logo

లోకేశ్‌ ప్రచార వాహనం జప్తుపై ఆందోళన

పలమనేరు నియోజకవర్గంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రచార వాహనాన్ని జపు చేస్తే సహించేదిలేదని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ తెదేపా బాధ్యుడు దొమ్మలపాటి రమేశ్‌ హెచ్చరించారు.

Published : 03 Feb 2023 01:08 IST

నారా లోకేశ్‌ వాహనాన్ని జప్తు చేసినందుకు నిరసనగా ఆందోళన

చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రమేశ్‌, తెదేపా శ్రేణులు

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే : పలమనేరు నియోజకవర్గంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రచార వాహనాన్ని జపు చేస్తే సహించేదిలేదని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ తెదేపా బాధ్యుడు దొమ్మలపాటి రమేశ్‌ హెచ్చరించారు. గురువారం పలమనేరు నియోజకవర్గంలో జరిగిన యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌ ప్రసంగం అనంతరం వాహనాన్ని జప్తు చేయడానికి పోలీసులు సిద్ధం కావడంతో, విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి అక్కడికి చేరుకుని పోలీసులను అడ్డుకున్నారు. అనంతరం పోలీసు అధికారులతో మాట్లాడారు. పోలీసులు వాహనాన్ని జప్తు చేయడంలేదని చెప్పడంతో వాహనాన్ని తీసుకెళ్లారు. కార్యక్రమంలో యువ నాయకుడు యశశ్విరాజ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని