ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి: కలెక్టర్
జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ విజయరామరాజు ఆదేశించారు.
మాట్లాడుతున్న కలెక్టర్ విజయరామరాజు, పక్కన జేసీ
సాయికాంత్వర్మ, ఎస్పీ అన్బురాజన్, అధికారులు
జిల్లా సచివాలయం, పులివెందుల, న్యూస్టుడే: జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ విజయరామరాజు ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన ముందస్తు ఏర్పాట్లపై కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఆయన ఎస్పీ అన్బురాజన్, వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబరు 2వ తేదీ నుంచి రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించనున్నారని, అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా చేపట్టాలన్నారు. పర్యటన ప్రాంతాల్లో ప్రోటో కాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేపట్టి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. వైద్యశిబిరాలు, సహాయక కేంద్రాలను అందుబాటులో ఉంచాలన్నారు. సమీక్షలో జేసీ సాయికాంత్వర్మ, కమిషనర్ సూర్య సాయిప్రవీణ్చంద్, ట్రైనీ కలెక్టర్ రాహుల్మీనా, డీఆర్వో గంగాధర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
పర్యటన షెడ్యూలు ఇలా... ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డిసెంబరు 2వ తేదీ ఉదయం 11.15 గంటలకు ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. గంటపాటు అక్కడే స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. 11.30 గంటలకు హెలీకాఫ్టరులో లింగాల మండలానికి బయలుదేరుతారు. 11.50 గంటలకు పార్నపల్లెకు చేరుకుంటారు. అక్కడ నుంచి 11.55 గంటలకు సీబీఆర్ జలాశయానికి రోడ్డుమార్గంలో బయలుదేరుతారు. మధ్యాహ్నం 12 గంటలకు పడవ షికారును ప్రారంభిస్తారు. అనంతరం 12.40 గంటల ప్రాంతంలో పార్నపల్లెలోని వైఎస్ఆర్ లేక్వ్యూ రెస్టారెంట్ను ప్రారంభిస్తారు. ఒంటి గంట నుంచి 1.30 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 4.30 గంటల వరకు అక్కడే ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. సాయంత్రం 4.35 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి పార్నపల్లెలోని హెలీప్యాడ్కు చేరుకుని ఇడుపులపాయకు బయలుదేరుతారు. సాయంత్రం 5 గంటల నుంచి స్థానిక నాయకులతో సమావేశమవుతారు. అనంతరం వైఎస్ఆర్ ఎస్టేట్లోని అతిథిగృహానికి చేరుకుని బస చేస్తారు. మరుసటి రోజు 3వ తేదీ ఉదయం 8.40 గంటలకు అక్కడ నుంచి హెలీకాప్టర్లో బయలుదేరి పులివెందులలోని భాకరాపురం హెలీప్యాడ్కు చేరుకుని రోడ్డుమార్గంలో కదిరిరోడ్డులోని ఎస్సీఎస్ఆర్ గార్డెన్కు చేరుకుని వివాహ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం 9.50 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి 10.10 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుని గన్నవరానికి బయలుదేరుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా శ్రీ వీరాంజనేయ స్వామి తిరుణాల
[ 19-04-2024]
మండలంలోని కొండపేటలో శుక్రవారం శ్రీ వీరాంజనేయ స్వామి తిరుణాల ఘనంగా జరిగింది. -
మద్యం సీసాలు పట్టివేత
[ 19-04-2024]
మండల కేంద్రంలో శుక్రవారం అక్రమంగా మద్యం సీసాలు తరలిస్తున్న రమేష్ అనే వ్యక్తిని అరెస్టు చేసి 15 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ నాగమురళి తెలిపారు. -
రాయంచపై రాములోరి రాజసం
[ 19-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు గురువారం రాత్రి రాయంచపై రాములోరి విహారం కనులపండువగా సాగింది. -
మొదలైన నామినేషన్ల సందడి
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ గురువారం మొదలైంది. కలెక్టర్ విజయ రామరాజు ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం కలెక్టరేట్లోని తన ఛాంబరులో నామపత్రాల స్వీకరణను ఆయన ప్రారంభించారు. -
జగన్ను నమ్మాం... నిండా మునిగాం!
[ 19-04-2024]
‘నేను ఉన్నానన్నావ్... నేను విన్నానన్నావ్... నిజమే అనుకున్నాం... నీ మాటలు విని మా బాధలు తెలుసుకుంటావని, పరిష్కారం చూపుతావని ఎంతో ఆశతో నిన్ను గెలిపించాం... తీరా చూస్తే నువ్వు ఉన్నావు... కానీ వినే ఓపికే లేకుండా పోయింది. -
షర్మిలకు మద్దతుగా పులివెందులలో సునీత ప్రచారం
[ 19-04-2024]
కడప పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల తరఫున మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత దంపతులు గురువారం నుంచి ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. -
బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మరథం
[ 19-04-2024]
బ్రహ్మాండ నాయకుడైన శ్రీరాముడి రథోత్సవం గురువారం వాల్మీకి క్షేత్రంలో వైభవంగా జరిగింది. ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
మరో వైకాపా ఫ్యానుపై వేటు
[ 19-04-2024]
వృత్తి ఉద్యోగమైనా... నిబంధనలు ఉల్లంఘించి అత్యుత్సాహంతో ముఖ్యమంత్రి జగన్కు ఊడిగం చేసే వారికి తగిన శాస్తి జరుగుతుందనడానికి నిదర్శనమే... ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై వేటు. -
పెద్దిరెడ్డి కుటుంబ దోపిడీని ఓటుతో అడ్డుకోండి
[ 19-04-2024]
రాజంపేట పార్లమెంట్ పరిధిలో పెద్దిరెడ్డి దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ముఖ్యమంత్రి, భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. -
జగన్ బాటలో బస్సులు.. జనానికి ‘ముప్పు’తిప్పలు!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో పల్లెలకు బస్సులు దూరమయ్యాయి... కొత్త బస్సులు రాకపోగా, ఉన్న బస్సులు మరమ్మతులకు గురయ్యాయి... పల్లె బస్సులు రద్దయ్యాయి. అవీ ఎప్పుడొస్తాయో తెలియదు. -
బ్రహ్మోత్సవ శోభ... ఆధ్యాత్మిక ప్రభ
[ 19-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రామయ్య క్షేత్రంలో రెండో రోజు గురువారం ఉదయం యాగశాలలో తితిదే ఆగమ సలహాదారు కల్యాణపురం రాజేష్ భట్టార్ ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించారు. -
జగనన్న చెప్పాడంటే చెయ్యడంతే
[ 19-04-2024]
మైకు పట్టుకుని రాజకీయ నాయకులేం చెబుతారో ఎన్నికల తర్వాత ఆ పని చేయకపోతే రాజీనామా చేసిపోయే పరిస్థితి రావాలన్నావు. నీ మాటలు నమ్మి ప్రశ్నిస్తే.. కేసులు పెట్టిస్తున్నావ్.. నీ అనునాయులతో ఉరికించి ఉరికించి కొట్టిస్తున్నావ్.. చెప్పిన మాటకు కట్టుబడక పోతే ఎలాగన్నా. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి
[ 19-04-2024]
కేంద్రం, రాష్ట్రంలో తమ ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే చేనేత కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తామని కడప ఎంపీ తెదేపా అభ్యర్థి భూపేష్రెడ్డి, జమ్మలమడుగు అసెంబ్లీ భాజపా అభ్యర్థి ఆదినారాయణరెడ్డి హామీ ఇచ్చారు. -
జిల్లాకు చేరుకున్న కేంద్ర ఎన్నికల పరిశీలకులు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై పర్యవేక్షణకు కేంద్ర ఎన్నికల పరిశీలకులు గురువారం జిల్లాకు చేరుకున్నారు. తొలుత కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, ఎస్పీ కృష్ణారావు, ఇతర జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. -
రాజంపేట వైకాపాలో ముసలం
[ 19-04-2024]
రాజంపేట వైకాపాలో ముసలం పుట్టింది. నియోజకవర్గానికి చెందిన వైకాపా నాయకులు, కార్యకర్తలు ఇటీవల తెదేపాలో చేరారు. ఈ క్రమంలో హైదరాబాద్లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో బుధవారం జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు, తెదేపా నాయకుడు పోలి సుబ్బారెడ్డి, సుగవాసి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో నందలూరు, రాజంపేట మండలాలకు చెందిన వైకాపా నేతలు పార్టీలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె