logo

‘పులివెందులలో తెదేపా జెండా ఎగరేస్తాం’

పులివెందులలో రాబోయే ఎన్నికల్లో తెదేపా గెలుపునకు అన్ని అంశాలు కలిసొస్తున్నాయని, ఇందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని తెదేపా అధినేత చంద్రబాబునాయుడికి ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.

Published : 04 Feb 2023 05:05 IST

తెదేపా అధినేత చంద్రబాబునాయుడితో చర్చిస్తున్న ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి

పులివెందుల, న్యూస్‌టుడే : పులివెందులలో రాబోయే ఎన్నికల్లో తెదేపా గెలుపునకు అన్ని అంశాలు కలిసొస్తున్నాయని, ఇందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని తెదేపా అధినేత చంద్రబాబునాయుడికి ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. విజయవాడలోని మంగళగిరిలో శుక్రవారం చంద్రబాబును ఆయన కలిశారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసు ముందుకు వెళ్లకుండా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అడ్డుపడుతున్నారని గ్రహించిన ప్రజలు ఆయనకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారని పేర్కొన్నారు. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి కాల్‌డేటా ఆధారంగా సీబీఐ అధికారులు చేస్తున్న విచారణతో క్రమంగా వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. దీంతో వైఎస్‌ జగన్‌ క్రమంగా ప్రజల్లో ఆదరణ కోల్పోతున్నారని, అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. ఈ పరిణామాలను సానుకూలంగా మలుచుకుని రాబోయే ఎన్నికల్లో తెదేపా జెండా ఎగిరేలా చేస్తామని అధినేతకు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని