రహదారి విస్తరణలో ఉద్రిక్తత!
ప్రొద్దుటూరు పట్టణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న రహదారి విస్తరణ పనుల్లో భాగంగా సోమవారం ఉదయం మహబూబ్ సుబానీ దర్గా ప్రహరీని అధికారులు తొలగించే ప్రయత్నాన్ని వైకాపా మైనార్టీ కౌన్సిలర్లు అడ్డుకోవడంతో ఒక్కసారిగా
ప్రొద్దుటూరులో జెండా చెట్టు ప్రహరీ కూల్చే ప్రయత్నం అడ్డగింత
పుర వైస్ఛైర్మన్తోపాటు కౌన్సిలర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ధర్నా చేస్తున్న వైకాపా వైస్చైర్మన్ ఖాజా, కౌన్సిలర్లు, ముస్లిం మైనార్టీలు
ప్రొద్దుటూరు పట్టణం/నేరవార్తలు, న్యూస్టుడే: ప్రొద్దుటూరు పట్టణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న రహదారి విస్తరణ పనుల్లో భాగంగా సోమవారం ఉదయం మహబూబ్ సుబానీ దర్గా ప్రహరీని అధికారులు తొలగించే ప్రయత్నాన్ని వైకాపా మైనార్టీ కౌన్సిలర్లు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో కౌన్సిలర్లు మహమ్మద్గౌస్, గౌస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడికి చేరుకున్న పురపాలక సంఘం వైస్ఛైర్మన్ ఖాజా ఆధ్వర్యంలో మైనార్టీ కౌన్సిలర్లు ఇర్ఫాన్బాషా, మునీర్, పురపాలక సంఘం మాజీ ఛైర్మన్ జబీవుల్లా, మైనార్టీ నాయకులు ఫరీద్, మున్నా తదితరులు రోడ్డుపై బైఠాయించారు. సమాచారమందుకున్న డీఎస్పీ ప్రసాదరావు ప్రత్యేక పోలీస్ పార్టీతో ఘటనాస్థలానికి చేరుకుని ధర్నాను విరమించాలని కోరారు. అనంతరం వారిని పోలీసులు బలవంతంగా పోలీసు వాహనం ఎక్కించగా వైస్ ఛైర్మన్తోపాటు పలువురు ప్రతిఘటించడంతో తోపులాట చోటుచేసుకుంది. పోలీసు వాహనాన్ని చాపాడు పోలీసుస్టేషన్కు తీసుకెళ్లే సమయంలో సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు, కొత్తపల్లె సర్పంచి కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మార్గమధ్యలో అడ్డుకోవడంతో ఆయనను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో వైకాపా కౌన్సిలర్లకు మద్దతు తెలిపేందుకు తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రవీణ్కుమార్రెడ్డి మార్గమధ్యలో పోలీస్ వ్యాన్ ఎక్కగా, అందరినీ రాజుపాళెం పోలీస్స్టేషన్కు తరలించారు. దీంతో వ్యాన్లో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంఘటనపై సమాచారం అందుకున్న ఎంపీ అవినాష్రెడ్డి వైస్ ఛైర్మన్ ఖాజాకు ఫోన్ చేసి ఆరా తీశారు. అనంతరం ఎంపీ పోలీసు అధికారులతో మాట్లాడగా అందరినీ ప్రొద్దుటూరు వన్టౌన్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వైస్ ఛైర్మన్ ఖాజా, కౌన్సిలర్లు మాట్లాడుతూ తాము పోలీస్స్టేషన్ నుంచి బయటకు వెళ్లబోమని, పురపాలక కమిషనర్ సున్నితమైన అంశాలను మైనార్టీ కౌన్సిలర్లతో చర్చించకుండా దర్గా ప్రహరీని ఎందుకు కూల్చే ప్రయత్నం చేశారని ప్రశ్నించారు. డీఎస్పీ వైఖరి సరిగా లేదని అన్ని పోలీస్స్టేషన్లను తిప్పడానికి మేమేమన్నా ఉగ్రవాదులమా అని వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీస్స్టేషన్ ముందు కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. పురపాలక కమిషనర్ వివరణ ఇచ్చేవరకు తాము ఇక్కడ నుంచి కదిలేది లేదని పట్టుబట్టారు. వీరికి మద్దతుగా పుర పాలక సంఘం మాజీ ఛైర్మన్ షేఠ్ గురివిరెడ్డి పోలీస్స్టేషన్కు తరలివచ్చారు. తాను పోలీస్స్టేషన్కు వచ్చేది లేదని, తన ఛాంబర్ వద్దే కౌన్సిలర్ల కోసం వేచి చూస్తానని కమిషనర్ పోలీస్ అధికారులకు స్పష్టం చేయడంతో పోలీస్స్టేషన్ వద్దనే నిరసనకారులు ఉండిపోయారు.
నిరసనకారులను లాక్కెళుతున్న పోలీసులు
యథాస్థితికి సమ్మతం
ప్రొద్దుటూరులో జెండా చెట్టు ప్రహరీ తొలగించే అంశంపై వైకాపా మైనార్టీ కౌన్సిలర్లు ఆందోళన చేస్తుండంతో సాయంత్రం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి కౌన్సిలర్లను కలిశారు. ఎమ్మెల్సీ రమేష్యాదవ్, కౌన్సిలర్ మురళీధర్రెడ్డి మైనార్టీ కౌన్సిలర్లను కలిశారు. ఎమ్మెల్యే వైస్ ఛైర్మన్ ఖాజాతో పాటు కౌన్సిలర్లు, మత పెద్దలతో చర్చించారు. ఎమ్మెల్యేతో మాట్లాడిన అనంతరం వైస్ ఛైర్మన్ ఖాజా మాట్లాడుతూ జెండా చెట్టును తొలగించడంలేదని.. యథాస్థితిలో ఉంచుతామని కమిషనర్కు చెబుతానని ఎమ్మెల్యే చెప్పినట్లు తెలిపారు. కమిషనర్, డీఎస్పీపై చర్య తీసుకోవాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే రాచ మల్లు శివప్రసాదురెడ్డి రెండు సార్లు గెలుపొందడంలో మైనారిటీలు కీలక పాత్ర పోషించారని తెదేపా నాయకుడు ఖలీల్ అన్నారు. అలాంటి మైనారిటీలు ఉపాధి పొందుతున్న కూరగాయల మార్కెట్ను కూలదోశారని, జామియా మసీదు ఆస్తులు దెబ్బతిన్నాయని, దర్గా పడగొట్టేయత్నం చేశారన్నారు. దీనికి నిరసనగా తన చెప్పుతో తాను కొట్టుకున్నారు. వైకాపా మైనారిటీ నాయకులు రాజీనామా చేసి అందరినీ కలుపుకొని పోరాడాలని పిలుపునిచ్చారు.
నిరసనల వెల్లువ
దర్గా ప్రహరీ కూల్చివేతకు ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి, పురపాలక సంఘం అధికారులను అరెస్టు చేయాలని తెదేపా కడప పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు లింగారెడ్డి డిమాండు చేశారు. దీనిపై తెదేపా నాయకులందరితో కలిసి పోరాడతామన్నారు. ఎమ్మెల్యే మోసపూరిత రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముక్తియార్ విమర్శించారు. వైకాపా కౌన్సిలర్లకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి రావాలని తమ మద్దతు తెలుపుతామన్నారు. వైస్ ఛైర్మన్ ఖాజా మాట్లాడుతూ ముస్లిం కమ్యూనిటీకి ఇబ్బంది జరిగితే తమ పదవులకు రాజీనామా చేస్తామని, అవసరమైతే ప్రాణాలర్పిస్తామన్నారు. కమిషనర్ సంజాయిషీ ఇవ్వకపోతే ఎంపీ అవినాష్రెడ్డికి చెప్పి తమ పదవులకు రాజీనామా చేస్తామన్నారు. మా ఎమ్మెల్యే ఇంతవరకు మమ్మల్ని పట్టించుకోలేదన్నారు. కౌన్సిలర్ మహమ్మద్గౌస్ మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా జెండా చెట్టు ప్రహరీ పడగొట్టడం సరికాదన్నారు. పురపాలక సంఘం మాజీ ఛైర్మన్ షేఠ్ గురివిరెడ్డి మాట్లాడుతూ జెండా చెట్టు ప్రహరీ విషయాన్ని కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసి ఉంటే బాగుండేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుగుబాటు మొదలైంది.. జగన్ ఇంటికి పోవడం ఖాయం: చంద్రబాబు
[ 25-04-2024]
రాయలసీమలో తిరుగుబాటు మొదలైందని.. జగన్ ఇంటికి పోవడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
వైకాపాని పాతాళానికి తొక్కేద్దాం.. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం: పవన్
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దాం.. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
[ 25-04-2024]
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
[ 25-04-2024]
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
[ 25-04-2024]
సీఎం జగన్ వైకాపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు గురువారం పులివెందుల రానున్నారు. -
మీ బిడ్డనని గారాలు... నీ గడ్డపైనే ఘోరాలు!
[ 25-04-2024]
రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా నరేగా నుంచి రూ.26.02 కోట్లతో 349 మట్టి పనులను వైకాపా నేతలకు పంచిపెట్టారు. -
ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం
[ 25-04-2024]
మాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎన్డీఏ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు -
నేడు రాజంపేట, రైల్వేకోడూరులో ప్రజాగళం
[ 25-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరు పర్యటనకు రానున్నారు -
అక్రమాలకు పాల్పడకుండా గెలిచే సత్తా మీకుందా?
[ 25-04-2024]
అక్రమాలకు పాల్పడకుండా పులివెందులలో గెలిచే సత్తా మీకుందా? అని తెదేపా పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి సీఎం జగన్కు సవాల్ విసిరారు -
నీళ్లు గరళం... పారిశుద్ధ్యం అధ్వానం
[ 25-04-2024]
నియోజకవర్గ కేంద్రాలు ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు పట్టణ ప్రాంతాల్లోని కాలనీల ప్రజలు కనీస వసతులకు నోచుకోలేక తల్లడిల్లుతున్నారు -
జగన్ పాలనలో పర్యాటకాభివృద్ధి శూన్యం
[ 25-04-2024]
పర్యాటకుల నుంచి ఛార్జీలు, పన్నులు తదితరాల పేరుతో ఆదాయం వస్తున్నా ఆ రంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. -
జగనన్న హామీలు...నీటి మూటలు
[ 25-04-2024]
ఆరునూరైనా అభివృద్ధి చేసి తీరుతాం.. మైదుకూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామంటూ జగన్ ప్రభుత్వంలో పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!