వేతనాలకు ఎదురుచూపులు!
వైయస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో పనిచేస్తున్న ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి గత కొన్ని నెలలుగా వేతనాలందక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వైయస్ఆర్లో రూ.5.11 కోట్లు, అన్నమయ్యలో రూ.4.36 కోట్ల బకాయిలు
ఎనిమిది నెలలుగా చెల్లింపుల్లేవంటున్న ప్రకృతి వ్యవసాయ సిబ్బంది
రైల్వేకోడూరు మండలంలో అరటి తోటను పరిశీలిస్తున్న సిబ్బంది
న్యూస్టుడే, కడప: వైయస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో పనిచేస్తున్న ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి గత కొన్ని నెలలుగా వేతనాలందక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో రైతులతో మమేకమై అవగాహన కల్పిస్తూ సహజ సాగులో మహాయజ్ఞంలా పనిచేస్తున్న వీరు వేతనాలకు పడిగాపులు కాస్తున్నారు. నెలలకొద్దీ ఎదురుచూసినా నిరాశే ఎదురవుతోంది.
* వైయస్ఆర్ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ద్వారా 2022-23 సంవత్సరంలో 64,262 మంది రైతులను భాగస్వామ్యం చేయాల్సి ఉండగా, 57,224 మందికి అవగాహన కల్పించి ఆసక్తి కల్పించారు. ఈసారి 74,935 ఎకరాలు లక్ష్యం కాగా, ఇప్పటికే 70,160 ఎకరాల్లో సాగు చేయించామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో 757 మంది పనిచేస్తున్నారు. వీరిలో రెగ్యులర్ సిబ్బందికి మాత్రం క్రమం తప్పకుండా వేతనాలిస్తుండగా, మిగతావారికి గతేడాది మే నుంచి డిసెంబరు వరకు వేతనాలు చెల్లించలేదు. ఎనిమిది నెలలకు మొత్తం రూ.5.11 కోట్లు చెల్లించాల్సి ఉంది.
* అన్నమయ్య జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో 51,772 మంది రైతుల ద్వారా 62,396 ఎకరాల్లో సహజ సేద్యం ద్వారా పంటలు పండించాలని ప్రణాళికను రూపొందించారు. ఇప్పటికే 44,279 మంది రైతుల ద్వారా 52,762 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో గతేడాది మే నుంచి డిసెంబరు వరకు పనిచేస్తున్న సిబ్బందికి రూ.4.36 కోట్లు వేతనాలు ఇవ్వాల్సి ఉంది.
కుటుంబ జీవనం సాగేదెలా?
ఐబీ ఐసీఆర్పీకి నెలకు రూ.3 వేలు, ఐసీఆర్పీ సొంత పంచాయతీలో పనిచేస్తే రూ.6 వేలు, ఇతర పంచాయతీల్లో సేవలందిస్తే రూ.9 వేలు, పొరుగు మండలంలో విధులు నిర్వర్తిస్తుంటే రూ.11 వేలు ఇస్తున్నారు. సకాలంలో వేతనాలు రాకపోవడంతో కొంతమంది మధ్యలోనే మానేస్తున్నారు. తిరిగి కొత్త వారిని తీసుకుని శిక్షణ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంటోంది. నెలల తరబడి వేతనాలందకపోవడంతో కుటుంబ జీవనం ఎలా సాగుతుందని సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. తమ గోడు ఎవరికీ చెప్పుకొన్నా అరణ్యరోదనగా మారిందని ఆక్రోశిస్తున్నారు. వేతనాల చెల్లింపుల్లో జాప్యంపై ఉన్నతాధికారులను ప్రశ్నించినా, ప్రభుత్వాన్ని నిలదీసినా ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోతుందని భయపడి ఎలాంటి ఆందోళన కార్యక్రమాలను చేయడం లేదని వాపోతున్నారు.
నిధులు రాగానే వేతనాలు చెల్లిస్తాం
ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి గతేడాది మే నుంచి నుంచి వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే సమస్యను రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. నిధులు రాగానే అందరికీ వేతనాలు చెల్లిస్తాం. త్వరలో వేతనాలొచ్చే అవకాశం ఉంది.
రామకృష్ణమరాజు, రమేష్బాబురావు, డీపీఎంలు, వైయస్ఆర్, అన్నమయ్య జిల్లాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా శ్రీ వీరాంజనేయ స్వామి తిరుణాల
[ 19-04-2024]
మండలంలోని కొండపేటలో శుక్రవారం శ్రీ వీరాంజనేయ స్వామి తిరుణాల ఘనంగా జరిగింది. -
మద్యం సీసాలు పట్టివేత
[ 19-04-2024]
మండల కేంద్రంలో శుక్రవారం అక్రమంగా మద్యం సీసాలు తరలిస్తున్న రమేష్ అనే వ్యక్తిని అరెస్టు చేసి 15 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ నాగమురళి తెలిపారు. -
రాయంచపై రాములోరి రాజసం
[ 19-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు గురువారం రాత్రి రాయంచపై రాములోరి విహారం కనులపండువగా సాగింది. -
మొదలైన నామినేషన్ల సందడి
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ గురువారం మొదలైంది. కలెక్టర్ విజయ రామరాజు ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం కలెక్టరేట్లోని తన ఛాంబరులో నామపత్రాల స్వీకరణను ఆయన ప్రారంభించారు. -
జగన్ను నమ్మాం... నిండా మునిగాం!
[ 19-04-2024]
‘నేను ఉన్నానన్నావ్... నేను విన్నానన్నావ్... నిజమే అనుకున్నాం... నీ మాటలు విని మా బాధలు తెలుసుకుంటావని, పరిష్కారం చూపుతావని ఎంతో ఆశతో నిన్ను గెలిపించాం... తీరా చూస్తే నువ్వు ఉన్నావు... కానీ వినే ఓపికే లేకుండా పోయింది. -
షర్మిలకు మద్దతుగా పులివెందులలో సునీత ప్రచారం
[ 19-04-2024]
కడప పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల తరఫున మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత దంపతులు గురువారం నుంచి ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. -
బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మరథం
[ 19-04-2024]
బ్రహ్మాండ నాయకుడైన శ్రీరాముడి రథోత్సవం గురువారం వాల్మీకి క్షేత్రంలో వైభవంగా జరిగింది. ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
మరో వైకాపా ఫ్యానుపై వేటు
[ 19-04-2024]
వృత్తి ఉద్యోగమైనా... నిబంధనలు ఉల్లంఘించి అత్యుత్సాహంతో ముఖ్యమంత్రి జగన్కు ఊడిగం చేసే వారికి తగిన శాస్తి జరుగుతుందనడానికి నిదర్శనమే... ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై వేటు. -
పెద్దిరెడ్డి కుటుంబ దోపిడీని ఓటుతో అడ్డుకోండి
[ 19-04-2024]
రాజంపేట పార్లమెంట్ పరిధిలో పెద్దిరెడ్డి దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ముఖ్యమంత్రి, భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. -
జగన్ బాటలో బస్సులు.. జనానికి ‘ముప్పు’తిప్పలు!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో పల్లెలకు బస్సులు దూరమయ్యాయి... కొత్త బస్సులు రాకపోగా, ఉన్న బస్సులు మరమ్మతులకు గురయ్యాయి... పల్లె బస్సులు రద్దయ్యాయి. అవీ ఎప్పుడొస్తాయో తెలియదు. -
బ్రహ్మోత్సవ శోభ... ఆధ్యాత్మిక ప్రభ
[ 19-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రామయ్య క్షేత్రంలో రెండో రోజు గురువారం ఉదయం యాగశాలలో తితిదే ఆగమ సలహాదారు కల్యాణపురం రాజేష్ భట్టార్ ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించారు. -
జగనన్న చెప్పాడంటే చెయ్యడంతే
[ 19-04-2024]
మైకు పట్టుకుని రాజకీయ నాయకులేం చెబుతారో ఎన్నికల తర్వాత ఆ పని చేయకపోతే రాజీనామా చేసిపోయే పరిస్థితి రావాలన్నావు. నీ మాటలు నమ్మి ప్రశ్నిస్తే.. కేసులు పెట్టిస్తున్నావ్.. నీ అనునాయులతో ఉరికించి ఉరికించి కొట్టిస్తున్నావ్.. చెప్పిన మాటకు కట్టుబడక పోతే ఎలాగన్నా. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి
[ 19-04-2024]
కేంద్రం, రాష్ట్రంలో తమ ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే చేనేత కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తామని కడప ఎంపీ తెదేపా అభ్యర్థి భూపేష్రెడ్డి, జమ్మలమడుగు అసెంబ్లీ భాజపా అభ్యర్థి ఆదినారాయణరెడ్డి హామీ ఇచ్చారు. -
జిల్లాకు చేరుకున్న కేంద్ర ఎన్నికల పరిశీలకులు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై పర్యవేక్షణకు కేంద్ర ఎన్నికల పరిశీలకులు గురువారం జిల్లాకు చేరుకున్నారు. తొలుత కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, ఎస్పీ కృష్ణారావు, ఇతర జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. -
రాజంపేట వైకాపాలో ముసలం
[ 19-04-2024]
రాజంపేట వైకాపాలో ముసలం పుట్టింది. నియోజకవర్గానికి చెందిన వైకాపా నాయకులు, కార్యకర్తలు ఇటీవల తెదేపాలో చేరారు. ఈ క్రమంలో హైదరాబాద్లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో బుధవారం జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు, తెదేపా నాయకుడు పోలి సుబ్బారెడ్డి, సుగవాసి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో నందలూరు, రాజంపేట మండలాలకు చెందిన వైకాపా నేతలు పార్టీలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
20 మంది ఎమ్మెల్యేలు సహా.. 4 లక్షల ఓటర్లలో ఒక్కరూ ఓటెయ్యలేదు!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు