పాఠశాలల్లో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
ఉపాధ్యాయులు చరవాణులలో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి అసత్య సమాచారాన్ని ప్రచారం చేస్తే చర్యలు తప్పవని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్, కడప ఆర్జేడీ బండ్లపల్లె ప్రతాప్రెడ్డి హెచ్చరించారు.
మాట్లాడుతున్న ఆర్జేడీ ప్రతాప్రెడ్డి, వేదికపై అధికారులు
కడప విద్య, న్యూస్టుడే : ఉపాధ్యాయులు చరవాణులలో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి అసత్య సమాచారాన్ని ప్రచారం చేస్తే చర్యలు తప్పవని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్, కడప ఆర్జేడీ బండ్లపల్లె ప్రతాప్రెడ్డి హెచ్చరించారు. విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించినా, కొట్టినా, జవాబు పత్రాలు దిద్దకపోయినా, వర్క్బుక్కులు వినియోగంలో లేకపోయినా చర్యలు తీసుకుంటామన్నారు. జడ్పీ కార్యాలయ ఆవరణలోని సమావేశ మందిరంలో జిల్లాలోని ఎంఈఓలు, హెచ్.ఎంలు, కేజీబీవీ ప్రత్యేక అధికారులు, ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపల్స్తో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ మాట్లాడుతూ పదోతరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఎస్సీఈఆర్టీ మాదిరి ప్రశ్నపత్రాలను పంపిణీ చేస్తుందని, డి గ్రేడ్ విద్యార్థులతో వాటిని చదివించాలని ఆదేశించారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు విద్యార్థులు ఇళ్ల వద్ద చదివేలా చూడాలని, ఇందుకు ప్రధానోపాధ్యాయులంతా నైట్విజన్ చేయాలన్నారు. విద్యార్థులను బాగా చదివించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పాఠశాలలో ఫిర్యాదుల పెట్టె ఉండాలని, ఎంఈఓ, 15 రోజులకు ఒకసారి మహిళా కానిస్టేబుల్, ఆరోగ్య కార్యకర్తతో కలిసి ఫిర్యాదులను పరిశీలించాలన్నారు. వారానికి ఒకసారి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం తినాలన్నారు. సమావేశంలో డీఈఓ దేవరాజు, ఎస్ఎస్ఏ ఏపీసీ అంబవరం ప్రభాకర్రెడ్డి, కడప డిప్యూటీ డీఈఓ రాజగోపాల్రెడ్డి, డీసీఈబీ కార్యదర్శి శోభారాణి, పరీక్షల విభాగం అధికారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనాసురుడికి పగ్గాలు.. కన్నీళ్లలో చేనేత మగ్గాలు!
[ 24-04-2024]
‘నేను ఉన్నాను... నేను విన్నాను’ అంటూ సీఎం జగన్ చేనేత కార్మికులను నమ్మించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నట్టేట ముంచారు. గత ప్రభుత్వాల హయాంలో అమలు చేసిన పథకాలకు మంగళం పాడేశారు. -
ఉన్నవి రద్దు చేసి... పక్క జిల్లాలకు సర్దేసి..!
[ 24-04-2024]
‘జాబ్ క్యాలెండరు విడుదల చేసి ఏటా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తాం, డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తాం’ అంటూ హామీలిచ్చి గద్దెనెక్కిన సీఎం జగన్ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. -
రేపు రాజంపేట, రైల్వేకోడూరుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాక
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరుకు రానున్నారు. -
రథంపై దాశరథి... మురిసిన భక్తజన హృది!
[ 24-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం రథోత్సవం కనులపండువగా జరిగింది. -
పెద్దిరెడ్డి కాళ్ల కింద పీలేరు ఆత్మగౌరవం!
[ 24-04-2024]
పీలేరు ఆత్మగౌరవాన్ని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్ల కింద పెట్టారని, ఆయన చేతిలో కీలుబొమ్మగా మారారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, తెదేపా పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిశోర్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. -
గోప్యంగా సునీత ప్రచారం!
[ 24-04-2024]
మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఎన్నికల ప్రచారాన్ని గోప్యంగా నిర్వహిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నేతలను కలుస్తూ మద్దతు కూడగడుతున్న ఆమె.. -
వంతెనకేదీ మోక్షం... జగన్ పాలనే సాక్ష్యం!
[ 24-04-2024]
కడప - తాడిపత్రి జాతీయ రహదారిలో పాపఘ్ని నదిపై వంతెన నిర్మాణం పూర్తికాకపోవడంతో రాకపోకలకు ఇక్కట్లు తప్పడం లేదు. 2021, నవంబరు 20న వరద ప్రవాహనికి ఇక్కడ పాత వంతెన కూలి పోయింది. -
కడపలో చెడ్డీగ్యాంగ్ కలకలం
[ 24-04-2024]
జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ సంచారంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయిదు రోజుల కిందట కడప నగరంలోని ఓ శివారు ప్రాంతంలోని బహుళ అంతస్తు భవనంలోకి ఈ గ్యాంగ్ ప్రవేశించినట్లు సీసీ పుటేజీల ద్వారా తెలిసింది. -
అభ్యర్థుల ఆస్తిపాస్తులివే
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల పర్వం నడుస్తోంది. మంగళవారం పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అఫిడవిట్లు దాఖలు చేస్తూ అందులో ఆస్తులు, కేసుల వివరాలు పేర్కొన్నారు. -
వైకాపా నేత... మార్కెట్ మేత
[ 24-04-2024]
అవినీతి లేని పాలన అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా పసిడిపురి ప్రొద్దుటూరులో తాత్కాలిక కూరగాయల మార్కెట్ ఏర్పాటు వ్యవహారమంతా ప్రజాప్రతినిధి వర్గీయులకు ఆదాయ వనరుగా మారిందనేది బహిరంగ రహస్యం. -
అయిదేళ్లు జగన్కు అధికారం... ఆవిరైంది జనానికి ఆహ్లాదం..!
[ 24-04-2024]
వైకాపా పాలనలో ఉద్యానవనాలు అంతులేని నిర్లక్ష్యానికి గురయ్యాయి. నిర్వహణను గాలికొదిలేయడంతో పార్కుల పరిస్థితి దయనీయంగా మారింది. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు వచ్చే జనం కూర్చోడానికి కనీసం బల్లల్లేని దుస్థితి నెలకొంది. -
సమస్యలు అనేకం... ప్రభుత్వానిదే పాపం
[ 24-04-2024]
-
పడకేసిన ప్రగతి... జగన్ పాలనలో అథోగతి
[ 24-04-2024]
పురపాలక ఆరో వార్డులోని కొత్తకొట్టాలు, వాసవీనగర్లో సమస్యలు వేధిస్తున్నాయి. ప్రధానంగా కొత్తకొట్టాలు, చిన్నమసీదు వీధుల మధ్య ప్రవహించే ఎర్రచెరువు అలుగువంక స్థానికులకు మురుగుకాలువగా ఉపయోగపడుతోంది. -
ఏఎస్పీ కేశప్పపై ఎంసీసీ అధికారుల విచారణ
[ 24-04-2024]
ఏఎస్పీ కేశప్పపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు అధికారులు, ఎంపీడీవో భానుప్రసాద్ మంగళవారం విచారణ చేపట్టారు. మదనపల్లె మండలం బొమ్మనచెరువులో ఆదివారం -
ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
[ 24-04-2024]
సీఎం జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డిపై వీరపునాయునిపల్లెకు చెందిన నాగప్రసాద్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్