వారు అడగలేక... వీరు ఆదుకోక!
రాజ్యాలు పోయాయి... రాజులు పోయారు... రాచరికపు వ్యవస్థ మాత్రం కొనసాగుతోందనడానికి నిదర్శనమే ముదివేడు జలాశయం బాధితుల వేదన. తమ పంట పొలాలు, నివాసం ఉండే గ్రామాలు మునిగిపోతాయని తెలిసినా నోరు తెరిచి తమకు ఎదురు కానున్న కష్టనష్టాలను చెప్పుకోలేకపోతున్నారు.
శరవేగంగా ముదివేడు జలాశయ నిర్మాణ పనులు
పరిహారమివ్వాలని అడిగితే బాధితులకు బెదిరింపులు
గోడు చెప్పుకోలేని దుస్థితిలో నిర్వాసితులు
- ఈనాడు డిజిటల్, కడప
ముదివేడు జలాశయం నిర్మాణ పనులు
రాజ్యాలు పోయాయి... రాజులు పోయారు... రాచరికపు వ్యవస్థ మాత్రం కొనసాగుతోందనడానికి నిదర్శనమే ముదివేడు జలాశయం బాధితుల వేదన. తమ పంట పొలాలు, నివాసం ఉండే గ్రామాలు మునిగిపోతాయని తెలిసినా నోరు తెరిచి తమకు ఎదురు కానున్న కష్టనష్టాలను చెప్పుకోలేకపోతున్నారు. తమ గోడు చెప్పుకొంటే ఎలాంటి ఉపద్రవం వస్తుందనే భయంతో వణికిపోతున్నారు. తమ కళ్ల ముందే తమ బతుకు తెరువు కూలిపోతున్నా కన్నీటిపర్యంతమవుతూ మిన్నకుండిపోతున్నారు ఆ అభాగ్యులు.
జలాశయం నిర్మాణంతో 1,044 ఎకరాల సాగు భూములతోపాటు దాదాపు 200 కుటుంబాలున్న కొత్తపల్లె, దిగువ సీతువారిపల్లె, చవటకుంటపల్లె, దిన్నిమీదపల్లె గ్రామాలు మునిగిపోనున్నాయి. సాధారణంగా అభివృద్ధి పనుల్లో భాగంగా భూసేకరణ చేయాల్సి వస్తే ఆయా భూములను గుర్తించడం..వాటి యజమానులకు నోటీసులిచ్చి అనుమతులు తీసుకోవడం...వారికి నష్ట పరిహారం చెల్లించేందుకు సంప్రదింపులతో ఒప్పించడం... నగదు చెల్లించడం తదితర ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఈ తంతు జరిగిన పక్షంలోనే సంబంధిత భూములను స్వాధీనం చేసుకుని పనులు చేపట్టాల్సి ఉంది. ఈ తంతు ఇక్కడ జరగలేదు. ముంపు గ్రామాల స్థానంలో నిర్వాసితులకు మరోచోట నిర్మించాల్సి ఉంది. ఇందుకు పరిహారం చెల్లింపుతో పాటు మరోచోట ఇళ్ల స్థలాల ఎంపిక.. నిర్మాణాలు...మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. ఇంత కసరత్తు చేయకుండానే జలాశయం నిర్మాణ పనులు మాత్రం శరవేగంగా చేస్తున్నారు.
పథకం తీరిది
తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం ముదివేడు సమీపంలోని పిచ్చలవాండ్లపల్లె వద్ద జలాశయం నిర్మాణం తలపెట్టారు. రెండు టీఎంసీల సామర్థ్యంతో రూ.759.50 కోట్లతో పనులు చేపట్టారు. గాలేరు-నగరి సుజల స్రవంతి పథకం ప్రధాన కాలువ నుంచి నీటిని వైయస్ఆర్ జిల్లా చక్రాయపేట ఎత్తిపోతల పథకం ద్వారా హంద్రీ-నీవా రెండో దశలోని పుంగనూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా ముదివేడు జలాశయానికి తరలిస్తారు. చక్రాయపేట నుంచి 125.4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముదివేడు జలాశయాన్ని నింపాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా రిజర్వాయరు నిర్మాణం తలపెట్టారు.
* పనులు చేపడుతున్న గుత్తేదారు సంస్థ రాష్ట్రంలోని కీలక ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులది కావడంతో అక్కడి భూ యజమానులు, గ్రామస్థులు నోరు తెరవలేకపోతున్నారు. ఒకరిద్దరు పొరపాటున తెరిచినా... పోలీసుల ద్వారా నోరు నొక్కించారు. ఎవరూ అడగంది...మీరెందుకు అడుగుతున్నారంటూ గదమాయించి భయపెడుతున్నారు. పంట పొలాలు, గ్రామాలు మునిగి పోతున్నా బాధితులు ఇదేమని అడిగే ధైర్యం చేయలేకపోతున్నారు.
* వామపక్షాలు ఇటీవల ఒకట్రెండు రోజులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. దీంతో రెవెన్యూ అధికారులు భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసి చేతులు దులుపుకొన్నారు.
సర్వే జరుగుతోంది
ముదివేడు జలాశయానికి సంబంధించిన భూసేకరణకు సర్వే జరుగుతోంది. మునిగిపోనున్న గ్రామాల తరలింపు... ప్రత్యామ్నాయ స్థలాలను చూపించే ప్రక్రియ నడుస్తోంది. ఆర్అండ్ఆర్ కింద బాధితులకు న్యాయం చేస్తాం.
- సురేంద్రరెడ్డి, ఈఈ, హంద్రీ-నీవా ప్రాజెక్టు
భయపెడుతున్నారు
ఇల్లేమో పిచ్చలవాండ్లపల్లెలో ఉంది. వ్యవసాయ బోర్లు కొత్తగా నిర్మిస్తున్నా జలాశయం కింద ఉన్నాయి. పొలాలన్నీ ముంపులోనే ఉన్నాయి. పొలాలు లేకుండా... బోర్లు... ఇల్లు ఉండి ఎలా బతకాలి. మా గోడు చెప్పుకోలేకపోతున్నాం. చెప్పుకొంటే భయపెడుతున్నారు.
- ప్రభాకర్రెడ్డి, రైతు, పిచ్చలవాండ్లపల్లె, కురలబలకోట మండలం
అడిగే పరిస్థితి లేదు
జలాశయం నిర్మాణంలో ఉన్నా మునిగిపోనున్న మా భూములు, ఇళ్లకు పరిహారం మాట ఎవరూ ఎత్తడంలేదు. అడిగే పరిస్థితి కూడా లేదు.
- రమణారెడ్డి, బాధిత రైతు, దిగువ సీతువారిపల్లె
కొందరికే పరిహారం
జలాశయం నిర్మాణ పనులు జరిగే చోట మాత్రం ఎకరాకు రూ.40 వేలు వంతున గుత్తేదారు చెల్లించారు. ఇది కూడా అతి కొద్ది మందికి మాత్రమే దక్కింది. ఆ తరువాత పరిహారం వస్తే తీసుకోండని వదిలిపెట్టారు. గట్టిగా అడిగే ధైర్యం మాకు లేకుండా పోతోంది.
- వెంకట రమణారెడ్డి, నిర్వాసితుడు, దిగువ సీతువారిపల్లె
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
8 మందిపై బైండోవర్ కేసులు
[ 18-04-2024]
మండలంలోని కలసపాడు, చెన్నుపల్లెల్లో 8 మంది పాత నేరస్తులపై గురువారం బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎస్సై నాగమురళి తెలిపారు. -
మేనమామ వేషం... అక్కచెల్లెమ్మలకు మోసం
[ 18-04-2024]
సీఎం జగన్... రాష్ట్రంలోని విద్యార్థులందరికీ తాను మేనమామని గొప్పగా చెప్పుకొంటుంటారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేవిధంగా చేస్తానంటూ బీరాలు పలుకుతుంటారు. ఇందుకోసం అన్ని రకాల సాయాలు చేస్తానంటూ వాగ్దానాలు ఇచ్చేస్తుంటారు. -
ఎన్నికల రణరంగానికి వేళాయె!
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తలపడనున్న అభ్యర్థులు గురువారం నుంచి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంటు స్థానానికి, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు(ఎస్సీ), వైయస్ఆర్ జిల్లా కడప పార్లమెంటు స్థానంతో పాటు కడప, పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు, బద్వేలు(ఎస్సీ), జమ్మలమడుగు, మైదుకూరు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
ఎమ్మెల్యే సుధీర్రెడ్డిపై మైనార్టీల తిరుగుబాటు
[ 18-04-2024]
జమ్మలమడుగు వైకాపా ఎమ్మెల్యే సుధీర్రెడ్డిపై ముస్లిం మైనార్టీలు తీవ్ర స్థాయిలో తిరుగుబాటు చేశారు. జమ్మలమడుగులోని ఆయన కార్యాలయాన్ని బుధవారం రాత్రి వారంతా ముట్టడించి నిరసన తెలిపారు. -
జగన్ దంపతులకు తెలియకుండా వివేకా హత్య జరిగి ఉండదు
[ 18-04-2024]
సీఎం జగన్ దంపతులకు తెలియకుండా మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య జరిగి ఉండదని భాజపా జమ్మలమడుగు అభ్యర్థి ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక భాజపా కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. -
రాజంపేటలో వైకాపాకు భారీ షాక్!
[ 18-04-2024]
రాజంపేట నియోజకవర్గంలో వైకాపాకు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే అధిక సంఖ్యలో నాయకులు తెదేపాలో చేరగా, మరికొందరు నేతలు బుధవారం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో మంగళగిరిలో చేరారు. -
దాశరథి...శేష వాహన విహారి
[ 18-04-2024]
శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో తొలిరోజు బుధవారం రాత్రి సీతారాములు ప్రత్యేక అలంకరణలో శేష వాహనంపై భక్తులకు దర్శన మిచ్చారు. -
కాస్త మిగిల్చారు
[ 18-04-2024]
మళ్లీ వైకాపా అధికారంలోకొస్తే ఇక్కడ గగ్గితిప్ప కొండ ఉండేదని మా పిల్లలకు చెప్పాల్సి వస్తుందని ఇటీవల అధికార వైకాపా నుంచి తెదేపాలో చేరిన ఓ నాయకుడు అన్న మాటలవి. -
వైకాపా అండదండలు... నేతలే అనకొండలు..!
[ 18-04-2024]
అధికార వైకాపా అండదండలతో నేతలు అనకొండల్లా కొండలు, గుట్టలను మింగేస్తున్నారు. ‘పచ్చని చెట్లను నరికేస్తే మళ్లీ నాటుకోవచ్చు. అదే కొండలు, గుట్టలను కొల్లగొడితే వాటి ఉనికినే కోల్పోయే ప్రమాదం ఉంది’ అని న్యాయస్థానాలు అక్షింతలు వేసినా, ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా అధికార నేతల చెవికెక్కడంలేదు. -
ప్రతి హృది నిండుగా... పురుషోత్తముని పండగ
[ 18-04-2024]
ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు ధ్వజారోహణం క్రతువు వైభవంగా జరిగింది. -
ఇదేం సన్నద్ధత
[ 18-04-2024]
ఒంటిమిట్ట కోదండరామాలయం బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని గత మూడు నెలలుగా తితిదే అధికారులు తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. -
ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు తయారీ
[ 18-04-2024]
ఒంటిమిట్ట రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 22న నిర్వహించే సీతారాముల కల్యాణం తిలకించడానికి తరలిరానున్న భక్తులకు పంపిణీ చేయడానికి ముత్యాల తలంబ్రాలు ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. -
పోతన రచనలు జన రంజకం
[ 18-04-2024]
బమ్మెర పోతన రచనలు జన రంజకమై చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయినట్లు తితిదే దత్సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనందతీర్థాచార్యులు పేర్కొన్నారు. ఒంటిమిట్టలో బుధవారం పోతన జయంతి వేడుకలను నిర్వహించారు. -
తొలిప్రయత్నంలోనే సివిల్స్లో 475 ర్యాంకు
[ 18-04-2024]
సివిల్స్లో కడప యువకుడు హరిప్రసాద్రాజు మెరిశాడు. తొలిప్రయత్నంలోనే 475వ ర్యాంకుతో సత్తాచాటాడు. వీరి సొంతూరు రాజంపేట ములక్కాయలపల్లె గ్రామం కాగా, ప్రస్తుతం కడప బాలాజీనగర్ నివాసముంటున్నారు. -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
[ 18-04-2024]
ఎన్నికల ప్రక్రియలో అతి కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు విజయరామరాజు తెలిపారు. -
సెక్యూరిటీ గార్డే శవపరీక్ష నిపుణుడు
[ 18-04-2024]
మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఎంత మంది ఎంఎన్వోలు, జీడీఏ సిబ్బంది వచ్చినా శవపరీక్షలు మాత్రం భద్రతా సిబ్బందే చేయాల్సి వస్తోంది. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రెడ్డెప్ప గత కొంతకాలంగా శవపరీక్ష విధులు నిర్వహిస్తున్నారు. -
చేనేతల సమస్యల పరిష్కారానికి కృషి : నల్లారి
[ 18-04-2024]
చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి హామీ ఇచ్చారు. -
ఉప కారాగారంలో రిమాండు ఖైదీ మృతి
[ 18-04-2024]
మద్యం కేసులో అరెస్టు అయిన నిందితుడు మదనపల్లె ఉప కారాగారంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం ముతుకూరుకు చెందిన మొగిలప్ప (67) వ్యవసాయ కూలి. -
రామయ్యను దర్శించుకున్న శారదాపీఠం ఉత్తరాధికారి
[ 18-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని విశాఖపట్నం శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి బుధవారం సందర్శించారు. -
కడప ఎంపీ స్థానానికి పోటీ చేయాలంటే రూ.40 కోట్ల ఖర్చు
[ 18-04-2024]
కడప పార్లమెంటుకు పోటీ చేయడానికి రూ.40 కోట్ల వరకు ఖర్చవుతుందని, కాంగ్రెస్ పార్టీ మహా అయితే రూ.10 లక్షలు ఇస్తుందని, మిగిలిన డబ్బులు అభ్యర్థి వైఎస్ షర్మిల ఎక్కడి నుంచి తెస్తారని వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి రమేశ్రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్లో వర్షాలు.. భారతీయుల కోసం హెల్ప్లైన్ నంబర్లు
-
ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ
-
ఇన్ఫీ లాభం 30 శాతం జంప్.. ఒక్కో షేరుపై ₹28 డివిడెండ్
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?