చెయ్యేరులో భూగర్బ చెక్ డ్యాంలు లేనట్లేనా...?
ఏటా వరద నీరు కళ్లెదుటే సోమశిలలోకి వృథాగా కలిసిపోతోంది. ఇటు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు, రైతులకు గానీ ఉపయోపడకుండా పోతోంది. ఏటా భారీ వర్షాలు పడినప్పుడు చెయ్యేరు నది నుంచి సుమారు 30 నుంచి 50 టీఎంసీల నీరు సోమశిల వెనుక జలాల్లోకి
అనుమతులివ్వని భూగర్భ జలవనరులశాఖ
ఏటా వరద నీరు సోమశిలలో కలవాల్సిందే
నదిలో వృధాగా పోతున్న నీరు
రాజంపేట, న్యూస్టుడే : ఏటా వరద నీరు కళ్లెదుటే సోమశిలలోకి వృథాగా కలిసిపోతోంది. ఇటు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు, రైతులకు గానీ ఉపయోపడకుండా పోతోంది. ఏటా భారీ వర్షాలు పడినప్పుడు చెయ్యేరు నది నుంచి సుమారు 30 నుంచి 50 టీఎంసీల నీరు సోమశిల వెనుక జలాల్లోకి చేరుతోంది. దీనివల్ల నష్టం తప్ప ప్రయోజనం లేకుండాపోతోది. ఎలాగైనా వృథాగా వెళ్లే నీటికి ఎక్కడికక్కడే అడ్డుకట్ట వేసి భూగర్భ జలమట్టాన్ని పెంచాలని అధికారులు భావించారు. ఆమేరకు ప్రజా ప్రతినిధులు కూడా సిద్ధమయ్యారు. ప్రతిపాదనలూ పంపారు. కానీ చెయ్యేరు నదిలో భూగర్భ చెక్డ్యాంలను(సబ్ సర్ఫేస్ డ్యాం) నిర్మించడానికి భూగర్భ జలవనరులశాఖ అనుమతి ఇవ్వలేదు. దీంతో ఈ ప్రతిపాదన అటకెక్కింది.
* చెయ్యేరు నదిపై బాదనగడ్డ వద్ద అన్నమయ్య జలాశయం ఉంది. ఈ జలాశయం సామర్థ్యం కేవలం 2.24 టీఎంసీలు మాత్రమే కావడంతో అదనంగా ప్రాజెక్టుకు వచ్చే నీటిని నదిలోకి విడుదల చేస్తారు. ఆ నీరంతా నేరుగా సోమశిలలో కలుస్తుంది. నదీపరివాహక ప్రాంతాల వెంబడి చెరువులు, ఊటకాలువలు వంటివి ఎన్నో ఉన్నాయి. సాధారణంగా నదిలో నీరు పారితే చెరువులు, ఊట కాలువల్లో నీరు సమృద్ధిగా ఉంటుంది. సక్రమంగా కాలువలు లేకపోవడంతో ఆ నీరంతా సోమశిలలో కలుస్తోంది.
రెండేళ్ల కిందటే రూ.95 కోట్లతో ప్రతిపాదనలు
సోమశిలలోకి కలిసే నీటికి అడ్డుకట్ట వేయడానికి రెండేళ్ల క్రితం నదిలో అక్కడక్కడా సబ్సర్ఫేస్ డ్యాంలను నిర్మించాలని భావించి అధికారులతో పాటు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే తదితరులు పరిశీలించారు. సుమారు రూ.95 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. చెయ్యేరు నదిపై సబ్సర్ఫేస్ చెక్డ్యాంలను నిర్మించవచ్చా..? నిర్మించడానికి అవకాశముందా...? నిర్మిస్తే నీరు నిల్వ ఉంటుందా..? అనే విషయాలపై భూగర్భ జలవనరులశాఖ పరిశీలించింది. ఇక్కడ సబ్సర్ఫేస్ చెక్డ్యాంలను నిర్మించడానికి అనువైన పరిస్థితులు లేవని, ఇక్కడ నిర్మించినా ప్రయోజనం ఉండదనే భావనతో ఆశాఖ అధికారులు చెప్పినట్లు సమాచారం. దీంతో బృహత్తరమై ఈ పథకం ముందడుగు వేయలేదు.
నీటికి అడ్డుకట్ట వేస్తే ప్రయోజనం
ప్రస్తుతం అన్నయ్య జలాశయం కట్ట తెగిపోవడంతో పైతట్టు ప్రాంతం నుంచి వస్తున్న నీరు చెయ్యేరునదిలో సాఫీˆగా సాగుతోంది. ఈ నీటి వల్ల సమీపంలోని బోర్లలో నీటి మట్టం పెరిగినట్లు రైతులు చెబుతున్నారు. వర్షాకాలంలో చెయ్యేరు నదిలో భారీగా ప్రవహించే నీటికి మరో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అడ్డుకట్ట వేయగలిగితే అటు పైతట్టు, ఇటు దిగవ ప్రాంత ప్రజల, రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరుతాయి.
అనుమతులు ఇవ్వలేదు
చెయ్యేరునదిలో ప్రవహించే నీటికి అడ్డుకట్ట వేస్తూ ఎక్కడి నీటిని అక్కడే భూమిలోకి ఇంకింప చేయడానికి సబ్సర్ఫేస్ చెక్డ్యాంలను నిర్మించాలని భావించాం. నదిలో వీటిని నిర్మించడానికి అన్ని కోణాల్లో పరిశీలించిన భూగర్భ జలవనరులశాఖ అనుమతి ఇవ్వలేదు.
-రవికిరణ్, ఈఈ, అన్నమయ్య జలాశయం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
[ 20-04-2024]
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
జనంపై జగనాసురుడి దండయాత్ర!
[ 20-04-2024]
జగన్ అయిదేళ్ల పాలనలో ఊరికో అసురుడు తయారయ్యాడు... కనిపించిన భూములన్నింటికీ కబ్జా చేశారు... సహజ వనరులను ఇష్టారీతిన కొల్లగొట్టారు... తమ ఆగడాలపై ప్రశ్నించినవారిపై దాడులకు తెగబడ్డారు... హత్యలకు సైతం వెనకాడలేదు. -
హామీలకు మంగళం... ఖాకీలకు ద్రోహం!
[ 20-04-2024]
జిల్లా వ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు సబ్ డివిజన్లు ఉన్నాయి. -
నేడు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నామినేషన్
[ 20-04-2024]
పీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల శనివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈమె ఉదయం 8 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి కడప నగరం ఐటీఐ సర్కిల్కు 9.15 గంటలకు చేరుకుని ర్యాలీ ప్రారంభిస్తారు. -
తెదేపా రాజంపేట నియోజకవర్గ పరిశీలకుడిగా దుర్గాప్రసాద్
[ 20-04-2024]
రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంపై తెదేపా అధిష్ఠానం ప్రత్యేక దృష్టిసారించింది. కడపకు చెందిన కీలక నేత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుధా దుర్గాప్రసాద్ను పరిశీలకుడిగా నియమించింది. -
ఏం చేశావ్ మేలు... కౌలు రైతు కుదేలు..!
[ 20-04-2024]
జిల్లాలో 4,88,672 మంది రైతులుండగా, పంటలు సాగు చేసే నికర భూమి 2,70,985 హెక్టార్లు ఉంది. సొంత పొలం లేని 50 వేల మందికి పైగా కౌలురైతులు సొంతూర్లు, ఇతర ప్రాంతాల్లో మిగతా సాగు దారులకు చెందిన భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. -
సింహ వాహనంపై సీతాపతి
[ 20-04-2024]
ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు శుక్రవారం రాత్రి సింహ వాహనంపై సీతాపతి ఊరేగారు. -
అశ్వవాహనంపై శ్రీరాముడు
[ 20-04-2024]
వాల్మీకిపురంలో తితిదే ఆధ్వర్యంలోని పట్టాభిరాముడి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అశ్వవాహనంపై శ్రీరాముడు అధిరోహించి తిరుమాడవీధుల్లో ఊరేగారు. -
మామయ్యనంటూ ఊదరగొట్టేశావ్.. చిన్నారుల భద్రతను గాలికొదిలేశావ్..!
[ 20-04-2024]
జగన్ మామయ్య మాయమాటలకు చిన్నారులూ మోసపోయారు. పిల్లలకు మేనమామనని ఊదరగొట్టి వారి భద్రతను పూర్తిగా గాలికొదిలేశారు. -
అరాచక పాలన పోవాలంటే తెదేపా రావాలి
[ 20-04-2024]
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన పోవాలంటే తెదేపా అధికారంలోకి రావాలని ప్రొద్దుటూరు శాసనసభ తెదేపా అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు. -
చిన్నారులతో రాజకీయ ప్రచారం?
[ 20-04-2024]
అధికార పార్టీ ఉల్లంఘనలకు కాదేదీ అనర్హం అన్నట్లు ప్రచారంలోనూ నాయకులు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. చిన్నారుల చేతికి జెండాలిచ్చి ప్రచారం చేయించుకుంటున్నారు. -
వేడుకగా ఊంజల్ సేవ
[ 20-04-2024]
రామయ్య క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం కల్యాణ మండపంలో ఊంజల్ సేవ నిర్వహించారు. -
పాలకుల నిర్లక్ష్యం... ప్రజలకు శాపం
[ 20-04-2024]
పురపాలక హోదా కల్గి పద్దెనిమిదేళ్లు కావస్తున్నా ఇంకా బద్వేలులో పలువార్డులు కనీస సౌకర్యాలకు నోచుకోలేదు. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
తెదేపాలో చేరిన పగిడాల దస్తగిరి
[ 20-04-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు. -
ప్రభుత్వ స్థలం... రాచమల్లు పరం
[ 20-04-2024]
వైకాపా ప్రభుత్వంలో ప్రభుత్వ భూములు, స్థానిక సంస్థల భూములను అధికార పార్టీ నేతలు తమ ఆధీనంలో పెట్టేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, వారి అనుయాయులు, పార్టీ నేతలు, ఓ మోస్తరు నాయకులు, కార్యకర్తలు సైతం మున్సిపల్ స్థలాలపై కన్నేసి వాటిని తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారు. -
నిందితుల అరెస్టు
[ 20-04-2024]
బాలఓబిగారి వీధిలో ఈ నెల 17న రాత్రి ఓ మహిళ విషయంలో యువకుల మధ్య జరిగిన ఘర్షణ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఒకటో పట్టణ ఠాణా సీఐ శ్రీకాంత్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు