మదనపల్లెలో ముఖ్యమంత్రి పర్యటన నేడు
మదనపల్లెకు నేడు (బుధవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్నారు.
ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ, ప్రజాప్రతినిధులు
సభావేదిక ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ గిరీష, జేసీ తమీమ్ అన్సారియా, తదితరులు
మదనపల్లె పట్టణం, మదనపల్లె నేరవార్తలు, న్యూస్టుడే: మదనపల్లెకు నేడు (బుధవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్నారు. స్థానిక టిప్పుసుల్తాన్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో నాలుగో విడత విద్యాదీవెన పథకాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 10.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలీకాఫ్టర్లో 11 గంటలకు మదనపల్లెలోని హెలీప్యాడ్కు చేరుకుని 11.10 గంటల వరకు ప్రజాప్రతినిధులతో మాట్లాడతారు. అనంతరం రోడ్డు మార్గంలో టిప్పుసుల్తాన్ మైదానంలోని సభాస్థలికి 11.30 గంటలకు చేరుకుని 11.55 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లబ్ధిదారులతో మాట్లాడిన తరువాత 12.40 గంటల వరకు ప్రసంగిస్తారు. అనంతరం 12.45 గంటలకు నాలుగో విడత విద్యాదీవెన పథకాన్ని ప్రారంభిస్తారు. అక్కడ నుంచి హెలీప్యాడ్ వద్దకు 12.55 గంటలకు చేరుకుని 15 నిమిషాలపాటు స్థానిక నాయకులతో మాట్లాడతారు. మధ్యాహ్నం 1.15 గంటలకు మదనపల్లె నుంచి బయలుదేరి 1.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి బయలుదేరి 2.45 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని 3.10 గంటలకు నివాసానికి చేరుకుంటారు.
పోలీసు అధికారులు, సిబ్బందికి సూచనలిస్తున్న ఎస్పీ హర్షవర్ధన్రాజు
సభావేదిక పరిశీలన: టిప్పుసుల్తాన్ మైదానంలో ముఖ్యమంత్రి బహిరంగసభ ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ గిరీష పరిశీలించారు. సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సభావేదికను ఎంపీ మిథున్రెడ్డి, ఎమ్మెల్సీ రఘురామ్, జేసీ తమీమ్ అన్సారియాతో కలిసి పరిశీలించి వేదిక ఎత్తు తక్కువగా ఉండటంతో దాన్ని తొలగించి ఎత్తు పెంచి తయారు చేశారు.
1,300 మంది పోలీసులతో భారీ బందోబస్తు: ముఖ్యమంత్రి పర్యటనకు 1,300 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్రాజు తెలిపారు. మదనపల్లెలో మంగళవారం ఉదయం అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి ఎవరెవరు ఎక్కడ విధులు నిర్వహించాలో నిర్ణయించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పోలీసు సిబ్బందికి తితిదే, ఆర్యవైశ్య కల్యాణ మండపాల్లో బస ఏర్పాటు చేశారు. పట్టణంలో ఉదయం, సాయంత్రం కాన్వాయ్ ట్రైల్ రన్ నిర్వహించారు.
పర్యటనకు 755 బస్సులు: ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా 755 బస్సులను వినియోగిస్తున్నట్లు ఆర్టీసీ డివిజనల్ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ ఇబ్రహీం, మదనపల్లె-1 డిపో డీఎం వెంకటరమణారెడ్డి తెలిపారు. డీఆర్డీఏ మహిళలకు 200 బస్సులు, ఇతర సాధారణ జనం కోసం 555 బస్సులను కేటాయించామన్నారు. బస్సులకు సుమారు 2 వేల మంది సిబ్బందిని నియమించామని, బస్సుల నిర్వహణకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు కథనానికి స్పందన
[ 29-03-2024]
మండలంలోని దూలంవారిపల్లెలో మండలాధికారులు రక్షిత మంచి పథకానికి ఉన్న పార్టీ రంగులను చెరిపేసి తెల్లరంగుపూత వేశారు. -
భక్తిశ్రద్ధలతో గుడ్ఫ్రైడే
[ 29-03-2024]
మండలకేంద్రంలోని 136 ఏళ్ల నాటి పురాతన సీఎస్ఐ చర్చిలో శుక్రవారం గుడ్ఫ్రైడేను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. -
ఆదేశాలకు పాతర.. ఇసుకాసురుల జాతర!
[ 29-03-2024]
పర్యావరణ అనుమతుల్లేకుండా ఇసుక తవ్వకాలు జరపొద్దని హైకోర్టు స్పష్టం చేసినా అధికార పార్టీ నేతలు ఖాతరు చేయడం లేదు. నిబంధనలను అతిక్రమిస్తే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తీర్పు వెల్లడించినా పోలీసు అధికారులు సైతం వాటిని పట్టించుకోకుండా వైకాపా నేతలకు వత్తాసు పలుకుతున్నారు. -
కీలక నేతలతో చంద్రబాబు భేటీ!
[ 29-03-2024]
మదనపల్లెలో బుధవారం రాత్రి, గురువారం ఉదయం తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ కీలక నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు -
రాయచోటిపై తెదేపా ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
రాయచోటి నియోజకవర్గంపై తెదేపా ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలను పిలిపించుకుని గెలుపు వ్యూహాలపై చర్చించారు. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథరెడ్డితో చంద్రబాబు పలుమార్లు మాట్లాడారు -
రెండో రోజూ ప్రయాణికులకు తిప్పలే
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సభలకు జిల్లా నుంచి బస్సులు కేటాయించడంతో వరుసగా రెండోరోజూ గురువారం ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు. -
ఒంటిమిట్టలో ఆదర్శ పోలింగ్ కేంద్రం
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒంటిమిట్ట ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఆదర్శ పోలింగ్ (పీఎస్-47) కేంద్రం ఏర్పాటు చేశారు. ఉద్యోగుల విధుల నిర్వహణ, ఓటర్లతో మాట్లాడాల్సిన తీరు, ఈవీఎంల పనితీరుపై వీఆర్వోలు, వీఆర్ఏలు, బీఎల్వోలు, సిబ్బందికి అవగాహన కల్పించారు -
దాహమో.... రఘురామ!
[ 29-03-2024]
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది సీఎం జగన్ సొంత ఇలాకాలోని మైదుకూరు పురపాలక సంఘం ప్రజల పరిస్థితి -
మైనార్టీ విద్యకు గ్రహణం!
[ 29-03-2024]
కేంద్ర ప్రాయోజిత నిధులతో నిర్మించతలపెట్టిన ముస్లిం, దూదేకులు, దళిత క్రిస్టియన్ల పిల్లలకు 6 నుంచి 10వ తరగతి వరకు గురుకుల పాఠశాలలు, వసతిగృహ సముదాయాలు ప్రతిపాదనలకే పరిమిత మయ్యాయి -
‘దోషులను వెంట పెట్టుకుంది జగనే’
[ 29-03-2024]
శామాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిని వెంటపెట్టుని తిరుగుతున్నది సీఎం జగనే అని మాజీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు సనసభ తెదేపా అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి ఆరోపించారు -
వివేకా హత్య కేసులో నిందితుడు అవినాష్ ఎంపీ టికెట్టా?
[ 29-03-2024]
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడు వై.ఎస్.అవినాష్రెడ్డిని పక్కన పెట్టుకుని, తన చిన్నాన్నను ఎవరో చంపేశారని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని భాజపా జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్రెడ్డి అన్నారు. -
తాగునీటి గండం..విద్యార్థులకు శాపం
[ 29-03-2024]
దేశ సరిహద్దులో భద్రత ఏర్పాట్లు చూసే సైనికులు... పశువైద్య విజ్ఞానాన్ని అవపోశన పడుతున్న విద్యార్థులను తాగునీటి సమస్య విపరీతంగా వేధిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM