logo

ఇద్దరిపై చీటింగ్‌ కేసు నమోదు

కోల్డ్‌స్టోరేజ్‌ ఇప్పిస్తామంటూ మోసం చేసి డబ్బులు కాజేసిన ఇద్దరిపై చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు కడప చిన్నచౌకు ఎస్సై అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. బి.మఠానికి చెందిన వెంకటసుబ్బారెడ్డి, విజయనరసింహారెడ్డి

Published : 25 Sep 2022 03:41 IST

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : కోల్డ్‌స్టోరేజ్‌ ఇప్పిస్తామంటూ మోసం చేసి డబ్బులు కాజేసిన ఇద్దరిపై చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు కడప చిన్నచౌకు ఎస్సై అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. బి.మఠానికి చెందిన వెంకటసుబ్బారెడ్డి, విజయనరసింహారెడ్డి తిరుపతికి చెందిన నరేష్‌కు ఫోన్‌ చేసి తమకు రాజకీయ నాయకులతో సంబంధాలున్నాయి, వైయస్‌ఆర్‌ జిల్లాలో కోల్డ్‌స్టోరేజ్‌ ఇప్పిస్తామంటూ నమ్మించి అతని నుంచి రూ.5 లక్షలు తీసుకున్నారు. నరేష్‌కు కోల్డ్‌స్టోరేజ్‌ ఇప్పించలేదు. డబ్బులు అడిగితే తమకు రాజకీయ నాయకులు తెలుసునంటూ బెదిరించేవారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటసుబ్బారెడ్డి, విజయనరసింహారెడ్డిపై చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని