తితిదేపై పూల భారం!
ఉమ్మడి కడప జిల్లాలోని తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఉన్న విలీన ఆలయాల్లో మూలవరులు, ఉత్సవ, దేవతామూర్తులకు రోజువారీగా పుష్పాలంకరణ చేస్తున్నారు.
ఈసారి ధరలను పెంచిన గుత్తేదారులు
టెండరు పత్రాలు పరిశీలించిన అధికారులు
గుత్తపత్రాలను పరిశీలిస్తున్న తితిదే అధికారులు
ఒంటిమిట్ట, న్యూస్టుడే: ఉమ్మడి కడప జిల్లాలోని తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఉన్న విలీన ఆలయాల్లో మూలవరులు, ఉత్సవ, దేవతామూర్తులకు రోజువారీగా పుష్పాలంకరణ చేస్తున్నారు. పూలతో పూజా కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. సరఫరా చేయడానికి అధికారులు గుత్తపత్రాలను ఆహ్వానించారు. ఈసారి గుత్తేదారులు మునుపటి కంటే అధికంగా ధరలను నమోదు చేశారు. ఇలా ఆమాంతం పెంచడంతో తితిదేపై అదనపు భారం పడనుంది. వైయస్ఆర్ జిల్లాలో జమ్మలమడుగు నారాపుర వెంకటేశ్వరస్వామి ఆలయానికి ప్రతిరోజూ 33 కిలోలు పూలు అవసరం. ప్రస్తుతం కిలో రూ.95 వంతున తీసుకుని గుత్తేదారులు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఒప్పంద గడువు ముగియడంతో ఒంటిమిట్ట ఉప కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో గురువారం గుత్తపత్రాలను ఆహ్వానించారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం దేవళంపల్లికి చెందిన పి.అమరావతి కిలోకి రూ.130, ఇదే గ్రామ నివాసి పి.పద్మావతి రూ.136, రాయచోటి మండలం కొత్తపేటకు చెందిన సి.రవీంద్రరాజు రూ.145కి సరఫరా చేస్తామని గుత్తపత్రాలను సమర్పించారు. డిప్యూటీ ఈవో నటేష్బాబు, అకౌంట్సు విభాగం ఏఈవో గోపాల్రావు, పర్యవేక్షకుడు వెంకటేశయ్య ఆధ్వర్యంలో పరిశీలించారు. ముగ్గురిలో ధరలను తక్కువగా నమోదు చేసిన పద్మావతితో అధికారులు మధ్యేమార్గంగా చర్చించారు. చివరికి కిలోకి రూ.110 ఇస్తే సరఫరా చేస్తామని ఆమె అంగీకరించారు. ఇప్పటి కంటే కిలోపై రూ.15 భారం పెరిగింది. ఈ లెక్కన రోజుకి 33 కిలోలపై రూ.495 భారం పడనుంది. ఏడాదికి రూ.1.80 లక్షల మేర తితిదేపై అదనపు వడ్డన పడనుంది. అన్నమయ్య జిల్లా తాళ్లపాకలో చెన్నకేశవ, సిద్దేశ్వర ఆలయాలకు ప్రతిరోజూ 30 కిలోలు తెప్పించాలని ఉన్నతాధికారులు అనుమతిచ్చారు. ప్రస్తుతం కిలోకి రూ.68 మేర చెల్లిస్తున్నారు. తాజాగా టెండర్లు పిలవడంతో ముగ్గురు పోటీ పడ్డారు. పి.పద్మావతి కిలోకి రూ.105, ఎస్.వినోద్కుమార్ రూ.120, సి.రవీంద్రరాజు రూ.140 వంతున ఇస్తే సరఫరా చేస్తామని నమోదు చేశారు. వీరిలో పి.పద్మావతితో ఇప్పటి కంటే అధికంగా నమోదు చేశారు. ఇంత ఎక్కువగా ఇవ్వలేమని అధికారులు చర్చించారు. చివరికి రూ.95కు ఇవ్వడానికి సమ్మతించారు. ఇప్పటి ధర కంటే కిలోపై అదనంగా రూ.27 వంతున, రోజుకి 30 కిలోలకు రూ.810 భారం పడుతుంది. ఏడాదికి రూ.2.93 లక్షలకుపైగా అదనం భారం కానుంది. జమ్మలమడుగు, తాళ్లపాక ఆలయాలకు పూల సరఫరా గుత్తేదారులు అధికంగా నమోదు చేసిన ధరలపై డిప్యూటీ ఈవో పి.వి.నటేష్బాబుతో ‘న్యూస్టుడే’ మాట్లాడగా గుత్తపత్రాలను పరిశీలించామని, ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఉన్నతాధికారుల అనుమతి కోసం ప్రతిపాదనలు పంపుతున్నామని, అక్కడ నుంచి అనుమతులొస్తే పూల సరఫరా చేయాలని గుత్తేదారుతో ఒప్పందం చేసుకుంటామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించాలి
[ 25-04-2024]
మండలంలోని శంకవరంలో గురువారం రాత్రి భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోశన్న కుమారుడు బొజ్జా కార్తీక్, తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
తిరుగుబాటు మొదలైంది.. జగన్ ఇంటికి పోవడం ఖాయం: చంద్రబాబు
[ 25-04-2024]
రాయలసీమలో తిరుగుబాటు మొదలైందని.. జగన్ ఇంటికి పోవడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
వైకాపాని పాతాళానికి తొక్కేద్దాం.. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం: పవన్
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దాం.. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
[ 25-04-2024]
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
[ 25-04-2024]
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
[ 25-04-2024]
సీఎం జగన్ వైకాపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు గురువారం పులివెందుల రానున్నారు. -
మీ బిడ్డనని గారాలు... నీ గడ్డపైనే ఘోరాలు!
[ 25-04-2024]
రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా నరేగా నుంచి రూ.26.02 కోట్లతో 349 మట్టి పనులను వైకాపా నేతలకు పంచిపెట్టారు. -
ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం
[ 25-04-2024]
మాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎన్డీఏ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు -
నేడు రాజంపేట, రైల్వేకోడూరులో ప్రజాగళం
[ 25-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరు పర్యటనకు రానున్నారు -
అక్రమాలకు పాల్పడకుండా గెలిచే సత్తా మీకుందా?
[ 25-04-2024]
అక్రమాలకు పాల్పడకుండా పులివెందులలో గెలిచే సత్తా మీకుందా? అని తెదేపా పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి సీఎం జగన్కు సవాల్ విసిరారు -
నీళ్లు గరళం... పారిశుద్ధ్యం అధ్వానం
[ 25-04-2024]
నియోజకవర్గ కేంద్రాలు ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు పట్టణ ప్రాంతాల్లోని కాలనీల ప్రజలు కనీస వసతులకు నోచుకోలేక తల్లడిల్లుతున్నారు -
జగన్ పాలనలో పర్యాటకాభివృద్ధి శూన్యం
[ 25-04-2024]
పర్యాటకుల నుంచి ఛార్జీలు, పన్నులు తదితరాల పేరుతో ఆదాయం వస్తున్నా ఆ రంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. -
జగనన్న హామీలు...నీటి మూటలు
[ 25-04-2024]
ఆరునూరైనా అభివృద్ధి చేసి తీరుతాం.. మైదుకూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామంటూ జగన్ ప్రభుత్వంలో పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా