే తరహాలో భట్టువానికుంట చెరువులో పురపాలక సంఘం చెత్తను వేయడంతో స్థానిక రైతులు కోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం ఈ రెండు చెరువులు కోర్టు వివాదంలో ఉన్నాయి.
మొత్తం చెరువులు 25
పూర్తి కబ్జాలో 4
ఆక్రమణలకు గురైనవి 5
వివాదంలో ఉన్నవి 2
పూడ్చివేసినవి 2
పార్కులుగా అభివృద్ధి చేసినవి 2
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతు బజార్లకు పైసా విదల్చని జగన్
[ 20-04-2024]
జగన్ పార్టీ పేరులో మాత్రం ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్’ అంటూ హాలికుడికి అగ్రతాంబూలం కట్టబెట్టారు. వారిని మాత్రం అష్టకష్టాలు పెడుతున్నారు. రైతుకు ఉపాధి.. ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ప్రారంభించిన రైతు బజార్లను వైకాపా సర్కారు నిర్వీర్యం చేసింది. -
వారం అన్నావ్.. వమ్ము చేశావ్
[ 20-04-2024]
‘ తెదేపా సర్కారు అగ్రిగోల్డ్ బాధితులను పట్టించుకోలేదు. వచ్చేది మనందరి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే అందరికీ న్యాయం చేస్తాం. చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున చెల్లిస్తాం.’.. -
చిమిడిన అన్నం.. చిక్కీలు లేవు
[ 20-04-2024]
జగనన్న గోరుముద్దంటూ ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేస్తున్నా పాఠశాలల్లో చాలా మంది పిల్లలు భోజనం చేయకుండానే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. -
కరవు భత్యానికీ కరవే
[ 20-04-2024]
అధికారంలోకి వచ్చేందుకు అయిదేళ్ల కిందట జగన్ చెప్పని మాట లేదు... ఇవ్వని హామీలేదు. వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సీపీఎస్ మాట పక్కన పెడితే కనీసం ఉపాధ్యాయులకు రావాల్సిన కరవుభత్యం బకాయిలు విడుదల చేయకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. -
జోరుగా నామినేషన్లు
[ 20-04-2024]
ఉభయ జిల్లాల్లో శుక్రవారం నామినేషన్ల పర్వం జోరుగా సాగింది. రెండు జిల్లాల్లో ఎంపీ స్థానాలకు 6, ఎమ్మెల్యేకు 27.. మొత్తం 33 దాఖలయ్యాయి. -
రాష్ట్రమంతటా కూటమి పవనాలు
[ 20-04-2024]
వచ్చే ఎన్నికల్లో కూటమిదే విజయమని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ పేర్కొన్నారు. -
వైకాపాను ఓడించేందుకు ప్రజలు సిద్ధం
[ 20-04-2024]
వైకాపా అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు అన్నారు. -
ప్రచారం తప్ప.. ప్రగతి లేదు
[ 20-04-2024]
భీమవరం ఏడో వార్డు పరిధి మారుతీనగర్లో గత అయిదేళ్లలో అభివృద్ధి జాడలు కనిపించడంలేదు. గత పాలకమండలి హయాంలో ఆమోదం పొందిన పనులకు మళ్లీ టెండర్లు పిలిచి చేసినవి మినహా కొత్తగా చేపట్టినవి లేవు. -
పార్లమెంట్కు 2, అసెంబ్లీకి 6
[ 20-04-2024]
జిల్లాలో రెండో రోజు శుక్రవారం నామపత్రాల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కావూరి లావణ్య, స్వతంత్ర అభ్యర్థిగా బొకినాల కోటేశ్వరరావు నామపత్రాలను సమర్పించారు. -
శోభాయమానం... శ్రీనివాసుడి కల్యాణం
[ 20-04-2024]
కోనసీమ తిరుమలగా భాసిల్లుతున్న వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. -
వర్జీనియా పొగాకు గరిష్ఠ ధర రూ.263
[ 20-04-2024]
వర్జీనియా పొగాకుకు శుక్రవారం నాటి వేలంలో కిలో రూ.263 గరిష్ఠ ధర లభించింది. గత కొన్ని రోజులుగా పొగాకు ధరల్లో పెరుగుదల నమోదవుతోంది. -
రామరాజుకు అధిష్ఠానం పిలుపు
[ 20-04-2024]
ఉండి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిత్వంపై స్పష్టత రానుంది. ఈ సీటును నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజుకు కేటాయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.