logo

ఆటో ఢీకొని మహిళ దుర్మరణం

మండలంలోని మైదుకూరు-ప్రొద్దుటూరు రహదారిపై పల్లవోలు వద్ద ఆగి ఉన్న ఆటోను టిప్పరు ఢీకొని మల్లెల సరస్వతి (46) మృతి చెందినట్లు ఎస్‌ఐ డాక్టర్‌నాయక్‌ తెలిపారు.

Published : 30 Nov 2022 04:09 IST

సరస్వతి (పాతచిత్రం)

చాపాడు, న్యూస్‌టుడే: మండలంలోని మైదుకూరు-ప్రొద్దుటూరు రహదారిపై పల్లవోలు వద్ద ఆగి ఉన్న ఆటోను టిప్పరు ఢీకొని మల్లెల సరస్వతి (46) మృతి చెందినట్లు ఎస్‌ఐ డాక్టర్‌నాయక్‌ తెలిపారు. మంగళవారం రాత్రి కడప నుంచి సునీత అనే నిండు గర్భిణిని ప్రసవం నిమిత్తం ఆటోలో ప్రొద్దుటూరుకు తరలిస్తూ మార్గమధ్యలో దుప్పటి కోసం పల్లవోలు వద్ద ఆగారు. ఇంతలో వెనుక నుంచి వచ్చిన ఓ టిప్పర్‌ ఆటోను ఢీకొంది. ఆటో ముందు నిలుచుకుని ఉన్న మల్లెల సరస్వతి అనే మహిళను ఢీకొనడంతో ఆమె  అక్కడికక్కడే మృతిచెందారని ఎస్‌ఐ తెలిపారు. ఈమె పల్లవోలు గ్రామస్థురాలని చెప్పారు. ఆటోలో ప్రయాణిస్తున్న సునీత కుటుంబీకులైన అయిదుగురికి గాయాలయ్యాయి. వీరంతా దువ్వూరుకు చెందిన వారుగా గుర్తించామన్నారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని