అధికారుల ఒత్తిళ్లు... అమ్మకానికి ఇంటి స్థలాలు!
గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు కొందరు స్థలాలను వెనక్కి ఇచ్చేస్తుండగా, మరికొందరు అమ్మకానికి పెడుతున్నారు.
ప్రభుత్వం ఇస్తున్న సాయం చాలడం లేదంటున్న లబ్ధిదారులు
ఇదీ జగనన్న కాలనీల పరిస్థితి
కడప నగర శివారులోని జగనన్న కాలనీ
గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు కొందరు స్థలాలను వెనక్కి ఇచ్చేస్తుండగా, మరికొందరు అమ్మకానికి పెడుతున్నారు. ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ మంజూరైనప్పటికీ ఇంకనూ నిర్మాణం మొదలుపెట్టని వారు వెంటనే ప్రారంభించాలని లబ్ధిదారులను అధికార యంత్రాంగం హెచ్చరిస్తోంది. వైయస్ఆర్ జిల్లా ముద్దనూరు మండల తహసీల్దారు లబ్ధిదారులకు నోటీసులు జారీ చేశారు. నోటీసు అందిన 48 గంటల కాల వ్యవధిలో నిర్మాణం ప్రారంభించని పక్షంలో స్థలంతో పాటు ఇళ్లను రద్దు చేయనున్నట్లు హెచ్చరించారు. వాట్సాప్ సందేశాలూ పంపుతున్నారు.
- ఈనాడు డిజిటల్, కడప
జిల్లాలో రాజంపేట గ్రామీణ మండలానికి 14 వేల ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. మండలంలో మూడు లేఅవుట్లు ఏర్పాటు చేయగా మిట్టమీదపల్లె గ్రామం వద్ద రెండు వేల మందికి కేటాయించారు. రాజంపేట పట్టణంలోని పేదలకు అక్కడ స్థలాలు మంజూరు చేశారు. పట్టణానికి సుదూరంలోని లేఅవుట్లో ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు సుముఖంగా లేరు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలనే ఒత్తిళ్లను తట్టుకోలేక పలువురు స్వచ్ఛందంగా స్థలాలను వెనక్కి ఇచ్చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి అన్నమయ్య, వైయస్ఆర్ జిల్లాల్లో పలు చోట్ల ఉంది. నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో లబ్ధిదారులు వెనక్కి ఇచ్చేస్తున్నారు.
* ఇళ్ల స్థలాలకు మంచి ధర పలికే నగర, పట్టణ ప్రాంతాలకు దగ్గర్లో లబ్ధిదారులు స్థలాలను అమ్మకానికి పెడుతున్నారు. పేదలకు ఇచ్చిన స్థలాలు, ఇళ్లు పదేళ్ల వరకు అమ్మకూడదనే నిబంధన ఉన్నప్పటికీ అనధికారికంగా ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఎలాంటి రాతపత్రాలూ లేకుండా మాట మీదనే ఒప్పందాలు చేసుకుంటున్నారు. నిర్మాణ సామగ్రి ధరలు బహిరంగ మార్కెట్లో భారీగా పెరగడం, ఇంటి నిర్మాణానికి ఇస్తున్న రూ.1.80 లక్షల ఆర్థిక సాయం చాలకపోవడంతో కొంతమంది స్థలాలను అమ్ముకుంటున్నారు. ఇంటి నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ప్రభుత్వం ఒత్తిడి కూడా అమ్మకానికి మరో కారణంగా నిలుస్తోంది. అమ్మకం జరిగినా అధికారులకు అనుమానం రాకుండా లబ్ధిదారులే ముందుండి అన్ని పనులూ చేస్తున్నారు. పేదల పరిస్థితిని ఆసరాగా తీసుకుని జగనన్న కాలనీలపై స్థిరాస్తి వ్యాపారులు గద్దల్లా వాలుతున్నారు. లబ్ధిదారుల నుంచి చౌకగా స్థలాలను కొనుగోలు చేసి దానిపై మరింత లాభం పొందేలా ఇతరులకు కట్టబెడుతున్నారు. ఇంటి నిర్మాణం పూర్తయి.. ప్రభుత్వ ఆర్థిక సాయం అందే వరకు లబ్ధిదారులు అందుబాటులో ఉండేలా ముందుగానే ఒప్పందం చేసుకుంటున్నారు. నిర్మాణం పూర్తయ్యాక అద్దెకు ఇచ్చినట్లుగా ఉండేలా వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. కడప నగరం, ప్రొద్దుటూరు, బద్వేలు, రాజంపేట, మదనపల్లె పట్టణ సమీపాల్లో ఇలాంటి ఒప్పందాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సెంటు స్థలాన్ని రూ.2 లక్షలు నుంచి రూ.3 లక్షల వరకు విక్రయిస్తున్నారు.
ప్రోత్సహించడానికి నోటీసులిస్తున్నాం
లబ్ధిదారులను ప్రోత్సహించడంలో భాగంగానే నోటీసులు జారీ చేసి హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వ లక్ష్యాలను సాధించడానికి వివిధ మార్గాల్లో ఒత్తిడి పెంచుతున్నాం. నిర్మాణాలు పూర్తిచేసుకుంటే పేదలకే ఉపయుక్తంగా ఉంటుంది. సదుద్దేశంతోనే చర్యలు చేపట్టాం. ఇంత వరకు ఇళ్ల పట్టాలు ఎవరివీ రద్దు చేయలేదు.
- వెంకటేశ్వర్లు, తహసీల్దారు, ముద్దనూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
[ 28-03-2024]
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
[ 28-03-2024]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
కరవు సీమగా మార్చేసిన పాపం జగన్దే
[ 28-03-2024]
‘నేను రాయలసీమ వాసిని. చిత్తూరు జిల్లాలో పుట్టాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమను రత్నాలసీమగా మారిస్తే, నేడు సాగు, తాగునీరు లేక కరవు సీమగా మార్చేసిన పాపం సీఎం జగన్దే’ అని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. -
సీఎం ఇలాకా.... కుర్చీలు ఖాళీగా!
[ 28-03-2024]
సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సుయాత్ర... అందులోనూ ప్రారంభం అదిరేపోయేలా ఉండాలనుకున్న వైకాపా నేతలు... సీఎం ఇలాకాలోని ఐదు నియోజకవర్గాల మీదుగా సాగే యాత్రలో ప్రత్యేకించి ప్రొద్దుటూరులో కడప పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల నుంచి జనసమీకరణ... -
వైకాపా సేవకు బస్సులు... ప్రయాణికులకు ఇక్కట్లు
[ 28-03-2024]
సీఎం జగన్ బహిరంగ సభలకు జిల్లా నుంచి నాలుగు రోజులపాటు 6 డిపోల నుంచి 90 ఆర్టీసీ బస్సులను తరలించడంతో గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
ముడిపట్టు రాయితీకి మంగళం!
[ 28-03-2024]
వేలాది చేనేత కుటుంబాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. బడుగు జీవుల వెతలు, కన్నీటి ఘోషను పాలకులు ఆలకించడం లేదు. -
భాజపా జమ్మలమడుగు అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి
[ 28-03-2024]
భాజపా జమ్మలమడుగు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, బద్వేలు నియోజకవర్గ అభ్యర్థిగా బొజ్జా రోషన్నకు టిక్కెట్లు లభించాయి. -
సీ విజిల్ ఫిర్యాదులకు సత్వర పరిష్కారం : కలెక్టర్
[ 28-03-2024]
రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి జిల్లాలో సీ విజిల్, ఎన్ కోర్, ఈ ఎస్ఎంఎస్ల ద్వారా అందిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరిస్తున్నామని ఎన్నికల అధికారి, కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. -
అనుమతులతో పనేంటి... తవ్వేద్దాం
[ 28-03-2024]
ఒంటిమిట్ట చెరువులో గత మూడు రోజులుగా అడ్డగోలుగా మట్టి తవ్వేస్తున్నారు. -
ఇళ్లు ధ్వంసం చేయడం సిగ్గుచేటు
[ 28-03-2024]
బద్వేలు పట్టణంలో ఇళ్లు లేని నిరుపేదలైన దివ్యాంగులు దరఖాస్తులు చేసుకుని విసిగి వేసారిపోయారని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మండిపడ్డారు. -
‘రాయలసీమను ఎడారిగా మార్చిన ప్రభుత్వాలు’
[ 28-03-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోగా, అటు 400 స్థానాలు వస్తాయని, ఇటు 175 స్థానాలు వస్తాయని చెబుతూ మభ్యపెడుతున్నారని రాకపా రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్రెడ్డి ఆరోపించారు. -
అనర్హులకు మూల్యంకన విధులపై విచారణ
[ 28-03-2024]
‘సస్పెండైనవారు... పది జవాబుపత్రాలు దిద్దుతారంట’ శీర్షికన బుధవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై పదోతరగతి పరీక్షల జిల్లా పరిశీలకులు వెంకటకృష్ణారెడ్డి స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే