logo

వైభవంగా దేశాలమ్మ జాతర

స్థానిక చింతలతోటలోని దేశాలమ్మ అమ్మవారి జాతర సోమవారం రాత్రి ప్రారంభమైంది. పలు మండపాలు ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా పరిషత్తు అధ్యక్షుడు కవురు శ్రీనివాస్‌, శాసనమండలి సభ్యుడు అంగర రామమోహన్‌, మాజీ

Published : 24 May 2022 05:23 IST

భక్తుల సందడి

పాలకొల్లు పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక చింతలతోటలోని దేశాలమ్మ అమ్మవారి జాతర సోమవారం రాత్రి ప్రారంభమైంది. పలు మండపాలు ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా పరిషత్తు అధ్యక్షుడు కవురు శ్రీనివాస్‌, శాసనమండలి సభ్యుడు అంగర రామమోహన్‌, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, డీసీఎంఎస్‌ మాజీ అధ్యక్షుడు యడ్ల తాతాజీ అమ్మవారిని దర్శించుకున్నారు.

భారీగా నిలిచిన ట్రాఫిక్‌.. జాతర సందర్భంగా లాకుసెంటర్‌ నుంచి పూలపల్లి వైజంక్షన్‌ వరకు బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రించారు. అయ్యప్పస్వామి గుడి వద్ద నుంచి బైపాస్‌ రహదారి మీదుగా వాహనాలు మళ్లించారు. దీంతో ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోవడంతో పోలీసులు క్రమబద్ధీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని