రైతుల గుండెల్లో పేలుళ్లు!
మైలవరం మండలంలో క్వారీ పేలుళ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడంతో పాటు వారి బతుకులపై తీవ్ర ప్రభావితం చూపుతున్నాయి.
పంటలకు తీవ్ర నష్టం గ్రామాల్లో ఇళ్ల ధ్వంసం
ఈనాడు డిజిటల్, కడప, న్యూస్టుడే, జమ్మలమడుగు, మైలవరం
మిరప పంటపై పేరుకుపోయిన దుమ్ము
మైలవరం మండలంలో క్వారీ పేలుళ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడంతో పాటు వారి బతుకులపై తీవ్ర ప్రభావితం చూపుతున్నాయి. ఇక్కడి సిమెంటు పరిశ్రమ యాజమాన్యాలతో పాటు పర్య వేక్షణాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. పరిశ్రమ రాకతో తమ గ్రామాలు బాగుపడుతాయని గ్రామీణులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం అదే పరిశ్రమ తమ ఒళ్లు, ఇళ్లు, పంటలు గుల్ల చేస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ క్వారీలో పేలుళ్లు చేస్తుండడంతో సమీప గ్రామాలైన దుగ్గనపల్లె, నవాబుపేట గ్రామాల్లోని ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. జనవరి నుంచి కొత్త సమస్య తెచ్చింది. తూర్పు నుంచి పడమరకు వీచే గాలులతో పరిశ్రమ ద్వారా వచ్చే దుమ్ము, ధూళి పంటలపై పేరుకుపోతోంది. దీని కారణంగా దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోందని మైలవరం మండల బాధిత రైతులు వాపోతున్నారు.
క్వారీ పేలుళ్లతో నెర్రెలిచ్చిన ఓ ఇంటి గోడలు
మైలవరం మండలంలోని ఓ సిమెంటు పరిశ్రమతో రెండు గ్రామాల ప్రజలు దినదిన గండంలా బతుకుతున్నారు. దుగ్గనపల్లె సమీపంలో సున్నపురాయి కోసం వందలాది ఎకరాలను పరిశ్రమ యాజమాన్యం సొంతం చేసుకుంది. ఇక్కడ వెలికితీసే సున్నపు రాయిని సిమెంటు తయారీకి వినియోగిస్తారు. భూగర్భంలోని రాయిని పగలుకొట్టేందుకు ప్రతి రోజు మధ్యాహ్నం క్వారీలో మందుగుండు సామగ్రితో పేలుస్తుంటారు. ఆ పేలుళ్లతో సమీపంలోని దుగ్గనపల్లె, నవాబుపేట గ్రామాల్లోని కొన్ని ఇళ్లకు పగుళ్లు వచ్చాయి.
పంట దిగుబడులపై ప్రభావం
పరిశ్రమ నుంచి వెలువడే దుమ్ము...ధూళితో దుగ్గనపల్లె రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పరిశ్రమ నుంచి వెలువడే దుమ్ము, ధూళి పంటలపై చేరి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పురుగుల కోసం మందులు పిచికారీ చేసినా ధూలి కారణంగా ప్రభావం చూపడంలేదని వాపోతున్నారు. తలమంచిపట్నం గ్రామం వరకు గాలి ప్రభావం ఉంటోందని చెబుతున్నారు. ఒక్క దుగ్గనపల్లెలోనే వంద ఎకరాలకు పైగా మిరప తోటలు ఉండగా... ఇతర గ్రామాలతో కలిపి సుమారు 250 ఎకరాల్లోని ఎండు మిర్చి, పత్తి పంటలకు నష్టం జరుగుతోందని బాధితులు వాపోతున్నారు.
దిగుబడిపై ప్రభావం
సిమెంటు పరిశ్రమ ద్వారా వచ్చే ధూళితో మిరప పంట దిగుబడిపై ప్రభావం చూపుతోంది. ఎకరాకు రూ.1.50 లక్షల పెట్టుబడి పెట్టాం. పూత రాలిపోతుండడంతో ఎకరాకు 1,500 కిలోల మిర్చి పండాల్సి ఉంటే వెయ్యి కిలోల లోపే దిగుబడి వస్తోంది. ఎండుమిర్చిని అమ్మేందుకు గుంటూరుకు తీసుకెళ్తే కాయపై ఉన్న దుమ్మును చూసి కొనడంలేదు.
ఇమ్మానుయేలు, మిరప రైతు, దుగ్గనపల్లె
ఇల్లు కూలిపోతోంది
సిమెంటు పరిశ్రమ పేలుళ్లతో మా ఇల్లు నెర్రెలు చీలింది. ఎప్పుడైనా పడిపోవచ్చునని ఇల్లు ఖాళీ చేశాం. డబ్బుల్లేక తాత్కాలికంగా బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నాం. పరిశ్రమ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు.
దానమ్మ, బాధితురాలు, దుగ్గనపల్లె
ప్రాణ భయంతో జీవిస్తున్నాం
పేలుళ్లతో మా ఇల్లు చీలింది. ప్రతి రోజూ భయంతో బతకాల్సి వస్తోంది. పరిశ్రమ యాజమాన్యానికి సమస్య తీసుకెళ్లినా పరిహారం ఇవ్వలేదు. ప్రతి రోజూ మధ్యాహ్నం పేలుళ్లు జరుపుతున్నారు. దుమ్ము, ధూళి కారణంగా బయట ఉన్న వస్తువులన్నీ పాడైపోతున్నాయి.
శాంతకుమారి, బాధితురాలు, దుగ్గనపల్లె
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
[ 25-04-2024]
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
[ 25-04-2024]
సీఎం జగన్ వైకాపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు గురువారం పులివెందుల రానున్నారు. -
మీ బిడ్డనని గారాలు... నీ గడ్డపైనే ఘోరాలు!
[ 25-04-2024]
రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా నరేగా నుంచి రూ.26.02 కోట్లతో 349 మట్టి పనులను వైకాపా నేతలకు పంచిపెట్టారు. -
ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం
[ 25-04-2024]
మాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎన్డీఏ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు -
నేడు రాజంపేట, రైల్వేకోడూరులో ప్రజాగళం
[ 25-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరు పర్యటనకు రానున్నారు -
అక్రమాలకు పాల్పడకుండా గెలిచే సత్తా మీకుందా?
[ 25-04-2024]
అక్రమాలకు పాల్పడకుండా పులివెందులలో గెలిచే సత్తా మీకుందా? అని తెదేపా పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి సీఎం జగన్కు సవాల్ విసిరారు -
నీళ్లు గరళం... పారిశుద్ధ్యం అధ్వానం
[ 25-04-2024]
నియోజకవర్గ కేంద్రాలు ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు పట్టణ ప్రాంతాల్లోని కాలనీల ప్రజలు కనీస వసతులకు నోచుకోలేక తల్లడిల్లుతున్నారు -
జగన్ పాలనలో పర్యాటకాభివృద్ధి శూన్యం
[ 25-04-2024]
పర్యాటకుల నుంచి ఛార్జీలు, పన్నులు తదితరాల పేరుతో ఆదాయం వస్తున్నా ఆ రంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. -
జగనన్న హామీలు...నీటి మూటలు
[ 25-04-2024]
ఆరునూరైనా అభివృద్ధి చేసి తీరుతాం.. మైదుకూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామంటూ జగన్ ప్రభుత్వంలో పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ