పశువుల మేతకు వెళ్లి మహిళా రైతు మృతి
పశువుల మేత కోసం గడ్డి కోస్తున్న సమయంలో గుండెపోటుతో మహిళా రైతు మృతి చెందిన సంఘటన మంగళవారం గూడెంచెరువులో చోటుచేసుకుంది.
జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్టుడే: పశువుల మేత కోసం గడ్డి కోస్తున్న సమయంలో గుండెపోటుతో మహిళా రైతు మృతి చెందిన సంఘటన మంగళవారం గూడెంచెరువులో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు... గూడెంచెరువు గ్రామానికి చెందిన లక్ష్మీదేవి (40) మంగళవారం ఉదయం తన ఇంటి సమీపంలో ఉన్న స్థలంలో పశువుల మేతకు గడ్డి కోస్తుండగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే పడిపోయారు. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి 108కు సమాచారం అందించారు. వెంటనే జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి భర్త ఏడాది క్రితం చనిపోయినప్పటి నుంచి ఈమె గుండె సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. ఈమెకు ఒక కుమారుడు, కూమార్తె ఉన్నారు. చిన్నవయసులోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం