జగనన్న గోరుముద్ద తిని 15 మంది విద్యార్థులకు అస్వస్థత
చక్రాయపేట మండలం బురుజుపల్లె ప్రాథమిక పాఠశాలలో జగనన్న గోరుముద్ద తిన్న 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
ఆసుపత్రిలో కోలుకున్న అనంతరం విద్యార్థులను తీసుకెళ్తున్న ఎంఈవో రవీంద్రనాయక్, ఉపాధ్యాయులు
చక్రాయపేట, న్యూస్టుడే : చక్రాయపేట మండలం బురుజుపల్లె ప్రాథమిక పాఠశాలలో జగనన్న గోరుముద్ద తిన్న 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో 45 మంది విద్యార్థులుండగా శనివారం మధ్యాహ్నం మెనూ ప్రకారం కరివేపాకు రైస్ చేయగా 44 మంది విద్యార్థులు తిన్నారు. వీరిలో 15 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కొందరు కడుపునొప్పి, మరికొందరు వాంతులు, విరేచనాలతో బాధపడుతుండడంతో ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణారెడ్డి వెంటనే స్పందించి సురభి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి చికిత్స అందించారు. ఆహార పదార్థాలు నాణ్యంగా లేక పోవడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు పేర్కొన్నారు. ఈ విషయమై ఎంఈవో రవీంద్రనాయక్ మాట్లాడుతూ పిల్లులు అనారోగ్యానికి గురైంది వాస్తవమేనని, ప్రస్తుతం పిల్లల ఆరోగ్యం కుదుటపడడంతో తల్లిదండ్రులకు అప్పజెప్పామన్నారు. విషయం తెలిసి జడ్పీటీసీ సభ్యుడు శివప్రసాద్రెడ్డి, అధికారులు విద్యార్థులను పరామర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం