Super Star Krishna: ఎన్నికల సంగ్రామంలో సూపర్స్టార్!
ప్రముఖ సినీ నటుడు, సూపర్స్టార్ నటశేఖర కృష్ణకు జిల్లాతో, అందులోనూ బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, పట్టణాలతోపాటు ఒంటిమిట్టతో ప్రత్యేక అనుబంధం ఉంది.
కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారానికి కృష్ణ రాక
న్యూస్టుడే, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు పట్టణం, ప్రొద్దుటూరు, ఒంటిమిట్ట: ప్రముఖ సినీ నటుడు, సూపర్స్టార్ నటశేఖర కృష్ణకు జిల్లాతో, అందులోనూ బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, పట్టణాలతోపాటు ఒంటిమిట్టతో ప్రత్యేక అనుబంధం ఉంది. హైదరాబాద్లో మంగళవారం కృష్ణ తుదిశ్వాస విడిచిన సమాచారం తెలుసుకుని జిల్లావాసులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆయనతో గడిపిన మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. రాజంపేట శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొండూరు ప్రభావతమ్మ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు 1983, ఏప్రిల్లో మాధవరంలో నిర్వహించిన సభకు కృష్ణ హాజరయ్యారు. అప్పట్లో ఆయనతోపాటు ఆయన సతీమణి విజయనిర్మల, ప్రభాకర్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి తిరుపతి నుంచి రాజంపేటకు వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం మంటపంపల్లెలో ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టంరెడ్డి వేణుగోపాల్రెడ్డి ఇంట్లో ఆతిథ్యం స్వీకరించి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మాధవరానికి విచ్చేశారు. ప్రత్యర్థి పార్టీల నాయకులు, కార్యకర్తలు అక్కడికి దూకుడుగా తరలివచ్చి సమావేశాన్ని అడ్డుకోవాలని అల్లరి సృష్టించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అక్కడి నుంచి మధ్యలోనే కృష్ణతోపాటు ఇతర నటులు, కీలక నేతలను సురక్షితంగా పంపించారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 1984లో జరిగిన కడప పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సినీనటుడు కృష్ణ, విజయనిర్మల దంపతులు ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కందుల ఓబులరెడ్డికి మద్దతుగా కడప నుంచి మైదుకూరు వరకు పర్యటించారు. ఇందులో భాగంగా కడప పురపాలక మైదానం, మైదుకూరు ఆర్టీసీ బస్టాండు మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభల్లో పాల్గొన్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో ఓపెన్టాప్ జీపులో ప్రచారం నిర్వహించారు.
సినీనటుడు కృష్ణతో ప్రొద్దుటూరు అభిమానులు
వారిది 60 ఏళ్ల అనుబంధం: జిల్లాకు చెందిన దివంగత హాస్యనటుడు బస్వరాజు పద్మనాభం కుటుంబంతో కృష్ణ కుటుంబానికి 60 ఏళ్ల అనుబంధం ఉంది. ఈ సందర్భంగా పద్మనాభం సోదరుడు బస్వరాజు ప్రసాదరావు కృష్ణ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని ‘న్యూస్టుడే’కు వివరించారు. తన సోదరుడు నటించిన ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ సినిమా చిత్రీకరణ సమయంలో కృష్ణ అతిథి నటుడిగా పాత్ర పోషిస్తే తాను సహాయ నటుడిగా తీసిన చిత్ర సన్నివేశాలను గుర్తుచేసుకుని ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సినిమాలు తీసి నష్టం వచ్చిన సమయంలో తమను ‘నేనున్నా... భయపడొద్దు సినిమాలను తీయండని అన్నకు అండగా ఉండి ఆర్థికంగా సాయం అందించిన సహృదయులని కొనియాడారు.
ఆ క్షణాలు మరపురానివి: సేవ్ ట్రీ, సేవ్ ప్లాంట్ ప్రాజెక్టుపై తాను గీసిన చిత్రరాజాన్ని ప్రొద్దుటూరుకు చెందిన చిత్రలేఖ కళాకారిణి కొడవలూరు ప్రసన్న ఈ ఏడాది జూన్ 22వ తేదీన సినీ నటుడు కృష్ణకు అందజేశారు. తనను ఎంతో ఆప్యాయంగా ఆశీర్వదించిన నటశేఖర కృష్ణ ఇకలేరని తెలిసి ఆ చిన్నారి ఆవేదన చెందారు. ఆయన తనతో మాట్లాడిన మాటలను గుర్తుచేసుకుంటూ ‘న్యూస్టుడే’కు మంగళవారం తెలిపారు. తన ప్రాజెక్టును వివరించి తానే స్వయంగా గీసిన చిత్రాన్ని ఆయనకు బహుకరించడం చాలా సంతోషం కలిగిందన్నారు. ఆ క్షణాలు మరపురానివన్నారు.
ఈ ఏడాది జూన్ 22న కృష్ణకు చిత్రాన్ని బహూకరిస్తున్న చిత్ర కళాకారిణి ప్రసన్న
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనాసురుడికి పగ్గాలు.. కన్నీళ్లలో చేనేత మగ్గాలు!
[ 24-04-2024]
‘నేను ఉన్నాను... నేను విన్నాను’ అంటూ సీఎం జగన్ చేనేత కార్మికులను నమ్మించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నట్టేట ముంచారు. గత ప్రభుత్వాల హయాంలో అమలు చేసిన పథకాలకు మంగళం పాడేశారు. -
ఉన్నవి రద్దు చేసి... పక్క జిల్లాలకు సర్దేసి..!
[ 24-04-2024]
‘జాబ్ క్యాలెండరు విడుదల చేసి ఏటా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తాం, డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తాం’ అంటూ హామీలిచ్చి గద్దెనెక్కిన సీఎం జగన్ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. -
రేపు రాజంపేట, రైల్వేకోడూరుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాక
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరుకు రానున్నారు. -
రథంపై దాశరథి... మురిసిన భక్తజన హృది!
[ 24-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం రథోత్సవం కనులపండువగా జరిగింది. -
పెద్దిరెడ్డి కాళ్ల కింద పీలేరు ఆత్మగౌరవం!
[ 24-04-2024]
పీలేరు ఆత్మగౌరవాన్ని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్ల కింద పెట్టారని, ఆయన చేతిలో కీలుబొమ్మగా మారారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, తెదేపా పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిశోర్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. -
గోప్యంగా సునీత ప్రచారం!
[ 24-04-2024]
మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఎన్నికల ప్రచారాన్ని గోప్యంగా నిర్వహిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నేతలను కలుస్తూ మద్దతు కూడగడుతున్న ఆమె.. -
వంతెనకేదీ మోక్షం... జగన్ పాలనే సాక్ష్యం!
[ 24-04-2024]
కడప - తాడిపత్రి జాతీయ రహదారిలో పాపఘ్ని నదిపై వంతెన నిర్మాణం పూర్తికాకపోవడంతో రాకపోకలకు ఇక్కట్లు తప్పడం లేదు. 2021, నవంబరు 20న వరద ప్రవాహనికి ఇక్కడ పాత వంతెన కూలి పోయింది. -
కడపలో చెడ్డీగ్యాంగ్ కలకలం
[ 24-04-2024]
జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ సంచారంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయిదు రోజుల కిందట కడప నగరంలోని ఓ శివారు ప్రాంతంలోని బహుళ అంతస్తు భవనంలోకి ఈ గ్యాంగ్ ప్రవేశించినట్లు సీసీ పుటేజీల ద్వారా తెలిసింది. -
అభ్యర్థుల ఆస్తిపాస్తులివే
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల పర్వం నడుస్తోంది. మంగళవారం పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అఫిడవిట్లు దాఖలు చేస్తూ అందులో ఆస్తులు, కేసుల వివరాలు పేర్కొన్నారు. -
వైకాపా నేత... మార్కెట్ మేత
[ 24-04-2024]
అవినీతి లేని పాలన అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా పసిడిపురి ప్రొద్దుటూరులో తాత్కాలిక కూరగాయల మార్కెట్ ఏర్పాటు వ్యవహారమంతా ప్రజాప్రతినిధి వర్గీయులకు ఆదాయ వనరుగా మారిందనేది బహిరంగ రహస్యం. -
అయిదేళ్లు జగన్కు అధికారం... ఆవిరైంది జనానికి ఆహ్లాదం..!
[ 24-04-2024]
వైకాపా పాలనలో ఉద్యానవనాలు అంతులేని నిర్లక్ష్యానికి గురయ్యాయి. నిర్వహణను గాలికొదిలేయడంతో పార్కుల పరిస్థితి దయనీయంగా మారింది. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు వచ్చే జనం కూర్చోడానికి కనీసం బల్లల్లేని దుస్థితి నెలకొంది. -
సమస్యలు అనేకం... ప్రభుత్వానిదే పాపం
[ 24-04-2024]
-
పడకేసిన ప్రగతి... జగన్ పాలనలో అథోగతి
[ 24-04-2024]
పురపాలక ఆరో వార్డులోని కొత్తకొట్టాలు, వాసవీనగర్లో సమస్యలు వేధిస్తున్నాయి. ప్రధానంగా కొత్తకొట్టాలు, చిన్నమసీదు వీధుల మధ్య ప్రవహించే ఎర్రచెరువు అలుగువంక స్థానికులకు మురుగుకాలువగా ఉపయోగపడుతోంది. -
ఏఎస్పీ కేశప్పపై ఎంసీసీ అధికారుల విచారణ
[ 24-04-2024]
ఏఎస్పీ కేశప్పపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు అధికారులు, ఎంపీడీవో భానుప్రసాద్ మంగళవారం విచారణ చేపట్టారు. మదనపల్లె మండలం బొమ్మనచెరువులో ఆదివారం -
ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
[ 24-04-2024]
సీఎం జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డిపై వీరపునాయునిపల్లెకు చెందిన నాగప్రసాద్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!