గడప దాటని బిల్లులు!
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ పనుల బిల్లులకూ మోక్షం లభించడంలేదు.
వైయస్ఆర్లో నాలుగింటికే మోక్షం
అన్నమయ్య జిల్లాలో కాస్త నయం
ఈనాడు డిజిటల్, కడప
జమ్మలమడుగు పట్టణ పరిధిలోని వేంకటేశ్వర కాలనీలో సిమెంటు రోడ్డు నిర్మాణం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ పనుల బిల్లులకూ మోక్షం లభించడంలేదు. ఓ వైపు కార్యక్రమం సక్రమంగా నిర్వహించడంలేదంటూ సీఎం జగన్ ఎమ్మెల్యేలకు అక్షింతలు వేస్తున్నారు. రాష్ట్రంలో 40 మంది వెనుకబడిన ఎమ్మెల్యేలుండగా, వారిలో నలుగురు అన్నమయ్య, వైయస్ఆర్ జిల్లాల నుంచి ఉన్నారు. ప్రతి మూడు నెలలకొకసారి సీఎం సమీక్షిస్తూ.. ఎమ్మెల్యేల పనితీరును బేరీజు వేస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న కార్యక్రమం కింద చేపట్టిన పనులకు సైతం బిల్లులు కాకపోవడం గమనార్హం.
* ఇతరత్రా కార్యక్రమాల తరహాలోనే ‘గడప గడపకు మన ప్రభుత్వం’ బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతోంది. బిల్లుల విషయమై అధికార పార్టీ నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కింద బిల్లుల చెల్లింపు ఆలస్యం ఉండదంటూ అభయం ఇవ్వడంతో నేతలు పనులు చేయడానికి ముందుకొచ్చారు. బిల్లులు అప్లోడ్ చేయడంలో సాంకేతికంగా సమస్యలు ఎదురవుతున్నాయి. వైయస్ఆర్ జిల్లాలో 1,217 పనులకు పరిపాలనాపరమైన అనుమతులు లభించగా 1,034 పనులు చేపట్టారు. వీటిలో 122 పనులు పూర్తికాగా తొమ్మిదింటిని మాత్రమే సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేయగలిగారు. నాలుగు బిల్లులకు సంబంధించి చెల్లింపులు జరిగాయి. వైయస్ఆర్ జిల్లా కంటే అన్నమయ్య జిల్లా కాస్త నయమనిపిస్తోంది. జిల్లాలో 46 బిల్లులను అప్లోడ్ చేయగలిగారు. రాష్ట్రంలోనే ముందంజలో ఉండే విధంగా నిలబడిగలిగారు. గ్రామీణ ప్రాంతాలకు నిధులు వచ్చినప్పటికీ పురపాలక, నగర పాలక సంఘాల పరిధిలో పనులకు నిధులు అందుబాటులోకి రాలేదు. చాలా వరకు నగర, పట్టణాల్లోనే పనులకు ఆమోదం లభించింది.
మందగించిన కార్యక్రమం
ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా సూచించినా అన్నమయ్య, వైయస్ఆర్ జిల్లాల్లో కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టితో నిర్వహించడంలేదు. రాజంపేట నియోజకవర్గ పరిధిలోని ఒంటిమిట్ట, సిద్దవటం మండలాల్లో పూర్తిస్థాయిలో ఒక్క సచివాలయంలోనూ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ఆరింటిలో కార్యక్రమాన్ని పాక్షికంగానే పూర్తిచేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. పులివెందులలో 90 సచివాలయాలకుగానూ 12 చోట్ల మాత్రమే బాధ్యతలు నిర్వహిస్తున్న ఎంపీ అవినాష్రెడ్డి నిర్వహించగలిగారు. ప్రొద్దుటూరులో మాత్రం 82 గానూ 74 పూర్తి చేశారు. జమ్మలమడుగులో 99 గానూ 48, కమలాపురంలో 82గానూ 40, కడపలో 94 గానూ 37, మైదుకూరులో 83 గానూ 33, బద్వేలులో 96 గానూ 34 సచివాలయాల్లో కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇలా వైయస్ఆర్ జిల్లా పరిధిలో 645 సచివాలయాలకుగానూ 278 పూర్తి చేశారు. అన్నమయ్య జిల్లాలో 501 గానూ 207 సచివాలయాల్లో కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో నిర్వహించారు. ఇటీవల రెండు జిల్లాలోనూ కార్యక్రమం నిర్వహణ మందగించింది.
పట్టణాలకు నిధులు రావాల్సి ఉంది
గ్రామీణ ప్రాంతాల పనులకు నిధులు కేటాయించినప్పటికీ పట్టణ/ నగర ప్రాంతాల్లోని పనులకు రావాల్సి ఉంది. సాంకేతికపరమైన కారణాలతో నిధులు కేటాయింపులో జాప్యం జరిగింది. త్వరలోనే నిధులొచ్చే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని పనులకు ఆయా విభాగాలకు కేటాయింపులు జరిగాయి.
వెంకట్రావు, సీపీవో, వైయస్ఆర్ జిల్లా
రెండు జిల్లాల్లో చేపట్టిన పనులివే
సిమెంటు రహదారులు, మురుగు కాలువల నిర్మాణం, మరమ్మతులు, తాగునీటి సరఫరా, విద్యుత్తు లైన్లు, స్తంభాల ఏర్పాటు, ప్రహరీలు, కల్వర్టుల
నిర్మాణ పనులు నిర్వహించిన శాఖలు: పంచాయతీరాజ్, పుర/నగరపాలక సంస్థలు, గ్రామీణ నీటి సరఫరా విభాగం, ఎస్పీడీసీఎల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుగుబాటు మొదలైంది.. జగన్ ఇంటికి పోవడం ఖాయం: చంద్రబాబు
[ 25-04-2024]
రాయలసీమలో తిరుగుబాటు మొదలైందని.. జగన్ ఇంటికి పోవడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
వైకాపాని పాతాళానికి తొక్కేద్దాం.. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం: పవన్
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దాం.. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
[ 25-04-2024]
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
[ 25-04-2024]
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
[ 25-04-2024]
సీఎం జగన్ వైకాపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు గురువారం పులివెందుల రానున్నారు. -
మీ బిడ్డనని గారాలు... నీ గడ్డపైనే ఘోరాలు!
[ 25-04-2024]
రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా నరేగా నుంచి రూ.26.02 కోట్లతో 349 మట్టి పనులను వైకాపా నేతలకు పంచిపెట్టారు. -
ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం
[ 25-04-2024]
మాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎన్డీఏ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు -
నేడు రాజంపేట, రైల్వేకోడూరులో ప్రజాగళం
[ 25-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరు పర్యటనకు రానున్నారు -
అక్రమాలకు పాల్పడకుండా గెలిచే సత్తా మీకుందా?
[ 25-04-2024]
అక్రమాలకు పాల్పడకుండా పులివెందులలో గెలిచే సత్తా మీకుందా? అని తెదేపా పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి సీఎం జగన్కు సవాల్ విసిరారు -
నీళ్లు గరళం... పారిశుద్ధ్యం అధ్వానం
[ 25-04-2024]
నియోజకవర్గ కేంద్రాలు ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు పట్టణ ప్రాంతాల్లోని కాలనీల ప్రజలు కనీస వసతులకు నోచుకోలేక తల్లడిల్లుతున్నారు -
జగన్ పాలనలో పర్యాటకాభివృద్ధి శూన్యం
[ 25-04-2024]
పర్యాటకుల నుంచి ఛార్జీలు, పన్నులు తదితరాల పేరుతో ఆదాయం వస్తున్నా ఆ రంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. -
జగనన్న హామీలు...నీటి మూటలు
[ 25-04-2024]
ఆరునూరైనా అభివృద్ధి చేసి తీరుతాం.. మైదుకూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామంటూ జగన్ ప్రభుత్వంలో పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ