శంకుస్థాపనలతో సరి!
ప్రొద్దుటూరు పట్టణంపై ఆరు నెలల కిందట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిధుల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా గతేడాది డిసెంబరు 23వ తేదీన పర్యటించారు. మొత్తం 9 అభివృద్ధి పనులకు రూ.515.40 కోట్లు కేటాయిస్తూ, శిలాఫలకాలు ఆవిష్కరించారు.
రూ.515.40 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం శిలాఫలకాలు
టెండర్ల దశలోనే ఉన్నాయంటున్న అధికార యంత్రాంగం
ప్రొద్దుటూరు పట్టణంలో ముందుకు పడని ప్రగతి అడుగులు
న్యూస్టుడే, ప్రొద్దుటూరు
గతేడాది డిసెంబరు 23న శిలాఫలకాలను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి,
ఎమ్మెల్యే శివప్రసాదురెడ్డి (పాత చిత్రం)
ప్రొద్దుటూరు పట్టణంపై ఆరు నెలల కిందట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిధుల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా గతేడాది డిసెంబరు 23వ తేదీన పర్యటించారు. మొత్తం 9 అభివృద్ధి పనులకు రూ.515.40 కోట్లు కేటాయిస్తూ, శిలాఫలకాలు ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి చొరవతో ప్రగతి పరుగులు తీస్తుందని, ఏళ్లనాటి సమస్యలు పరిష్కారమవుతాయని పట్టణ వాసులందరూ సంతోషించారు. ఆరు నెలలు గడిచినా అతీగతి లేదు. అభివృద్ధి పథకాలకు పునాది రాయి పడలేదు. అర్ధ సంవత్సరమైనా దస్త్రాలకే పరిమితమైంది. అవి ఏ దశలో ఉన్నాయి...వాటి స్థితిగతులపై ‘న్యూస్టుడే’ క్షేత్రస్థాయి పరిశీలనలో పలు అంశాలు వెలుగు చూశాయి.
ప్రొద్దుటూలో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి
* ప్రొద్దుటూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో వసతులలేమి, సమస్యలు వెంటాడుతున్నాయి. వీటిని చక్కదిద్దడానికి రూ.20.50 కోట్లు కేటాయించారు. ఇది పూర్తయితే 300 పడకల ఆసుపత్రి కష్టాలు తీరినట్లే. టెండర్ల దశలో ఉందని ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ సురేంద్రనాథ్ తెలిపారు.
* ప్రొద్దుటూరు పట్టణంలో 70 ఏళ్లనాటి తాగునీటి పైపులైనులో కలుషిత నీటి సమస్యను అధిగమించేందుకు రూ.119 కోట్లతో 171 కి.మీ. కొత్తపైపులైను, 4 ఉపరితల జలాశయాలు నిర్మించాల్సి ఉంది. ఇక్కడ 106 ఏళ్ల నుంచి మురుగునీటి పారుదల వ్యవస్థ సరిగ్గా లేదు. పారిశుద్ధ్యం మెరుగుపరచడంతోపాటు దోమల బెడద నుంచి ప్రజలను కాపాడేందుకు 5 ప్రధాన మురుగు కాలువల ఆధునికీకరణ, మురుగునీటి శుద్ధి కర్మాగారం రూ.163 కోట్లతో నిర్మించాల్సి ఉంది. శిథిలావస్థలో ఉన్న 40 ఏళ్ల నాటి కూరగాయల మార్కెట్ను తొలగించి కొత్త మార్కెట్, వాణిజ్య సముదాయ భవనాల ఏర్పాటుకు రూ.50.90 కోట్లు కేటాయించారు. సీసీ రహదారులు, కల్వర్టులు, డ్రైన్లు తదితర అభివృద్ధి పనులకు పురపాలక సాధారణ, 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.15 కోట్లు కేటాయించారు. ఇవి నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిపై పుర పాలక సంఘం కమిషనర్ పి.వి.రమణయ్య మాట్లాడుతూ పైన మూడు పనులు టెండర్ల దశలో ఉన్నాయని, రూ.15 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులు 90 శాతం పూర్తయ్యాయని ఆయన వివరించారు.
పెన్నానదిపై వంతెన నిర్మించాల్సిన ప్రొద్దుటూరు నుంచి ఆర్టీపీపీకెళ్లే దారిదే
* ప్రొద్దుటూరులో పెన్నానదిపై నుంచి ఆర్టీపీపీకెళ్లే మార్గం వరదల ధాటికి కోతకు గురై రాకపోకలు నిలిచిపోయాయి. దీన్ని అధిగమించడానికి నదిపై ఓవరు బ్రిడ్జి కట్టడానికి రూ.53 కోట్లు కేటాయించారు. ఈ పనులకు టెండర్లు పిలవాల్సి ఉందని రహదారులు, భవనాలశాఖ ఈఈ నరసింహారెడ్డి వివరించారు.
* పట్టణంలోని యోవేవి వైఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల్లో గదుల కొరత వేధిస్తోంది. దీన్ని అధిగమించేందుకు అదనపు తరగతి గదులు, వసతి భవనాల కల్పనకు రూ.66 కోట్లు కేటాయించారు. టెండర్ల దశలో ఉందని యోవేవి ఎంబీఏ విభాగం అధికారి వెంకటసుబ్బారెడ్డి తెలిపారు.
దుర్వాసన, దోమలకు ఆవాసమైన కొత్తపల్లె మురుగు కాలువ
* పట్టణంలో 1966లో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం కూలిపోయే స్థితిలో ఉంది. కొత్త భవనాలు నిర్మించి, వసతుల కల్పనకు రూ.24 కోట్లు కేటాయించారు. భూసామర్థ్య పరీక్షలు పూర్తయి, టెండర్ల దశలో ఉందని కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ చెబుతున్నారు.
* పట్టణంలోని 1986 నాటి ఆర్టీసీ బస్టాండు భవనం పైకప్పు సిమెంటు పెచ్చులూడి ప్రయాణికులపై పడేవి. సమస్య పరిష్కారానికి రూ.4.50 కోట్లు కేటాయించారు. ఇది పూర్తయితే రోజుకు 60 వేల మంది ప్రయాణికులకు సౌకర్యానిస్తుంది. టెండర్ దశలో ఉందని ఆర్టీసీ భవనాల విభాగం ఈఈ వెంకటరమణ చెప్పారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనాసురుడికి పగ్గాలు.. కన్నీళ్లలో చేనేత మగ్గాలు!
[ 24-04-2024]
‘నేను ఉన్నాను... నేను విన్నాను’ అంటూ సీఎం జగన్ చేనేత కార్మికులను నమ్మించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నట్టేట ముంచారు. గత ప్రభుత్వాల హయాంలో అమలు చేసిన పథకాలకు మంగళం పాడేశారు. -
ఉన్నవి రద్దు చేసి... పక్క జిల్లాలకు సర్దేసి..!
[ 24-04-2024]
‘జాబ్ క్యాలెండరు విడుదల చేసి ఏటా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తాం, డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తాం’ అంటూ హామీలిచ్చి గద్దెనెక్కిన సీఎం జగన్ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. -
రేపు రాజంపేట, రైల్వేకోడూరుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాక
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరుకు రానున్నారు. -
రథంపై దాశరథి... మురిసిన భక్తజన హృది!
[ 24-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం రథోత్సవం కనులపండువగా జరిగింది. -
పెద్దిరెడ్డి కాళ్ల కింద పీలేరు ఆత్మగౌరవం!
[ 24-04-2024]
పీలేరు ఆత్మగౌరవాన్ని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్ల కింద పెట్టారని, ఆయన చేతిలో కీలుబొమ్మగా మారారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, తెదేపా పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిశోర్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. -
గోప్యంగా సునీత ప్రచారం!
[ 24-04-2024]
మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఎన్నికల ప్రచారాన్ని గోప్యంగా నిర్వహిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నేతలను కలుస్తూ మద్దతు కూడగడుతున్న ఆమె.. -
వంతెనకేదీ మోక్షం... జగన్ పాలనే సాక్ష్యం!
[ 24-04-2024]
కడప - తాడిపత్రి జాతీయ రహదారిలో పాపఘ్ని నదిపై వంతెన నిర్మాణం పూర్తికాకపోవడంతో రాకపోకలకు ఇక్కట్లు తప్పడం లేదు. 2021, నవంబరు 20న వరద ప్రవాహనికి ఇక్కడ పాత వంతెన కూలి పోయింది. -
కడపలో చెడ్డీగ్యాంగ్ కలకలం
[ 24-04-2024]
జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ సంచారంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయిదు రోజుల కిందట కడప నగరంలోని ఓ శివారు ప్రాంతంలోని బహుళ అంతస్తు భవనంలోకి ఈ గ్యాంగ్ ప్రవేశించినట్లు సీసీ పుటేజీల ద్వారా తెలిసింది. -
అభ్యర్థుల ఆస్తిపాస్తులివే
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల పర్వం నడుస్తోంది. మంగళవారం పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అఫిడవిట్లు దాఖలు చేస్తూ అందులో ఆస్తులు, కేసుల వివరాలు పేర్కొన్నారు. -
వైకాపా నేత... మార్కెట్ మేత
[ 24-04-2024]
అవినీతి లేని పాలన అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా పసిడిపురి ప్రొద్దుటూరులో తాత్కాలిక కూరగాయల మార్కెట్ ఏర్పాటు వ్యవహారమంతా ప్రజాప్రతినిధి వర్గీయులకు ఆదాయ వనరుగా మారిందనేది బహిరంగ రహస్యం. -
అయిదేళ్లు జగన్కు అధికారం... ఆవిరైంది జనానికి ఆహ్లాదం..!
[ 24-04-2024]
వైకాపా పాలనలో ఉద్యానవనాలు అంతులేని నిర్లక్ష్యానికి గురయ్యాయి. నిర్వహణను గాలికొదిలేయడంతో పార్కుల పరిస్థితి దయనీయంగా మారింది. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు వచ్చే జనం కూర్చోడానికి కనీసం బల్లల్లేని దుస్థితి నెలకొంది. -
సమస్యలు అనేకం... ప్రభుత్వానిదే పాపం
[ 24-04-2024]
-
పడకేసిన ప్రగతి... జగన్ పాలనలో అథోగతి
[ 24-04-2024]
పురపాలక ఆరో వార్డులోని కొత్తకొట్టాలు, వాసవీనగర్లో సమస్యలు వేధిస్తున్నాయి. ప్రధానంగా కొత్తకొట్టాలు, చిన్నమసీదు వీధుల మధ్య ప్రవహించే ఎర్రచెరువు అలుగువంక స్థానికులకు మురుగుకాలువగా ఉపయోగపడుతోంది. -
ఏఎస్పీ కేశప్పపై ఎంసీసీ అధికారుల విచారణ
[ 24-04-2024]
ఏఎస్పీ కేశప్పపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు అధికారులు, ఎంపీడీవో భానుప్రసాద్ మంగళవారం విచారణ చేపట్టారు. మదనపల్లె మండలం బొమ్మనచెరువులో ఆదివారం -
ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
[ 24-04-2024]
సీఎం జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డిపై వీరపునాయునిపల్లెకు చెందిన నాగప్రసాద్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం