logo

నిబంధనల మేరకు బదిలీల ప్రక్రియ

అన్ని ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న బదిలీల ప్రక్రియ నిబంధనల మేరకు నిర్వహించి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ విజయరామరాజు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జేసీ సాయికాంత్‌వర్మతో క

Published : 28 Jun 2022 06:04 IST

వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ విజయరామరాజు, పక్కన జేసీ సాయికాంత్‌వర్మ

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: అన్ని ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న బదిలీల ప్రక్రియ నిబంధనల మేరకు నిర్వహించి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ విజయరామరాజు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జేసీ సాయికాంత్‌వర్మతో కలిసి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలన్నింటిలో ప్రతి మండలం ముందుండాలని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి అర్జీదారులు సంతృప్తి చెందేలా చూడాలని ఆదేశించారు. అనంతరం పలు అంశాలపై సూచనలిచ్చారు. కార్యక్రమంలో జీఎన్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేక కలెక్టర్‌ రామ్మోహన్‌, డీఆర్‌డీఏ పీడీ మధుసూదన్‌రెడ్డి, అడా వైస్‌ఛైర్మన్‌ శ్రీలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని