హార్సిలీహిల్స్ అవుట్పోస్టు తెరిచేదెప్పుడు?
ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్లో పోలీసు అవుట్ పోస్టు మళ్లీ మూతపడింది. గతేడాది ఆగస్టులో అవుట్ పోస్టుకు రాయచోటి నుంచి ఇద్దరు ఏఆర్ ఎస్.ఐ.లతోపాటు మరో ఇద్దరు సిబ్బందిని ఎస్పీ నియమించారు.
విధుల్లో ఉన్నది ఒకే ఒక్క హోంగార్డు
రాయచోటికి వెళ్లిపోయిన ఏఆర్ సిబ్బంది
- న్యూస్టుడే, బి.కొత్తకోట
మూతబడిన హార్సిలీహిల్స్లోని పోలీసు అవుట్ పోస్టు
ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్లో పోలీసు అవుట్ పోస్టు మళ్లీ మూతపడింది. గతేడాది ఆగస్టులో అవుట్ పోస్టుకు రాయచోటి నుంచి ఇద్దరు ఏఆర్ ఎస్.ఐ.లతోపాటు మరో ఇద్దరు సిబ్బందిని ఎస్పీ నియమించారు. అప్పటి నుంచి కొండపై ఏఆర్ పోలీసులతో పాటు బి.కొత్తకోట పోలీసులు పర్యాటకులకు భద్రత కల్పించారు. అయితే ఇటీవల అవుట్ పోస్టుకు నియమించిన నలుగురిని తిరిగి జిల్లా కేంద్రమైన రాయచోటికి పిలిపించారు. దీంతో కొండపై విధుల నిర్వహణకు ఓ హోంగార్డు మాత్రమే మిగిలారు. మరోవైపు బి.కొత్తకోట పోలీసుస్టేషన్లో సిబ్బంది కొరత సమస్యగా మారింది. కొండపై ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే సత్వరం పర్యాటకుల భద్రత కల్పించడం కష్టంగా మారుతోంది.
* బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్కు గతంతో పోల్చితే పర్యాటకుల తాకిడి పెరిగింది. నూతన సంవత్సరంతో పాటు సెలవు రోజుల్లో కొండపైకి ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను నడుపుతోంది. కొండపై అటవీ, పర్యాటకశాఖలతో పాటు ప్రైవేటు సంస్థలు అతిథి గృహాలు నడుపుతున్నాయి. వివిధ స్థాయిల్లోని వీఐపీలతో పాటు పర్యాటకులు కొండపై తరచూ బస చేయడం ఆనవాయితీగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కొండపై రాత్రింబవళ్లు భద్రతను కల్పించాల్సిన అవసరం పెరుగుతోంది. సముద్ర మట్టానికి 4,312 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పర్యాటక కేంద్రానికి మృత్యు మలుపులతో కూడిన ఘాట్ రోడ్డులో వెళ్లాల్సి ఉంటుంది. ఈ రహదారిలో తరచూ ప్రమాదాలు పునరావృతమవుతుండటంతో సందర్శకులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పటికప్పుడు ఘాట్ రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహించి వాహనాలను నియంత్రించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశముంది. గతంలో కొండపై అనేక సందర్భాల్లో గొడవలు జరిగి పోలీసుల జోక్యంతో సద్దుమణిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. కొండపై ఉన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రానున్న వేసవిలో పర్యాటకుల తాకిడి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కాగా కొండపై అవవసరాలను దృష్టిలో ఉంచుకుని అవుట్ పోస్టుకు నిబంధనల మేరకు శాశ్వత ప్రాతిపదికన సిబ్బందిని నియమించాలని హార్సిలీహిల్స్ టౌన్షిప్ కమిటీ సభ్యులు సూచించారు. కొండపై అవుట్ పోస్టుకు మరమ్మతులు చేయిడంతో పాటు సిబ్బంది బస చేయడానికి సదుపాయాలు కల్పించాలని, తద్వారా పర్యాటకులకు భద్రత లభిస్తుందని పర్యాటకులు, స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై మదనపల్లె డీఎస్పీ కేశప్ప మాట్లాడుతూ హార్సిలీహిల్స్లో పర్యాటకులకు భద్రత కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అవుట్ పోస్టుకు మరమ్మతులు చేయించి సిబ్బందిని నియమిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదేశాలకు పాతర.. ఇసుకాసురుల జాతర!
[ 29-03-2024]
పర్యావరణ అనుమతుల్లేకుండా ఇసుక తవ్వకాలు జరపొద్దని హైకోర్టు స్పష్టం చేసినా అధికార పార్టీ నేతలు ఖాతరు చేయడం లేదు. నిబంధనలను అతిక్రమిస్తే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తీర్పు వెల్లడించినా పోలీసు అధికారులు సైతం వాటిని పట్టించుకోకుండా వైకాపా నేతలకు వత్తాసు పలుకుతున్నారు. -
కీలక నేతలతో చంద్రబాబు భేటీ!
[ 29-03-2024]
మదనపల్లెలో బుధవారం రాత్రి, గురువారం ఉదయం తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ కీలక నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు -
రాయచోటిపై తెదేపా ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
రాయచోటి నియోజకవర్గంపై తెదేపా ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలను పిలిపించుకుని గెలుపు వ్యూహాలపై చర్చించారు. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథరెడ్డితో చంద్రబాబు పలుమార్లు మాట్లాడారు -
రెండో రోజూ ప్రయాణికులకు తిప్పలే
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సభలకు జిల్లా నుంచి బస్సులు కేటాయించడంతో వరుసగా రెండోరోజూ గురువారం ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు. -
ఒంటిమిట్టలో ఆదర్శ పోలింగ్ కేంద్రం
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒంటిమిట్ట ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఆదర్శ పోలింగ్ (పీఎస్-47) కేంద్రం ఏర్పాటు చేశారు. ఉద్యోగుల విధుల నిర్వహణ, ఓటర్లతో మాట్లాడాల్సిన తీరు, ఈవీఎంల పనితీరుపై వీఆర్వోలు, వీఆర్ఏలు, బీఎల్వోలు, సిబ్బందికి అవగాహన కల్పించారు -
దాహమో.... రఘురామ!
[ 29-03-2024]
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది సీఎం జగన్ సొంత ఇలాకాలోని మైదుకూరు పురపాలక సంఘం ప్రజల పరిస్థితి -
మైనార్టీ విద్యకు గ్రహణం!
[ 29-03-2024]
కేంద్ర ప్రాయోజిత నిధులతో నిర్మించతలపెట్టిన ముస్లిం, దూదేకులు, దళిత క్రిస్టియన్ల పిల్లలకు 6 నుంచి 10వ తరగతి వరకు గురుకుల పాఠశాలలు, వసతిగృహ సముదాయాలు ప్రతిపాదనలకే పరిమిత మయ్యాయి -
‘దోషులను వెంట పెట్టుకుంది జగనే’
[ 29-03-2024]
శామాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిని వెంటపెట్టుని తిరుగుతున్నది సీఎం జగనే అని మాజీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు సనసభ తెదేపా అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి ఆరోపించారు -
వివేకా హత్య కేసులో నిందితుడు అవినాష్ ఎంపీ టికెట్టా?
[ 29-03-2024]
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడు వై.ఎస్.అవినాష్రెడ్డిని పక్కన పెట్టుకుని, తన చిన్నాన్నను ఎవరో చంపేశారని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని భాజపా జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్రెడ్డి అన్నారు. -
తాగునీటి గండం..విద్యార్థులకు శాపం
[ 29-03-2024]
దేశ సరిహద్దులో భద్రత ఏర్పాట్లు చూసే సైనికులు... పశువైద్య విజ్ఞానాన్ని అవపోశన పడుతున్న విద్యార్థులను తాగునీటి సమస్య విపరీతంగా వేధిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ