గాలికొదిలేశారు!
జిల్లాలోని పురపాలక సంఘాలకు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పథకం ద్వారా వాహనాలు రావడంతో అధికారులు పాత చెత్త సేకరణ, తరలింపు యంత్రాలను గాలికొదిలేశారు. టన్నుల కొద్ది చెత్తను తరలించే ట్రాక్టర్లు, డంపర్బిన్లు, ఈ-ఆటోలను మూలన పడేశారు. వీటికి సకాలంలో మరమ్మతులు
పురపాలక సంఘాల్లో మూలకు చేరిన రూ.లక్షల విలువైన యంత్రాలు
ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని చెత్త తరలింపు ట్రాక్టర్లు, డంపర్లు
గుట్టుచప్పుడు కాకుండా గుజిరీకి తరలిపోతున్న ఆటోలు, విడిభాగాలు
పేరుకుపోతున్న చెత్తనిల్వలు, దుమ్ము, ధూళితో పురప్రజల అవస్థలు
న్యూస్టుడే, రాయచోటి, రాజంపేట
జిల్లాలోని పురపాలక సంఘాలకు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పథకం ద్వారా వాహనాలు రావడంతో అధికారులు పాత చెత్త సేకరణ, తరలింపు యంత్రాలను గాలికొదిలేశారు. టన్నుల కొద్ది చెత్తను తరలించే ట్రాక్టర్లు, డంపర్బిన్లు, ఈ-ఆటోలను మూలన పడేశారు. వీటికి సకాలంలో మరమ్మతులు చేయించకపోవడంతో చాలావరకు గుజిరీకి వెళ్లిపోయాయి. రూ.లక్షల విలువైన యంత్రాలు నిరుపయోగంగా మారడంతో పట్టణాల్లో రోజులతరబడి చెత్త నిల్వలు పేరుకుపోతుండగా, ప్రధాన రహదారులపై మట్టి, ఇసుక మేటలు వేస్తున్నాయి. ఫలితంగా పట్టణవాసులు రాకపోకలు సాగించేందుకు నిత్యం అవస్థలు పడుతున్నారు. ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నుల ద్వారా వస్తున్న ఆదాయంతోపాటు 14, 15వ ఆర్థిక సంఘాల నిధులతో మరమ్మతులకు గురైన రూ.లక్షల విలువ చేసే యంత్రాలను బాగు చేసే దాఖలాలు కనిపించకపోవడం గమనార్హం.
ఇది జిల్లా కేంద్రమైన రాయచోటి పురపాలక సంఘం కార్యాలయ ఆవరణలో మూలన పడేసిన రహదారులపై దుమ్ము, మట్టిని ఊడ్చే యంత్రం. రూ.5 లక్షలకుపైగా విలువైన ఈ యంత్రం ప్రారంభ రోజున అధికారి చేసిన తప్పిదానికి చెట్టును ఢీకొనడంతో చిన్నపాటి మరమ్మతులకు గురైంది. అప్పటి నుంచి అధికారులు పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా మారింది.
* జిల్లాలో రాయచోటి, రాజంపేట, మదనపల్లె పురపాలక సంఘాలున్నాయి. ఒక్కో పురపాలక సంఘం నుంచి ప్రతిరోజు కనీసం 20 నుంచి 40 మెట్రిక్ టన్నులకుపైగా చెత్త ఉత్పత్తి అవుతోంది. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను నివాసాల సమీపంలో ఏర్పాటు చేసిన డస్టు బిన్లకు తరలిస్తున్నారు. అక్కడ నుంచి డంపర్బిన్ (పెద్ద లారీ)ల ద్వారా పట్టణ సమీపంలోని డంపింగ్ యార్డుకు తరలించాల్సి ఉంది. ఏళ్ల తరబడి మరమ్మతులు చేపట్టపోవడంతో రూ.లక్షల విలువైన ప్రభుత్వ వాహనాలు తుప్పు పట్టి నిరుపయోగంగా మారుతుండడంతో పట్టణాల్లో సకాలంలో చెత్త సేకరణ జరగక ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
తుప్పు పట్టి కనిపిస్తోంది రాయచోటి పురపాలక సంఘం ఆవరణలోని జెసిబి . మరమ్మతులకు గురవ్వడంతో గత మూడేళ్లుగా ఇలా గాలికొదిలేశారు. రూ.లక్షలు విలువ చేసే ఈ యంత్రం అద్దాలు పగలిపోగా, కొన్ని విడిభాగాలు మాయం కావడంతో ఇలా వృథాగా పడింది.
* రాయచోటి పట్టణంలో ఇటువంటి వాహనాలు మూడు ఉండగా, వాటిల్లో ఒకటి ఏడాదిన్నర కిందట మరమ్మతులకు గురై మూలకు చేరింది. వీధుల్లో చెత్తను సేకరించే 9 ఈ-ఆటోల్లో ఏడు వృథాగా పడి ఉన్నాయి. చెత్తను డంపింగ్యార్డుకు తరలించేందుకు 8 ట్రాక్టర్లు ఉండగా, వాటిల్లో నాలుగు మరమ్మతులకు గురవ్వడంతో ఇటీవల గుట్టుచప్పుడు కాకుండా గుజిరీకి వేసేశారు.
* రాజంపేట పురపాలక సంఘంలో మూడు ట్రాక్టర్లు, రెండు డంపర్బిన్లు ఉన్నాయి. వీటిల్లో ఒక డంపర్ బిన్, ఒక ట్రాక్టరుతోపాటు చెత్త సేకరణ వ్యాన్లు మరమ్మతులకు గురికావడంతో మూలన పడేశారు.
* మదనపల్లె పురపాలక సంఘంలో 34 వార్డులుండగా ఇక్కడ రోజు 40 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. పాత వాహనాలను సక్రమంగా వినియోగించకపోవడంతోపాటు చాలా వరకు యంత్రాలు వినియోగించకపోవడంతో మూలకు చేరాయి.
ఒక్కరోజూ వినియోగంలో లేవు...
* రాయచోటి, రాజంపేట పట్టణాలకు మూడేళ్ల కిందట రహదారులపై చెత్త, దుమ్ము, ధూళి శుభ్రం చేసే రూ.5 లక్షలకుపైగా విలువ చేసే యంత్రాలొచ్చాయి. రాయచోటిలో వాహనాన్ని ప్రారంభించే రోజు ఓ అధికారి నడిపి నేరుగా చెట్టును ఢీకొనడంతో ముందు భాగంలో వాహనం దెబ్బతినడంతో ఒక్కరోజు కూడా రోడ్డుపైకి రాకుండానే నేటికీ పురపాలక సంఘం కార్యాలయంలోనే మూలుగు తోంది. ఇక్కడ పట్టణ రహదారులపై మట్టి, ఇసుకను తొలగించే రూ.5 లక్షలు విలువ చేసే జేసీబీ కేవలం చిన్నపాటి మరమ్మతులకు గురవ్వడంతో కార్యాలయం ఎదుట పడేశారు. గత మూడేళ్లుగా పట్టించు కునేవారు లేకపోవడంతో అద్దాలు పగిలిపోగా, ఇతర సామగ్రి తుప్పుపట్టింది.
* రాజంపేట పురపాలక సంఘానికి కేటాయించిన వాహనం ఇంతవరకు వినియోగించిన దాఖలాల్లేవు. స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలో వృథాగా పడేయడంతో తప్పుపట్టింది.
కమిషనర్లదే బాధ్యత...
పురపాలక సంఘాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు వినియోగించే వాహనాలు, యంత్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన బాధ్యత కమిషనర్లదే. మరమ్మతులకు గురైన వాహనాలను సకాలంలో బాగు చేయించి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు వారే చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా వాహనాలు మూలన పడేసినట్లు మా దృష్టికి వస్తే ఆయా కమిషనర్లతో చర్చించి మరమ్మతులకు తక్షణ చర్యలు తీసుకుంటాం.
- వీవీఎస్ మూర్తి, ఆర్డీ, పురపాలకశాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
[ 28-03-2024]
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
[ 28-03-2024]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
కరవు సీమగా మార్చేసిన పాపం జగన్దే
[ 28-03-2024]
‘నేను రాయలసీమ వాసిని. చిత్తూరు జిల్లాలో పుట్టాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమను రత్నాలసీమగా మారిస్తే, నేడు సాగు, తాగునీరు లేక కరవు సీమగా మార్చేసిన పాపం సీఎం జగన్దే’ అని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. -
సీఎం ఇలాకా.... కుర్చీలు ఖాళీగా!
[ 28-03-2024]
సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సుయాత్ర... అందులోనూ ప్రారంభం అదిరేపోయేలా ఉండాలనుకున్న వైకాపా నేతలు... సీఎం ఇలాకాలోని ఐదు నియోజకవర్గాల మీదుగా సాగే యాత్రలో ప్రత్యేకించి ప్రొద్దుటూరులో కడప పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల నుంచి జనసమీకరణ... -
వైకాపా సేవకు బస్సులు... ప్రయాణికులకు ఇక్కట్లు
[ 28-03-2024]
సీఎం జగన్ బహిరంగ సభలకు జిల్లా నుంచి నాలుగు రోజులపాటు 6 డిపోల నుంచి 90 ఆర్టీసీ బస్సులను తరలించడంతో గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
ముడిపట్టు రాయితీకి మంగళం!
[ 28-03-2024]
వేలాది చేనేత కుటుంబాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. బడుగు జీవుల వెతలు, కన్నీటి ఘోషను పాలకులు ఆలకించడం లేదు. -
భాజపా జమ్మలమడుగు అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి
[ 28-03-2024]
భాజపా జమ్మలమడుగు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, బద్వేలు నియోజకవర్గ అభ్యర్థిగా బొజ్జా రోషన్నకు టిక్కెట్లు లభించాయి. -
సీ విజిల్ ఫిర్యాదులకు సత్వర పరిష్కారం : కలెక్టర్
[ 28-03-2024]
రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి జిల్లాలో సీ విజిల్, ఎన్ కోర్, ఈ ఎస్ఎంఎస్ల ద్వారా అందిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరిస్తున్నామని ఎన్నికల అధికారి, కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. -
అనుమతులతో పనేంటి... తవ్వేద్దాం
[ 28-03-2024]
ఒంటిమిట్ట చెరువులో గత మూడు రోజులుగా అడ్డగోలుగా మట్టి తవ్వేస్తున్నారు. -
ఇళ్లు ధ్వంసం చేయడం సిగ్గుచేటు
[ 28-03-2024]
బద్వేలు పట్టణంలో ఇళ్లు లేని నిరుపేదలైన దివ్యాంగులు దరఖాస్తులు చేసుకుని విసిగి వేసారిపోయారని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మండిపడ్డారు. -
‘రాయలసీమను ఎడారిగా మార్చిన ప్రభుత్వాలు’
[ 28-03-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోగా, అటు 400 స్థానాలు వస్తాయని, ఇటు 175 స్థానాలు వస్తాయని చెబుతూ మభ్యపెడుతున్నారని రాకపా రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్రెడ్డి ఆరోపించారు. -
అనర్హులకు మూల్యంకన విధులపై విచారణ
[ 28-03-2024]
‘సస్పెండైనవారు... పది జవాబుపత్రాలు దిద్దుతారంట’ శీర్షికన బుధవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై పదోతరగతి పరీక్షల జిల్లా పరిశీలకులు వెంకటకృష్ణారెడ్డి స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం