శేషాచలం.. జీవవైవిధ్యానికి నిలయం
ఉమ్మడి కడప జిల్లాలో 5,55,592 హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి. పులులు, చిరుత, కణుజు, పొడదుప్పి, కొండ గొర్రెలు, కృష్ణజింక, ఎలుగుబంట్లు, మనుబోతులు, కొండముచ్చులు, హైనా, ఏనుగులు, అడవి పందులు, పునుగుపిల్లులు, రేచుకుక్కలు, అలువలు, కుందేళ్లు, మరికొన్ని వన్యప్రాణులు ఉన్నాయి.
ఉమ్మడి కడప జిల్లాలో అరుదైన జీవజాలం
ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం రేపు
న్యూస్టుడే, సిద్దవటం
ఉమ్మడి కడప జిల్లా అడవులు జీవవైవిధ్యానికి నిలయం. సాధారణ, అరుదైన వన్యప్రాణులు మనకు ప్రత్యేకం. కరవు, ఇతర ప్రమాదాల కారణంగా వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. అటవీశాఖ అధికారులు ప్రజల్లో అవగాహన పెంపొందించి వాటిని సంరక్షించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. ఈ నెల 6న ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.
శేషాచలం అడవుల్లో ఏనుగు
ఉమ్మడి కడప జిల్లాలో 5,55,592 హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి. పులులు, చిరుత, కణుజు, పొడదుప్పి, కొండ గొర్రెలు, కృష్ణజింక, ఎలుగుబంట్లు, మనుబోతులు, కొండముచ్చులు, హైనా, ఏనుగులు, అడవి పందులు, పునుగుపిల్లులు, రేచుకుక్కలు, అలువలు, కుందేళ్లు, మరికొన్ని వన్యప్రాణులు ఉన్నాయి. అరుదైనవి హనీబాడ్జర్, ఆలువ, దేవాంగపిల్లి, గడ్డిజింక, రాక్షససాలీడు, తోడేళ్లు, నక్కలు, గద్దలు, ఇలా మొత్తం 21 రకాల వన్యప్రాణులు అడవుల్లో ఉన్నాయి. గజరాజులు, దేవాంగపిల్లి, పులులు, చిరుతలు, కృష్ణజింక, హనీబాడ్జర్, గడ్డిజింకలు సంచారంతో లంకమల, శేషాచలం అడవులు ప్రత్యేకతను చాటుకున్నాయి.
అరుదైన జంతువు హనీబాడ్జర్
పెరిగిన పులుల సంచారం
గత కొన్నేళ్లగా జిల్లాలో పులుల సంచారం కనిపిస్తోంది. వీటి గణనకు అధికారులు ఆధునిక కెమెరాల ఏర్పాటు చేశారు. ఇప్పటికే సిద్దవటం, బద్వేలు, పోరుమామిళ్ల, వనిపెంట అటవీ ప్రాంతాల్లో పులులు సంచరిస్తున్నాయి. తాజాగా పోరుమామిళ్ల, వనిపెంట అటవీ ప్రాంతంలో ఆరు పులులు ఉన్నట్లు గణాంకాల ద్వారా వెలుగులోకి వచ్చింది. పులుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో వాటి సంరక్షణ నిమిత్తం లంకమలలో 10,806 హెక్టార్లను టైగర్ కారిడార్గా అధికారులు గుర్తించారు. ఈ మేరకు నల్లమల నుంచి లంకమలకు సర్వే పనులు చేపట్టారు.
కొరవడిన రక్షణ
వేసవి వచ్చిదంటే అటవీ ప్రాంతంలో వన సంపద, నీటి కుంటలు ఎండిపోతుండడంతో వాటికి నీరు, ఆహారం కొరత తలెత్తుతోంది. దాహం తీర్చుకోవడానికి అటవీ శివారులో ఉన్న గ్రామాల్లోకి వస్తున్నాయి. పొలాల రక్షణకు రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్తు తీగలకు వన్యప్రాణులు తగులుకుని ప్రాణాలు విడుస్తున్నాయి. మరికొన్ని కుక్కల దాడికి గురై మృతి చెందుతుండగా, ఇంకొన్ని రహదారి దాటుతుండగా, వాహనాలు ఢీకొని మృత్యువాత పడుతున్నాయి.
సంరక్షణకు ప్రత్యేక చర్యలు
- పి.వి.సందీప్రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి, వైయస్ఆర్ జిల్లా
వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఈనెల 8వ తేదీ వరకు వన్యప్రాణుల వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. పాఠశాల, కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించే పనులు చేపడతాం. వన్యప్రాణులు సమీప గ్రామాలకు వెళ్లకుండా అటవీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా గడ్డి భూములు, నీటి కుంటల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. పులుల సంరక్షణకు కారిడార్ ఏర్పాటు చేయనున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాయంచపై రాములోరి రాజసం
[ 19-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు గురువారం రాత్రి రాయంచపై రాములోరి విహారం కనులపండువగా సాగింది. -
మొదలైన నామినేషన్ల సందడి
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ గురువారం మొదలైంది. కలెక్టర్ విజయ రామరాజు ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం కలెక్టరేట్లోని తన ఛాంబరులో నామపత్రాల స్వీకరణను ఆయన ప్రారంభించారు. -
జగన్ను నమ్మాం... నిండా మునిగాం!
[ 19-04-2024]
‘నేను ఉన్నానన్నావ్... నేను విన్నానన్నావ్... నిజమే అనుకున్నాం... నీ మాటలు విని మా బాధలు తెలుసుకుంటావని, పరిష్కారం చూపుతావని ఎంతో ఆశతో నిన్ను గెలిపించాం... తీరా చూస్తే నువ్వు ఉన్నావు... కానీ వినే ఓపికే లేకుండా పోయింది. -
షర్మిలకు మద్దతుగా పులివెందులలో సునీత ప్రచారం
[ 19-04-2024]
కడప పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల తరఫున మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత దంపతులు గురువారం నుంచి ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. -
బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మరథం
[ 19-04-2024]
బ్రహ్మాండ నాయకుడైన శ్రీరాముడి రథోత్సవం గురువారం వాల్మీకి క్షేత్రంలో వైభవంగా జరిగింది. ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
మరో వైకాపా ఫ్యానుపై వేటు
[ 19-04-2024]
వృత్తి ఉద్యోగమైనా... నిబంధనలు ఉల్లంఘించి అత్యుత్సాహంతో ముఖ్యమంత్రి జగన్కు ఊడిగం చేసే వారికి తగిన శాస్తి జరుగుతుందనడానికి నిదర్శనమే... ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై వేటు. -
పెద్దిరెడ్డి కుటుంబ దోపిడీని ఓటుతో అడ్డుకోండి
[ 19-04-2024]
రాజంపేట పార్లమెంట్ పరిధిలో పెద్దిరెడ్డి దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ముఖ్యమంత్రి, భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. -
జగన్ బాటలో బస్సులు.. జనానికి ‘ముప్పు’తిప్పలు!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో పల్లెలకు బస్సులు దూరమయ్యాయి... కొత్త బస్సులు రాకపోగా, ఉన్న బస్సులు మరమ్మతులకు గురయ్యాయి... పల్లె బస్సులు రద్దయ్యాయి. అవీ ఎప్పుడొస్తాయో తెలియదు. -
బ్రహ్మోత్సవ శోభ... ఆధ్యాత్మిక ప్రభ
[ 19-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రామయ్య క్షేత్రంలో రెండో రోజు గురువారం ఉదయం యాగశాలలో తితిదే ఆగమ సలహాదారు కల్యాణపురం రాజేష్ భట్టార్ ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించారు. -
జగనన్న చెప్పాడంటే చెయ్యడంతే
[ 19-04-2024]
మైకు పట్టుకుని రాజకీయ నాయకులేం చెబుతారో ఎన్నికల తర్వాత ఆ పని చేయకపోతే రాజీనామా చేసిపోయే పరిస్థితి రావాలన్నావు. నీ మాటలు నమ్మి ప్రశ్నిస్తే.. కేసులు పెట్టిస్తున్నావ్.. నీ అనునాయులతో ఉరికించి ఉరికించి కొట్టిస్తున్నావ్.. చెప్పిన మాటకు కట్టుబడక పోతే ఎలాగన్నా. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి
[ 19-04-2024]
కేంద్రం, రాష్ట్రంలో తమ ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే చేనేత కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తామని కడప ఎంపీ తెదేపా అభ్యర్థి భూపేష్రెడ్డి, జమ్మలమడుగు అసెంబ్లీ భాజపా అభ్యర్థి ఆదినారాయణరెడ్డి హామీ ఇచ్చారు. -
జిల్లాకు చేరుకున్న కేంద్ర ఎన్నికల పరిశీలకులు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై పర్యవేక్షణకు కేంద్ర ఎన్నికల పరిశీలకులు గురువారం జిల్లాకు చేరుకున్నారు. తొలుత కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, ఎస్పీ కృష్ణారావు, ఇతర జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. -
రాజంపేట వైకాపాలో ముసలం
[ 19-04-2024]
రాజంపేట వైకాపాలో ముసలం పుట్టింది. నియోజకవర్గానికి చెందిన వైకాపా నాయకులు, కార్యకర్తలు ఇటీవల తెదేపాలో చేరారు. ఈ క్రమంలో హైదరాబాద్లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో బుధవారం జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు, తెదేపా నాయకుడు పోలి సుబ్బారెడ్డి, సుగవాసి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో నందలూరు, రాజంపేట మండలాలకు చెందిన వైకాపా నేతలు పార్టీలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?