జమ్మలమడుగు వైకాపాలో భగ్గుమన్న విభేదాలు
జమ్మలమడుగు వైకాపాలో విభేధాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే సుధీర్రెడ్డి వ్యతిరేక వర్గం బహిరంగంగా ఓ వేదికపై చేరింది.
ఎమ్మెల్యేపై అసమ్మతి నాయకుల ఆరోపణలు
మళ్లీ టిక్కెట్ ఇస్తే పనిచేయబోమంటూ శపథం
మాట్లాడుతున్న రాజశేఖర్రెడ్డి, పక్కన నాయకులు పవన్కుమార్రెడ్డి, నాగేశ్వరరావు, రాముడు
ఈనాడు డిజిటల్, కడప, న్యూస్టుడే, ఎర్రగుంట్ల: జమ్మలమడుగు వైకాపాలో విభేధాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే సుధీర్రెడ్డి వ్యతిరేక వర్గం బహిరంగంగా ఓ వేదికపై చేరింది. ఆయనపై ఆరోపణలు గుప్పించింది. ఎమ్మెల్యే స్వయంగా మట్టి, ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారని ఆరోపించింది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తే పని చేయబోమని స్పష్టం చేసింది. పార్టీ కోసం పాటుపడిన వారిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని.. ఆర్థికంగానూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆ వర్గం నాయకులు ఆరోపించారు. ఎర్రగుంట్లలో శనివారం గంగవరం రాజశేఖర్రెడ్డి (గంగవరం శేఖర్రెడ్డి) అధ్యక్షతన అసమ్మతి నాయకులు భేటీ అయ్యారు. ఇక్కడే ప్రత్యేకంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీని కాపాడుకోవడానికి ఎర్రగుంట్లలోనే నివాసం ఉండి కార్యకర్తలకు అండగా ఉంటానని శేఖర్రెడ్డి ప్రకటించారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలను ఆదుకోవడానికి నివాసాన్ని సైతం కడప నుంచి ఎర్రగుంట్లకు మార్చుకున్నానని తెలిపారు. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటూనే ఎమ్మెల్యే అక్రమాలను ఎదుర్కొని... నాయకులు, కార్యకర్తలను ఆదుకునేందుకు అన్ని రకాలుగా పాటుపడతామన్నారు. పార్టీకి నష్టం కలిగించే చర్యలను సహించేది లేదని హెచ్చరించారు.
ఎమ్మెల్యేకు టిక్కెట్ ఇవ్వరాదు: గంగవరం శేఖర్రెడ్డి గృహప్రవేశానికి హాజరైన పలువురు నాయకులు విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే సుధీర్రెడ్డికి టిక్కెట్ ఇవ్వరాదని, అభ్యర్థిని మార్చాలని పార్టీని డిమాండు చేశారు. గంగవరం శేఖర్రెడ్డి, వైఎస్ కుటుంబం సభ్యులు పోటీ చేసే పక్షంలో గెలుపునకు కృషి చేస్తామని... సుధీర్రెడ్డికి మాత్రం మద్దతు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే ఇతర పార్టీలకు చెందిన వ్యక్తులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఆయన్ను నమ్మి ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా నష్టపోయామని చిన్నదండ్లూరు సర్పంచి రాముడు, జమ్మలమడుగు పురపాలక సంఘం కౌన్సిలర్ జ్ఞాన ప్రసూన, నాయకులు నాగేశ్వరరావు, పవన్కుమార్రెడ్డి, శశిధర్రెడ్డి, జువారీ రమణారెడ్డి, సీతారామిరెడ్డి, ఓబుళరెడ్డి, సుధాకర్రెడ్డి అన్నారు. ఇదిలా ఉండగా గంగవరం రాజశేఖర్రెడ్డి ఏకంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కార్యాలయాన్ని ప్రారంభించడం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యేపై అసంతృప్తిగా ఉన్న నేతలు గంగవరం రాజశేఖర్రెడ్డిని ఆశ్రయిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనాసురుడికి పగ్గాలు.. కన్నీళ్లలో చేనేత మగ్గాలు!
[ 24-04-2024]
‘నేను ఉన్నాను... నేను విన్నాను’ అంటూ సీఎం జగన్ చేనేత కార్మికులను నమ్మించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నట్టేట ముంచారు. గత ప్రభుత్వాల హయాంలో అమలు చేసిన పథకాలకు మంగళం పాడేశారు. -
ఉన్నవి రద్దు చేసి... పక్క జిల్లాలకు సర్దేసి..!
[ 24-04-2024]
‘జాబ్ క్యాలెండరు విడుదల చేసి ఏటా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తాం, డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తాం’ అంటూ హామీలిచ్చి గద్దెనెక్కిన సీఎం జగన్ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. -
రేపు రాజంపేట, రైల్వేకోడూరుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాక
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరుకు రానున్నారు. -
రథంపై దాశరథి... మురిసిన భక్తజన హృది!
[ 24-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం రథోత్సవం కనులపండువగా జరిగింది. -
పెద్దిరెడ్డి కాళ్ల కింద పీలేరు ఆత్మగౌరవం!
[ 24-04-2024]
పీలేరు ఆత్మగౌరవాన్ని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్ల కింద పెట్టారని, ఆయన చేతిలో కీలుబొమ్మగా మారారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, తెదేపా పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిశోర్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. -
గోప్యంగా సునీత ప్రచారం!
[ 24-04-2024]
మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఎన్నికల ప్రచారాన్ని గోప్యంగా నిర్వహిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నేతలను కలుస్తూ మద్దతు కూడగడుతున్న ఆమె.. -
వంతెనకేదీ మోక్షం... జగన్ పాలనే సాక్ష్యం!
[ 24-04-2024]
కడప - తాడిపత్రి జాతీయ రహదారిలో పాపఘ్ని నదిపై వంతెన నిర్మాణం పూర్తికాకపోవడంతో రాకపోకలకు ఇక్కట్లు తప్పడం లేదు. 2021, నవంబరు 20న వరద ప్రవాహనికి ఇక్కడ పాత వంతెన కూలి పోయింది. -
కడపలో చెడ్డీగ్యాంగ్ కలకలం
[ 24-04-2024]
జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ సంచారంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయిదు రోజుల కిందట కడప నగరంలోని ఓ శివారు ప్రాంతంలోని బహుళ అంతస్తు భవనంలోకి ఈ గ్యాంగ్ ప్రవేశించినట్లు సీసీ పుటేజీల ద్వారా తెలిసింది. -
అభ్యర్థుల ఆస్తిపాస్తులివే
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల పర్వం నడుస్తోంది. మంగళవారం పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అఫిడవిట్లు దాఖలు చేస్తూ అందులో ఆస్తులు, కేసుల వివరాలు పేర్కొన్నారు. -
వైకాపా నేత... మార్కెట్ మేత
[ 24-04-2024]
అవినీతి లేని పాలన అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా పసిడిపురి ప్రొద్దుటూరులో తాత్కాలిక కూరగాయల మార్కెట్ ఏర్పాటు వ్యవహారమంతా ప్రజాప్రతినిధి వర్గీయులకు ఆదాయ వనరుగా మారిందనేది బహిరంగ రహస్యం. -
అయిదేళ్లు జగన్కు అధికారం... ఆవిరైంది జనానికి ఆహ్లాదం..!
[ 24-04-2024]
వైకాపా పాలనలో ఉద్యానవనాలు అంతులేని నిర్లక్ష్యానికి గురయ్యాయి. నిర్వహణను గాలికొదిలేయడంతో పార్కుల పరిస్థితి దయనీయంగా మారింది. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు వచ్చే జనం కూర్చోడానికి కనీసం బల్లల్లేని దుస్థితి నెలకొంది. -
సమస్యలు అనేకం... ప్రభుత్వానిదే పాపం
[ 24-04-2024]
-
పడకేసిన ప్రగతి... జగన్ పాలనలో అథోగతి
[ 24-04-2024]
పురపాలక ఆరో వార్డులోని కొత్తకొట్టాలు, వాసవీనగర్లో సమస్యలు వేధిస్తున్నాయి. ప్రధానంగా కొత్తకొట్టాలు, చిన్నమసీదు వీధుల మధ్య ప్రవహించే ఎర్రచెరువు అలుగువంక స్థానికులకు మురుగుకాలువగా ఉపయోగపడుతోంది. -
ఏఎస్పీ కేశప్పపై ఎంసీసీ అధికారుల విచారణ
[ 24-04-2024]
ఏఎస్పీ కేశప్పపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు అధికారులు, ఎంపీడీవో భానుప్రసాద్ మంగళవారం విచారణ చేపట్టారు. మదనపల్లె మండలం బొమ్మనచెరువులో ఆదివారం -
ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
[ 24-04-2024]
సీఎం జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డిపై వీరపునాయునిపల్లెకు చెందిన నాగప్రసాద్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్