వీడియో అప్లోడ్ చేస్తే డబ్బులొస్తాయని నమ్మి.. మోసపోయిన ఇంజినీరింగ్ విద్యార్థిని
పోరుమామిళ్ల పట్టణానికి చెందిన బీటెక్ చదివిన ఓ విద్యార్థిని యూట్యూబ్లో సబ్స్రైబ్ చేస్తే డబ్బులొస్తాయని నమ్మి రూ.14,75,000 పోగొట్టుకున్నారు.
రూ.14.75 లక్షలు పోగొట్టుకున్న వైనం
పోరుమామిళ్ల, న్యూస్టుడే: వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల పట్టణానికి చెందిన బీటెక్ చదివిన ఓ విద్యార్థిని యూట్యూబ్లో సబ్స్రైబ్ చేస్తే డబ్బులొస్తాయని నమ్మి రూ.14,75,000 పోగొట్టుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్.ఐ.హరిప్రసాదు తెలిపారు. వీడియోతీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే డబ్బులొస్తాయని సైబర్ నేరగాళ్లు నమ్మించారు. బీటెక్ పట్టభద్రురాలు ఆసక్తిగా అప్లోడ్ చేయడంతో మొదటి రోజు రూ.2 వేలు, రూ.3 వేలు వచ్చాయి.
అనంతరం ఆన్లైన్లో పెట్టుబడి పెడితే రెట్టింపు ఆదాయం వస్తుందని వారు నమ్మించారు. వచ్చిన డబ్బులకు పన్నులు కట్టాలని వారు చెప్పడంతో వారం రోజుల్లో రూ.14,75,000 సైబర్ నేరగాళ్ల బ్యాంకు ఖాతాలకు ఆమె జమ చేశారు. చేతిలో డబ్బులు లేకున్నా బ్యాంకులో రూ. 2 లక్షల రుణం తీసుకొని వారు చెప్పిన ఖాతాలకు నగదు జమ చేశారు. ఈ నెల 6 నుంచి 10వ తేదీలోపు ఈ ఆర్థిక లావాదేవీలు చేసి మోసపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం