logo

దివ్యాంగులకు వైద్య పరీక్షలు

మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం దివ్యాంగుల కోసం అలింకో సంస్థ 

Updated : 25 Sep 2022 16:55 IST

కలసపాడు: మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం దివ్యాంగుల కోసం అలింకో సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో మండలంలో సామాజిక పింఛన్లు పొందుతున్న దివ్యాంగులకు వైద్యులు పరీక్షలు చేశారు. అర్హులైన దివ్యాంగులకు అవసరమైన పరికరాలను అందించేందుకు ఈ పరీక్షలు చేశారని ఎంపీడీవో మహబూబ్‌ బీ తెలిపారు. కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ వరదరాజు, గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని