వాయుబండపై బాదుడు
గ్యాస్ సిలిండర్ ఇంటికి తెచ్చినప్పుడు రసీదుపై ఉన్న మొత్తాన్ని మాత్రమే చెల్లించాలని.. అదనంగా ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.
ఒక్కో సిలిండర్ డెలివరీకి అదనంగా రూ.50 వసూలు
జిల్లాలో వినియోగదారుపై నెలకు రూ.1.80 కోట్ల భారం
గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లు
జమ్మలమడుగు, పులివెందుల, న్యూస్టుడే: గ్యాస్ సిలిండర్ ఇంటికి తెచ్చినప్పుడు రసీదుపై ఉన్న మొత్తాన్ని మాత్రమే చెల్లించాలని.. అదనంగా ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్కుమార్ ఇటీవల ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వసూలు చేసినట్లయితే జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, ఇంధన సంస్థల మార్కెటింగ్ సిబ్బందికి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. క్షేత్ర స్థాయిలో వాటిని అమ లు చేయాల్సిన జిల్లా పౌరసరఫరాల శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డీటీలపైనే ఉంటోంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.1,111 ఉంది. ఇంటికి చేరాలంటే డెలివరీ చేసే బాయ్ రూ.30 నుంచి రూ.40 వరకు చేయి తడపాల్సి ఉంటుంది. లేకుంటే తర్వాత బుక్ చేసుకునే వాయుబండ తూకం తగ్గడమో, జాప్యం చేయడమో జరుగుతుందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పైఅంతస్తుల్లో ఉన్నవారికి మరింత మొత్తం వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
* జిల్లాలో గృహ వినియోగదారులకు సంబంధించిన కనెక్షన్లు 5,99,802 ఉన్నాయి. కనీసం నెలకు ఒకసారి వాయుబండను సగటున బుక్ చేస్తున్నారు. అదనంగా వసూలు చేస్తున్న రూ.30తో లెక్కిస్తే సుమారు నెలకు రూ.1.80 కోట్లు అవుతోంది. ఏడాదికి అదనపు సొమ్ము విలువ రూ.21.60 కోట్లు అవుతోంది. పెద్ద పట్టణాల్లో రూ.40 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
5 కి.మీ.లోపు అయితే అవసరం లేదు
5 కి.మీ. లోపు బిల్లుపై పేర్కొన్న మొత్తం కంటే అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ పరిధి దాటితే నిబంధనల ప్రకారం ఇస్తే చాలు. డెలివరీ బాయ్లు డిమాండ్ చేస్తే స్థానిక ఎన్ఫోర్స్మెంట్ డీటీలకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.
సుబ్బారెడ్డి, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి, కడప
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పులివెందులలోనూ పరదాల వీరుడే
[ 25-04-2024]
సీఎం జగన్ వైకాపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు గురువారం పులివెందుల రానున్నారు. -
మీ బిడ్డనని గారాలు... నీ గడ్డపైనే ఘోరాలు!
[ 25-04-2024]
రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా నరేగా నుంచి రూ.26.02 కోట్లతో 349 మట్టి పనులను వైకాపా నేతలకు పంచిపెట్టారు. -
ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం
[ 25-04-2024]
మాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎన్డీఏ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు -
నేడు రాజంపేట, రైల్వేకోడూరులో ప్రజాగళం
[ 25-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరు పర్యటనకు రానున్నారు -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
[ 25-04-2024]
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
అక్రమాలకు పాల్పడకుండా గెలిచే సత్తా మీకుందా?
[ 25-04-2024]
అక్రమాలకు పాల్పడకుండా పులివెందులలో గెలిచే సత్తా మీకుందా? అని తెదేపా పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి సీఎం జగన్కు సవాల్ విసిరారు -
నీళ్లు గరళం... పారిశుద్ధ్యం అధ్వానం
[ 25-04-2024]
నియోజకవర్గ కేంద్రాలు ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు పట్టణ ప్రాంతాల్లోని కాలనీల ప్రజలు కనీస వసతులకు నోచుకోలేక తల్లడిల్లుతున్నారు -
జగన్ పాలనలో పర్యాటకాభివృద్ధి శూన్యం
[ 25-04-2024]
పర్యాటకుల నుంచి ఛార్జీలు, పన్నులు తదితరాల పేరుతో ఆదాయం వస్తున్నా ఆ రంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. -
జగనన్న హామీలు...నీటి మూటలు
[ 25-04-2024]
ఆరునూరైనా అభివృద్ధి చేసి తీరుతాం.. మైదుకూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామంటూ జగన్ ప్రభుత్వంలో పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి.