నేడు కడప నగరానికి నారా లోకేశ్ రాక
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బుధవారం కడప నగరంలో పర్యటించనున్నారు. ఈ నెల 27వ తేదీన కుప్పం నుంచి ‘యువగళం’ పేరుతో మహా పాదయాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో కడపలో సర్వమత ప్రార్థనాలయాలను సందర్శించాలని లోకేశ్ సంకల్పించారు.
దేవుని కడప శ్రీలక్షీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కొబ్బరి కాయలు కొడుతున్న తెదేపా నాయకులు
ఈనాడు డిజిటల్, కడప, న్యూస్టుడే, జిల్లా సచివాలయం: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బుధవారం కడప నగరంలో పర్యటించనున్నారు. ఈ నెల 27వ తేదీన కుప్పం నుంచి ‘యువగళం’ పేరుతో మహా పాదయాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో కడపలో సర్వమత ప్రార్థనాలయాలను సందర్శించాలని లోకేశ్ సంకల్పించారు. అందులో భాగంగా బుధవారం సాయంత్రం విమానంలో హైదరాబాద్ నుంచి కడపకు చేరుకుని ఆలయాలు, దర్గా, చర్చిల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెదేపా నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మొదటగా దేవుని కడపలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటారు. అమ్మవారిసమేత శ్రీవారి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి సమీపంలోని ప్రసిద్ధి గాంచిన పెద్ద దర్గాకు చేరుకుని ప్రత్యేక చాదర్ను సమర్పించి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. మతపెద్దల నుంచి ఆశీస్సులు అందుకుని అనంతరం మరియాపురంలోని రోమన్ కేథలిక్ చర్చికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ విధంగా సర్వమత ప్రార్థనాలయాల్లో పాల్గొనే విధంగా పర్యటన షెడ్యూలులో స్వల్ప మార్పులు తీసుకొచ్చారు. కడప నుంచి రాజంపేట, రైల్వేకోడూరు, కరకంబాడి మీదుగా రాత్రికి తిరుమలకు చేరుకోనున్నారు. గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని అనంతరం కుప్పం చేరుకుంటారు. లోకేశ్ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఉదయం ఎన్టీఆర్ కూడలి నుంచి పాదయాత్రగా బయలుదేరి దేవుని కడప శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడ 108 కొబ్బరి కాయలు కొట్టి స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు హరిప్రసాద్, గోవర్ధన్రెడ్డి, కడప నియోజకవర్గ ఇన్ఛార్జి అమీర్బాబు, నాయకుడు లక్ష్మీరెడ్డి, వికాస్ హరికృష్ణ, శివారెడ్డి, పీరయ్య, రాంప్రసాద్, సురేష్, జిలానీబాషా, గుర్రప్ప, శ్రీనివాసులు, అమరనాథరెడ్డి, శివ, జియావుద్ధీన్, సుబ్బరాయుడుయాదవ్, రాము యాదవ్, వెంకటేశ్యాదవ్, రెడ్డెయ్యయాదవ్, జయశేఖర్, జనార్దన్రెడ్డి, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనంపై జగనాసురుడి దండయాత్ర!
[ 20-04-2024]
జగన్ అయిదేళ్ల పాలనలో ఊరికో అసురుడు తయారయ్యాడు... కనిపించిన భూములన్నింటికీ కబ్జా చేశారు... సహజ వనరులను ఇష్టారీతిన కొల్లగొట్టారు... తమ ఆగడాలపై ప్రశ్నించినవారిపై దాడులకు తెగబడ్డారు... హత్యలకు సైతం వెనకాడలేదు. -
హామీలకు మంగళం... ఖాకీలకు ద్రోహం!
[ 20-04-2024]
జిల్లా వ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు సబ్ డివిజన్లు ఉన్నాయి. -
నేడు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నామినేషన్
[ 20-04-2024]
పీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల శనివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈమె ఉదయం 8 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి కడప నగరం ఐటీఐ సర్కిల్కు 9.15 గంటలకు చేరుకుని ర్యాలీ ప్రారంభిస్తారు. -
తెదేపా రాజంపేట నియోజకవర్గ పరిశీలకుడిగా దుర్గాప్రసాద్
[ 20-04-2024]
రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంపై తెదేపా అధిష్ఠానం ప్రత్యేక దృష్టిసారించింది. కడపకు చెందిన కీలక నేత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుధా దుర్గాప్రసాద్ను పరిశీలకుడిగా నియమించింది. -
ఏం చేశావ్ మేలు... కౌలు రైతు కుదేలు..!
[ 20-04-2024]
జిల్లాలో 4,88,672 మంది రైతులుండగా, పంటలు సాగు చేసే నికర భూమి 2,70,985 హెక్టార్లు ఉంది. సొంత పొలం లేని 50 వేల మందికి పైగా కౌలురైతులు సొంతూర్లు, ఇతర ప్రాంతాల్లో మిగతా సాగు దారులకు చెందిన భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. -
సింహ వాహనంపై సీతాపతి
[ 20-04-2024]
ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు శుక్రవారం రాత్రి సింహ వాహనంపై సీతాపతి ఊరేగారు. -
అశ్వవాహనంపై శ్రీరాముడు
[ 20-04-2024]
వాల్మీకిపురంలో తితిదే ఆధ్వర్యంలోని పట్టాభిరాముడి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అశ్వవాహనంపై శ్రీరాముడు అధిరోహించి తిరుమాడవీధుల్లో ఊరేగారు. -
మామయ్యనంటూ ఊదరగొట్టేశావ్.. చిన్నారుల భద్రతను గాలికొదిలేశావ్..!
[ 20-04-2024]
జగన్ మామయ్య మాయమాటలకు చిన్నారులూ మోసపోయారు. పిల్లలకు మేనమామనని ఊదరగొట్టి వారి భద్రతను పూర్తిగా గాలికొదిలేశారు. -
అరాచక పాలన పోవాలంటే తెదేపా రావాలి
[ 20-04-2024]
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన పోవాలంటే తెదేపా అధికారంలోకి రావాలని ప్రొద్దుటూరు శాసనసభ తెదేపా అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు. -
చిన్నారులతో రాజకీయ ప్రచారం?
[ 20-04-2024]
అధికార పార్టీ ఉల్లంఘనలకు కాదేదీ అనర్హం అన్నట్లు ప్రచారంలోనూ నాయకులు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. చిన్నారుల చేతికి జెండాలిచ్చి ప్రచారం చేయించుకుంటున్నారు. -
వేడుకగా ఊంజల్ సేవ
[ 20-04-2024]
రామయ్య క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం కల్యాణ మండపంలో ఊంజల్ సేవ నిర్వహించారు. -
పాలకుల నిర్లక్ష్యం... ప్రజలకు శాపం
[ 20-04-2024]
పురపాలక హోదా కల్గి పద్దెనిమిదేళ్లు కావస్తున్నా ఇంకా బద్వేలులో పలువార్డులు కనీస సౌకర్యాలకు నోచుకోలేదు. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
తెదేపాలో చేరిన పగిడాల దస్తగిరి
[ 20-04-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు. -
ప్రభుత్వ స్థలం... రాచమల్లు పరం
[ 20-04-2024]
వైకాపా ప్రభుత్వంలో ప్రభుత్వ భూములు, స్థానిక సంస్థల భూములను అధికార పార్టీ నేతలు తమ ఆధీనంలో పెట్టేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, వారి అనుయాయులు, పార్టీ నేతలు, ఓ మోస్తరు నాయకులు, కార్యకర్తలు సైతం మున్సిపల్ స్థలాలపై కన్నేసి వాటిని తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారు. -
నిందితుల అరెస్టు
[ 20-04-2024]
బాలఓబిగారి వీధిలో ఈ నెల 17న రాత్రి ఓ మహిళ విషయంలో యువకుల మధ్య జరిగిన ఘర్షణ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఒకటో పట్టణ ఠాణా సీఐ శ్రీకాంత్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!