సీఎంకు తెలియకుండానే ఇసుక దోపిడీ జరుగుతోందా: తెదేపా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత జిల్లాలో ఆయనకు తెలియకుండా ఇసుక దోపిడీ జరుగుతుందా అని తెదేపా ఉపాధ్యక్షుడు, కమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి పుత్తా నరసింహారెడ్డి ఆరోపించారు.
జిల్లా ఉన్నతాధికారులతో చరవాణిలో మాట్లాడుతున్న తెదేపా రాష్ట్ర
ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, పక్కన నాయకులు పుట్టా సుధాకర్యాదవ్, హరిప్రసాద్ తదితరులు
చాపాడు, న్యూస్టుడే: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత జిల్లాలో ఆయనకు తెలియకుండా ఇసుక దోపిడీ జరుగుతుందా అని తెదేపా ఉపాధ్యక్షుడు, కమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి పుత్తా నరసింహారెడ్డి ఆరోపించారు. చాపాడు మండలం వెదురూరు ఇసుక రేవును మంగళవారం ఆయన తెదేపా మైదుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పుట్టా సుధాకర్యాదవ్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరి ప్రసాద్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పుత్తా విలేకరులతో మాట్లాడారు. వెదురూరు రెవెన్యూ పరిధిలోని పెన్నా నదిలో 48 వేల క్యూబిక్ మీటర్లు ఏడాదిలో తరలించాలని ఓ గుత్తేదారుకు ప్రభుత్వం అనుమతులిచ్చిందన్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే పరిధులు దాటి, లక్షల క్యూబిక్ మీటర్లు తరలించారని, దీనిపై ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు లేవన్నారు. జల ప్రవాహమున్నప్పుడు ఇసుక తోడవద్దని నిబంధనలున్నా పట్టించుకోవడంలేదన్నారు. భారీ వాహనాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, భూములు కోతకు గురవుతున్నాయని, పశువులకు గ్రాసం కొరత తలెత్తుతోందని రైతులు ఆవేదన చెందు తుండటంతో తాము వచ్చామన్నారు. తమ ద్వారా ముఖ్యమంత్రికి విన్నవిస్తున్నామని, చర్యలు తీసుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అనంతరం పుట్టా మాట్లాడుతూ క్వారీలో సమస్యలు వచ్చినప్పుడు కమిటీలు పరిష్కరించాల్సి ఉండగా, అవి పనిచేయడం లేదన్నారు. కమిటీలో డీఎస్పీ, ఆర్డీవో, ఏడీ నిత్యం తనిఖీలు చేయాల్సి ఉందన్నారు. ఎస్ఈబీ నిద్రపోతుందన్నారు. ట్రాక్టరు చోదకులకు రాయల్టీ స్లిప్పులూ నకిలీవి ఇస్తున్నారని ఆరోపించారు. ఏటి పొరంబోకు భూముల్లో సాగునీటి గొట్టాలన్నీ ధ్వంసం చేశారని, అక్రమంగా తరలించిన ఇసుకను, వాహనాలతోపాటు యంత్రాలను సీజ్ చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోకపోతే మూడు రోజుల్లో హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. అనంతరం వారు ఎస్పీ, భూగర్భ గనుల శాఖ ఏడీతో చరవాణిలో మాట్లాడారు. జియోట్యాగ్ ప్రకారం ఏ ప్రాంతంలో, ఎంత లోతు ఇసుక తీశారని ఏడీని ప్రశ్నించారు. కమలాపురం పరిధిలో ఇసుక తోడుతున్నారని ఇపరాపురం రైతులు అడ్డుకుంటే చాపాడు పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. రైతులకు న్యాయం జరిగేవిధంగా చూడాలని ఎస్పీని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చూసిన కనులదే భాగ్యం!
[ 23-04-2024]
జగదభిరాముడి కల్యాణానికి జగమే ఊయలూగింది. సర్వమంగళ స్వరూపుడు శ్రీరాముడు, సకల జన శుభధాత్రి సీతాదేవి మూడు ముళ్లబంధంతో ఒక్కటైన వేళ భక్తజనం ఆనందంతో పులకించిపోయారు. -
జగన్ను నమ్మినందుకు నట్టేట ముంచారు!
[ 23-04-2024]
సీఎం జగన్ సొంత జిల్లాలో వైకాపా నుంచి పలువురు కీలక నేతలు వరుసగా జారుకుంటున్నారు. ఏళ్ల తరబడి పార్టీలో సేవలందించి.. సొంత ఆస్తుల్ని అమ్ముకున్న వారు... ఇప్పుడు ఆ పార్టీపై, అగ్రనేతలపై విశ్వాసం కోల్పోయి బయటకొచ్చేస్తున్నారు. -
జగన్ పాలన ఫలితమిది!
[ 23-04-2024]
పదోతరగతి ఫలితాల్లో 86.67 ఉత్తీర్ణత శాతంతో జిల్లా రాష్ట్రంలో 17వ స్థానంలో నిలిచింది. బాలురు 83.65, బాలికలు 89.71 ఉత్తీర్ణత శాతం నమోదుతో బాలికలు పైచేయి సాధించారు. -
బద్వేలులో వైకాపాకు భంగపాటు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల తరుణంలో బద్వేలు నియోజకవర్గ వైకాపాలో విభేదాలు రోడ్డెక్కాయి. -
వాలంటీర్ల కోసం వెతుకులాట!
[ 23-04-2024]
తాము రాజీనామా చేసేందుకు ససేమిరా అంటూ గ్రామ/ వార్డు వాలంటీర్లు వైకాపా నేతలకు కంట కనిపించకుండా తిరుగుతున్నారు. -
బాలికలదే పైచేయి!
[ 23-04-2024]
పదోతరగతి ఫలితాల్లో 92.10 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో జిల్లా మూడో స్థానంలో నిలిచింది. -
స్వామిభక్తిని చాటుకున్న పోలీసులు
[ 23-04-2024]
పోలీసులు పక్షపాత ధోరణిని వీడడంలేదు. వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్ల సందర్భంగా వివక్ష చూపిస్తున్నారు. -
కడపలో ఏకమవుతున్న తెదేపా నేతలు
[ 23-04-2024]
కడపలో తెదేపా నేతలందరూ ఏకతాటిపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
అయిదేళ్ల వైకాపా పాలనలో... సాగునీటి ప్రాజెక్టులకు ఒక్క పైసా విదల్చలేదు
[ 23-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో సాగునీటి ప్రాజెక్టులకు ఒక్క పైసా విదల్చలేదని భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి విమర్శించారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం... నిధులు నిరుపయోగం
[ 23-04-2024]
జిల్లాలో తొలి చెత్త సంపద మండల కేంద్రం రాజుపాళెంలో నిర్మించి గత ప్రభుత్వంలో జిల్లాకు ఆదర్శంగా ఇక్కడ కంపోస్టు ఎరువులు చేసిన ఘణత ఉంది. -
కూటమి అభ్యర్థుల గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి
[ 23-04-2024]
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉమ్మడి పార్టీల అభ్యర్థులను గెలిపించాలని ఎన్డీఏ అభ్యర్థులు, పార్టీల నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. -
‘పది’లో విద్యార్థుల ప్రతిభ
[ 23-04-2024]
జిల్లాలో సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. -
శాసనసభ స్థానాలకు నామపత్రాల దాఖలు
[ 23-04-2024]
ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఆయా ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ నామపత్రాలను సమర్పించారు. -
జగన్ పాలన... అభివృద్ధికి ఆమడ దూరాన
[ 23-04-2024]
బద్వేలు పురపాలకలోని శివారు వార్డులు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. -
ఆర్టీపీపీలో ఉద్యోగోన్నతికి అడ్డదారులు
[ 23-04-2024]
డాక్టర్ ఎంవీఆర్ తాప విద్యుదుత్పత్తి కేంద్రం (ఆర్టీపీపీ)లో కొందరు ఉద్యోగులు ఉద్యోగోన్నతికి అడ్డదారులు తొక్కుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ