logo

పులివెందులలో సీఎం జగన్‌ ఓడిపోతారు : తులసిరెడ్డి

స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరిగితే పులివెందుల నియోజకవర్గంలో సీఎం జగన్‌ సైతం ఓడిపోతారని ఏపీసీసీ మీడియా ఛైర్మన్‌ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు.

Published : 31 Jan 2023 02:43 IST

జమ్మలమడుగులో గోడపత్రికను విడుదల చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు తులసిరెడ్డి తదితరులు

జమ్మలమడుగు, వేంపల్లె, న్యూస్‌టుడే: స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరిగితే పులివెందుల నియోజకవర్గంలో సీఎం జగన్‌ సైతం ఓడిపోతారని ఏపీసీసీ మీడియా ఛైర్మన్‌ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. గతంలో ఎంత మెజారిటీ వచ్చిందో ఇప్పుడు అంత తేడాతో ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయన్నారు. గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం జమ్మలమడుగు, వేంపల్లెలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన వేర్వేరు కార్యక్రమాల్లో ‘చేయి చేయి కలుపుదాం రాహుల్‌ గాంధీ నాయకత్వాన్ని బలపరుద్దాం’ గోడపత్రికతోపాటు భారత్‌ జోడో యాత్ర ముగింపు సందర్భంగా రాహుల్‌ గాంధీ రాసిన లేఖ పత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జంగా గౌతమ్‌తో కలసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ ప్రతిష్ఠ రోజు రోజుకు దిగజారి పోతోందన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌, యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జ తిరుమలేసు, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఛార్లెస్‌, జమ్మలమడుగు ఇన్‌ఛార్జి భూతమాపురం సుబ్బారావు, కాంగ్రెస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని