logo

వైకాపా పాలనకు చరమగీతం పాడాలి

రాష్ట్రంలో వైకాపా పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని మాజీ ఎమ్మెల్యే, తెదేపా నియోజకవర్గ బాధ్యుడు ఆర్‌.రమేష్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణ పరిధిలోని 8వ వార్డులో సోమవారం ఆయన పార్టీ నాయకులు,

Published : 24 Jan 2023 04:52 IST

లోకేష్‌ పాదయాత్ర  విజయవంతం కావాలని దర్గాలో తెదేపా ప్రార్థనలు

8వ వార్డులో మురుగుకాలువను పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి, నేతలు

రాయచోటి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వైకాపా పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని మాజీ ఎమ్మెల్యే, తెదేపా నియోజకవర్గ బాధ్యుడు ఆర్‌.రమేష్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణ పరిధిలోని 8వ వార్డులో సోమవారం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ‘ఇదేం ఖర్మ...మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తలపెట్టిన ‘యువగళం’ పాదయాత్ర విజయవంతం కావాలని జమాల్‌ ఉల్లా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజల ఆధరాభిమానాలతో పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా, మైనార్టీ నాయకులు అతావుల్లా, ఖాదర్‌వలీ, వతన్‌నిస్సార్‌, హుస్సేన్‌, వెంకటసుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు