అమ్మో... ఆ 7 కిలోమీటర్లు!
మదనపల్లె-అంగళ్లు రహదారిలో ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారింది. నిత్యం భయంతో ప్రయాణించాల్సిన పరిస్థితి. రహదారి అభివృద్ధిపై ఇటు జాతీయ రహదారుల నిర్వహణ విభాగంతో పాటు పోలీసు యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో ప్రతిరోజూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రహదారిపై ప్రతి నిమిషానికి సగటున పగటి
ప్రమాదకరంగా మదనపల్లె-అంగళ్లు రహదారి
ట్రాఫిక్ సమస్యలతో వాహన చోదకుల అవస్థలు
- ఈనాడు డిజిటల్, కడప, న్యూస్టుడే, కురబలకోట
అంగళ్లు-రాయచోటి మార్గంలో అసంపూర్తి పనులు
మదనపల్లె-అంగళ్లు రహదారిలో ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారింది. నిత్యం భయంతో ప్రయాణించాల్సిన పరిస్థితి. రహదారి అభివృద్ధిపై ఇటు జాతీయ రహదారుల నిర్వహణ విభాగంతో పాటు పోలీసు యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో ప్రతిరోజూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రహదారిపై ప్రతి నిమిషానికి సగటున పగటి వేళల్లో 66, రాత్రి వేళల్లో 43 వరకు వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిలో భారీ వాహనాలే ఎక్కువ.
* మదనపల్లె వైపు నుంచి అనంతపురం, కదిరి, రాయచోటి, కడప మార్గాల్లో వాహనాలు రాకపోలు సాగిస్తుంటాయి. అంగళ్లు వద్ద అనంతపురం, కడప వైపునకు రెండు మార్గాలు చీలిపోతాయి. ఆ తరువాత పెద్దగా ట్రాఫిక్ సమస్య ఉండదు. మదనపల్లె- అంగళ్లు మధ్య మాత్రం రెండు వరుసల రహదారి కావడం, కనీస నిర్వహణ లేకపోవడంతో రహదారికిరువైపులా ముళ్లకంపలు పెరిగిపోయాయి. రహదారి అంచుల్లో వర్షపు నీటితో మట్టి కొట్టుకుపోయి ప్రమాదకరంగా తయారైంది. అత్యంత ప్రధానమైన రహదారి నిర్వహణ లేకపోవడంతోపాటు కనీస మరమ్మతులు చేపట్టకపోవడం, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు తీసుకోకపోవడంతో వాహనదారులకు ప్రాణసంకటంగా మారింది.
* మదనపల్లె- అంగళ్లు మధ్య 7 కిలోమీటర్ల రహదారికిరువైపులా పల్లెలు.. నివాసాలు... వాణిజ్య సముదాయాలతో నిత్యం జనం కిటకిటలాడుతుంటారు. దీనికి తోడు కొందరు వాహనాలను రహదారుల పక్కన ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా నిలిపివేస్తున్నారు. దీంతో 7 కిలోమీటర్ల రహదారిని దాటేందుకు ఒక్కో సందర్భంలో గంటకుపైగా సమయం పడుతుండడం గమనార్హం. సమయం వృథాతో పాటు గుండె దడదడలాడేలా ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంటోంది. అంగళ్లు నుంచి రాయచోటి వరకు జాతీయ రహదారి అభివృద్ధి పనులు గత రెండేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. సాధారణంగా కేంద్రం నుంచి అందుతున్నందున నిధులు సమస్య లేకపోవడంతో జాతీయ రహదారుల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతాయి. అంగళ్లు నుంచి దాదాపు 3 కిలోమీటర్ల పొడవునా విస్తరణ పనులు, మురుగు కాలువలు, విభాగినుల నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండడంతో వాహనదారులకు ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. గుత్తేదారు శరవేగంగా పనులు చేయకపోవడమే సమస్యకు ప్రధాన కారణం.
అంగళ్లులో నిత్యం ట్రాఫిక్ సమస్య ఇలా...
నాలుగు వరుసల రహదారి నిర్మిస్తాం
మదనపల్లె నుంచి అంగళ్లు వరకు నూతనంగా బైపాస్ మార్గం నిర్మాణం నాలుగు వరుసలతో ఆరు కిలోమీటర్ల వరకు చేపడతాం. భూసేకరణ ఆలస్యం కావడంతో పనులు ఆలస్యమయ్యాయి. ఒకట్రెండు నెలల్లో పనులు ప్రారంభించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.విస్తరణతో పాటు మురుగకాలువలు, విభాగినుల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. - రాజేంద్రప్రసాద్రెడ్డి, డీఈ, జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
[ 25-04-2024]
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
[ 25-04-2024]
సీఎం జగన్ వైకాపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు గురువారం పులివెందుల రానున్నారు. -
మీ బిడ్డనని గారాలు... నీ గడ్డపైనే ఘోరాలు!
[ 25-04-2024]
రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా నరేగా నుంచి రూ.26.02 కోట్లతో 349 మట్టి పనులను వైకాపా నేతలకు పంచిపెట్టారు. -
ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం
[ 25-04-2024]
మాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎన్డీఏ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు -
నేడు రాజంపేట, రైల్వేకోడూరులో ప్రజాగళం
[ 25-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరు పర్యటనకు రానున్నారు -
అక్రమాలకు పాల్పడకుండా గెలిచే సత్తా మీకుందా?
[ 25-04-2024]
అక్రమాలకు పాల్పడకుండా పులివెందులలో గెలిచే సత్తా మీకుందా? అని తెదేపా పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి సీఎం జగన్కు సవాల్ విసిరారు -
నీళ్లు గరళం... పారిశుద్ధ్యం అధ్వానం
[ 25-04-2024]
నియోజకవర్గ కేంద్రాలు ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు పట్టణ ప్రాంతాల్లోని కాలనీల ప్రజలు కనీస వసతులకు నోచుకోలేక తల్లడిల్లుతున్నారు -
జగన్ పాలనలో పర్యాటకాభివృద్ధి శూన్యం
[ 25-04-2024]
పర్యాటకుల నుంచి ఛార్జీలు, పన్నులు తదితరాల పేరుతో ఆదాయం వస్తున్నా ఆ రంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. -
జగనన్న హామీలు...నీటి మూటలు
[ 25-04-2024]
ఆరునూరైనా అభివృద్ధి చేసి తీరుతాం.. మైదుకూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామంటూ జగన్ ప్రభుత్వంలో పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?