ఈ సారీ రిక్తహస్తమే!
ప్రొద్దుటూరు-కంభం రైల్వేలైను పనులకు 2023-24కు రూ.కోటి నిధులు కేటాయించారు. మొత్తం మీద కేంద్ర బడ్జెట్లో రైల్వేశాఖకు మూలధన కేటాయింపులు ఈసారి రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ జిల్లాలోని నాలుగు రైళ్ల ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు అరకొరే.
ర్రైల్వేబడ్జెట్లో ఉమ్మడి కడప జిల్లాకు నిధుల కేటాయింపులు అరకొర
కడప-బెంగళూరు రైల్వే ప్రాజెక్టు అలైన్మెంట్ మార్పుతో సమస్యలు
రైల్వేలైను పూర్తవ్వడానికి మరి కొన్నేళ్లు సమయం పట్టే అవకాశం
- న్యూస్టుడే, కడప ఏడురోడ్లు
పెండ్లిమర్రి వద్ద కడప - బెంగళూరు రైల్వేట్రాక్పై పెరిగిన పిచ్చిమొక్కలు
ప్రొద్దుటూరు-కంభం రైల్వేలైను పనులకు 2023-24కు రూ.కోటి నిధులు కేటాయించారు. మొత్తం మీద కేంద్ర బడ్జెట్లో రైల్వేశాఖకు మూలధన కేటాయింపులు ఈసారి రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ జిల్లాలోని నాలుగు రైళ్ల ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు అరకొరే. రాష్ట్రం నుంచి పెద్దసంఖ్యలో ఎంపీలున్నప్పటికీ నిధులు తెప్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు.
ఎర్రగుంట్ల-నంద్యాల రైలు మార్గం 126 కిలోమీటర్లు. ఈ మార్గం నాలుగేళ్ల కిందటే పూర్తయ్యింది. ప్రస్తుతం రైళ్లు నడుస్తున్నాయి. అందుబాటులోకి వచ్చిన ఈ మార్గానికి 2023-24 బడ్జెట్లో రూ.1.70 కోట్లు కేటాయించారు.
ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో బడ్జెట్లో రైల్వేశాఖకు రూ.2.42 లక్షల కోట్లు కేటాయించారు. ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లా విషయానికొస్తే కడప-బెంగళూరు రైల్వే మార్గం జిల్లా వాసుల చిరకాల కోరిక. రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్గానికి సంబంధించిన అలైన్మెంట్ మార్చడం, దానికి కేంద్రం ఇంతవరకు అనుమతులు ఇవ్వకపోవడంతో ఈ ఏడాది నిధులు కేటాయించలేదు. అయిదేళ్లలో పూర్తిచేస్తామన్న ఈ ప్రాజెక్టు 12 ఏళ్లు గడిచినా ఏమాత్రం పురోగతి లేకపోవడం గమనార్హం. ఎర్రగుంట్ల-నంద్యాల మార్గాం పూర్తయినప్పటికీ అక్కడ డబ్లింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. విద్యుద్దీకరణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఓబులవారిపల్లె- కృష్ణపట్నం రైల్వేలైనులో గూడ్సు రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ఈ మార్గంలో ప్యాసింజరు రైళ్లకు ఇప్పటికీ అనుమతి రాలేదు. ప్రొద్దుటూరు-కంభం రైల్వేలైను పనులు జరగడం లేదు. మొత్తం మీద ఉమ్మడి కడప జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు కావాల్సిన రైలు మార్గాలు, ఇతరత్రా సదుపాయాల కల్పనకు కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు శూన్యమనే చెప్పాలి.
* ప్రధానంగా కడప-బెంగళూరు రైల్వేలైన్పై ఉమ్మడి కడప జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సుమారు 255.4 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ నిర్మించాలని భావించారు. తొలుత ఈ ప్రాజెక్టును రూ.1023 కోట్ల అంచనా వ్యయంతో కేంద్రం అనుమతి పొందినప్పటికీ శంకుస్థాపన నాటికి అంచనా వ్యయం రూ.1,784.64 కోట్లకు చేరింది. 2010-11లో రూ.29 కోట్లు, 2011-12లో రూ.50 కోట్లు, 2012-13లో రూ.38 కోట్లు, 2013-14లో రూ.70 కోట్లు, 2014-15లో రూ.30 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో కడప-పెండ్లిమర్రి వరకు 22 కిలోమీటర్ల మేర రైల్వేట్రాక్ ఏర్పాటు చేశారు. పెండ్లిమర్రి నుంచి గండి వరకు భూసేకరణ చేపట్టారు. ఆపై రాష్ట్ర ప్రభుత్వం తాను ఇవ్వాల్సిన 50 శాతం వాటాను నిధుల లేమితో ఇవ్వలేకపోవడం... రోజులు గడిచే కొద్దీ నిర్మాణ వ్యయం పెరగడంతో కడప-బెంగళూరు రైల్వేలైను అలైన్ మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం వద్దనడం... దాని స్థానంలో ముద్దనూరు నుంచి ముదిగుబ్బ వరకు కేవలం 72 కిలోమీటర్లు రైల్వేట్రాక్ నిర్మిస్తే కడప, కమలాపురం, ఎర్రగుంట్ల, ముద్దనూరు, పులివెందుల మీదుగా అనంతపురం జిల్లా ముదిగుబ్బకు వెళ్లి అక్కడి నుంచి కనెక్టివిటీ ట్రాక్ ద్వారా బెంగళూరుకు చేరవచ్చునని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించుకుంది... ఈ విధంగా చేయడంతో రైల్వేట్రాక్ నిర్మాణ వ్యయం తగ్గడమే కాకుండా పనులను కూడా వేగవంతంగా చేయవచ్చునని రాష్ట్రప్రభుత్వం భావించి అందుకు సంబంధించిన నూతన అలైన్మెంట్ను కేంద్ర ప్రభుత్వానికి గతేడాది పంపింది. ఈ అలైన్మెంట్ మార్పునకు ఇంత వరకు ఎటువంటి నిర్ణయం వెలువడలేదు. ఈ మార్గం నిర్మాణానికి 2015-16 నుంచి నిధులు నిలిచిపోగా, ఈసారి రైల్వే బడ్జెట్లో కేవలం రూ.10.01 లక్షలు కేటాయించారు.
* ఓబులవారిపల్లె-కృష్ణపట్నంకు 113 కిలోమీటర్ల పొడవునా రైలు మార్గం నిర్మించారు. ఈ మార్గంలో గతేడాది నుంచి గూడ్సు రైళ్లు తిరుగుతున్నాయి. ఈ మార్గంలో ప్యాసింజరు రైళ్లను నడపాల్సి ఉంది. అందుకు సంబంధించిన అనుమతులు ఇంతవరకు లభించలేదు. సరకు రవాణా ద్వారా వచ్చే ఆదాయంపైనే రైల్వేశ్రద్ధ కనబరుస్తోందని, ప్రయాణికుల గురించి పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. ఈ మార్గంలో ప్యాసింజరు రైళ్లను నడిపితే కడప నుంచి నెల్లూరుకు వెళ్లేందుకు దూరం తగ్గుతుంది. ప్రస్తుతం కడప నుంచి తిరుపతికి వెళ్లి అక్కడ నుంచి శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు మీదుగా నెల్లూరుకు పోవాల్సి ఉంటుంది. ఓబులవారిపల్లె నుంచి కృష్ణపట్నంకు వెళితే చాలా దూరం తగ్గుతుంది. దీంతోపాటు జిల్లా నుంచి విజయవాడకు వెళ్లేందుకు కూడా ప్రయాణ దూరం తగ్గుతుంది. ఓబులవారిపల్లె నుంచి కృష్ణపట్నం /నెల్లూరుకు చేరుకున్న అనంతరం నెల్లూరు నుంచి ప్రకాశం, గుంటూరు మీదుగా విజయవాడకు వెళ్లవచ్చు. ఇప్పటికే గూడ్సు రైళ్లు నడుస్తున్న ఈ మార్గానికి బడ్జెట్లో కేవలం రూ.1,000 కేటాయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాయంచపై రాములోరి రాజసం
[ 19-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు గురువారం రాత్రి రాయంచపై రాములోరి విహారం కనులపండువగా సాగింది. -
మొదలైన నామినేషన్ల సందడి
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ గురువారం మొదలైంది. కలెక్టర్ విజయ రామరాజు ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం కలెక్టరేట్లోని తన ఛాంబరులో నామపత్రాల స్వీకరణను ఆయన ప్రారంభించారు. -
జగన్ను నమ్మాం... నిండా మునిగాం!
[ 19-04-2024]
‘నేను ఉన్నానన్నావ్... నేను విన్నానన్నావ్... నిజమే అనుకున్నాం... నీ మాటలు విని మా బాధలు తెలుసుకుంటావని, పరిష్కారం చూపుతావని ఎంతో ఆశతో నిన్ను గెలిపించాం... తీరా చూస్తే నువ్వు ఉన్నావు... కానీ వినే ఓపికే లేకుండా పోయింది. -
షర్మిలకు మద్దతుగా పులివెందులలో సునీత ప్రచారం
[ 19-04-2024]
కడప పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల తరఫున మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత దంపతులు గురువారం నుంచి ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. -
బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మరథం
[ 19-04-2024]
బ్రహ్మాండ నాయకుడైన శ్రీరాముడి రథోత్సవం గురువారం వాల్మీకి క్షేత్రంలో వైభవంగా జరిగింది. ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
మరో వైకాపా ఫ్యానుపై వేటు
[ 19-04-2024]
వృత్తి ఉద్యోగమైనా... నిబంధనలు ఉల్లంఘించి అత్యుత్సాహంతో ముఖ్యమంత్రి జగన్కు ఊడిగం చేసే వారికి తగిన శాస్తి జరుగుతుందనడానికి నిదర్శనమే... ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై వేటు. -
పెద్దిరెడ్డి కుటుంబ దోపిడీని ఓటుతో అడ్డుకోండి
[ 19-04-2024]
రాజంపేట పార్లమెంట్ పరిధిలో పెద్దిరెడ్డి దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ముఖ్యమంత్రి, భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. -
జగన్ బాటలో బస్సులు.. జనానికి ‘ముప్పు’తిప్పలు!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో పల్లెలకు బస్సులు దూరమయ్యాయి... కొత్త బస్సులు రాకపోగా, ఉన్న బస్సులు మరమ్మతులకు గురయ్యాయి... పల్లె బస్సులు రద్దయ్యాయి. అవీ ఎప్పుడొస్తాయో తెలియదు. -
బ్రహ్మోత్సవ శోభ... ఆధ్యాత్మిక ప్రభ
[ 19-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రామయ్య క్షేత్రంలో రెండో రోజు గురువారం ఉదయం యాగశాలలో తితిదే ఆగమ సలహాదారు కల్యాణపురం రాజేష్ భట్టార్ ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించారు. -
జగనన్న చెప్పాడంటే చెయ్యడంతే
[ 19-04-2024]
మైకు పట్టుకుని రాజకీయ నాయకులేం చెబుతారో ఎన్నికల తర్వాత ఆ పని చేయకపోతే రాజీనామా చేసిపోయే పరిస్థితి రావాలన్నావు. నీ మాటలు నమ్మి ప్రశ్నిస్తే.. కేసులు పెట్టిస్తున్నావ్.. నీ అనునాయులతో ఉరికించి ఉరికించి కొట్టిస్తున్నావ్.. చెప్పిన మాటకు కట్టుబడక పోతే ఎలాగన్నా. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి
[ 19-04-2024]
కేంద్రం, రాష్ట్రంలో తమ ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే చేనేత కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తామని కడప ఎంపీ తెదేపా అభ్యర్థి భూపేష్రెడ్డి, జమ్మలమడుగు అసెంబ్లీ భాజపా అభ్యర్థి ఆదినారాయణరెడ్డి హామీ ఇచ్చారు. -
జిల్లాకు చేరుకున్న కేంద్ర ఎన్నికల పరిశీలకులు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై పర్యవేక్షణకు కేంద్ర ఎన్నికల పరిశీలకులు గురువారం జిల్లాకు చేరుకున్నారు. తొలుత కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, ఎస్పీ కృష్ణారావు, ఇతర జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. -
రాజంపేట వైకాపాలో ముసలం
[ 19-04-2024]
రాజంపేట వైకాపాలో ముసలం పుట్టింది. నియోజకవర్గానికి చెందిన వైకాపా నాయకులు, కార్యకర్తలు ఇటీవల తెదేపాలో చేరారు. ఈ క్రమంలో హైదరాబాద్లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో బుధవారం జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు, తెదేపా నాయకుడు పోలి సుబ్బారెడ్డి, సుగవాసి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో నందలూరు, రాజంపేట మండలాలకు చెందిన వైకాపా నేతలు పార్టీలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM