అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడి అరెస్టు
పలు రాష్ట్రాలకు చెందిన 440 మంది నకిలీ వేలిముద్రలు తయారుచేసి వారి ఖాతాల్లో నుంచి నగదు కాజేసిన అంతర్రాష్ట్ర సైబర్ నేరగాన్ని అరెస్టు చేసినట్లు వైయస్ఆర్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ అన్బురాజన్, పక్కన డీఎస్పీ చెంచుబాబు, సీఐ శ్రీరాం శ్రీనివాస్
కడప నేరవార్తలు, న్యూస్టుడే : పలు రాష్ట్రాలకు చెందిన 440 మంది నకిలీ వేలిముద్రలు తయారుచేసి వారి ఖాతాల్లో నుంచి నగదు కాజేసిన అంతర్రాష్ట్ర సైబర్ నేరగాన్ని అరెస్టు చేసినట్లు వైయస్ఆర్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని పెన్నార్ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను ఎస్పీ వెల్లడించారు. ‘వైయస్ఆర్ జిల్లా కడప ఫక్కీర్పల్లెకు చెందిన సనాపు రాజశేఖర్రెడ్డికి కెనరా, యూనియన్ బ్యాంకుల్లో ఖాతాలున్నాయి. 2022 జులై 21 నుంచి 29వ తేదీ వరకు అతనికి తెలియకుండా ఎలాంటి ఓటీపీలు, లింక్లు రాకుండానే రూ.89,550 నగదు డ్రా అయింది. బాధితుడు కడప చిన్నచౌకు ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశాం. ఈ కేసును ఛేదించడానికి ఏఎస్పీ తుషార్ డూడిని నియమించాం. ఆధార్ ఎనేబుల్ సిస్టం (ఏఈపీఎస్) ద్వారా బాధితుని నకిలీ వేలిముద్రలను సృష్టించి కస్టమర్ సర్వీస్ పాయింట్లోని బయోమెట్రిక్ డివైస్ స్కానర్లో ఖాతాదారుని ఆధార్కార్డుకు లింకు ఉన్న బ్యాంకు ఖాతా నుంచి రోజుకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.89,550 నగదును డ్రా చేశారు. ఏఈపీఎస్ ద్వారానే సైబర్ నేరానికి పాల్పడినట్లు తెలుసుకున్నాం. ఇలాంటి నేరాలు ఎక్కువగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘోరక్పూర్ జిల్లాలో చేస్తారని తెలిసింది. చిన్నచౌకు సీఐ శ్రీరాం శ్రీనివాస్, ఎస్సై అమర్నాథ్రెడ్డి, సైబర్ క్రైం ఠాణా బృందం ఉత్తరప్రదేశ్కు వెళ్లి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నేరగాళ్ల సమాచారం తెలుసుకున్నారు. ఘోరక్పూర్ జిల్లాకు చెందిన శేషనాథ్శర్మను అదుపులోకి తీసుకుని విచారించగా తన స్నేహితులు వికాష్ అలియాస్ విక్కీ, అక్షయయాదవ్ సహకారంతో ఏపీ, తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు చెందిన 440 మంది ఆధార్ సమాచారాన్ని దొంగచాటుగా సేకరించి, వాటి ద్వారా నకిలీ వేలిముద్రలు తయారు చేశారు. ఆ వేలి ముద్రలను ఉపయోగించి ఖాతాదారులకు తెలియకుండా వారి ఖాతా నుంచి నగదు డ్రా చేసినట్లు అంగీకరించారు. శేషనాథ్శర్మను అరెస్టు చేసి అతని నుంచి బయోమెట్రిక్, కంటప్యూటర్ను స్వాధీన పరుచుకున్నాం. వికాష్ అలియాస్ విక్కీ, అక్షయయాదవ్ పరారీలో ఉన్నారు, వారి కోసం గాలిస్తున్నాం. ఇలాంటి మోసానికి గురైన బాధితులు ఎవరైనా ఉంటే సంబంధిత ఠాణాల్లో ఫిర్యాదు చేయాలి’ అని ఎస్పీ సూచించారు. సమావేశంలో డీఎస్పీ చెంచుబాబు, సీఐ శ్రీరాంశ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించాలి
[ 25-04-2024]
మండలంలోని శంకవరంలో గురువారం రాత్రి భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోశన్న కుమారుడు బొజ్జా కార్తీక్, తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
తిరుగుబాటు మొదలైంది.. జగన్ ఇంటికి పోవడం ఖాయం: చంద్రబాబు
[ 25-04-2024]
రాయలసీమలో తిరుగుబాటు మొదలైందని.. జగన్ ఇంటికి పోవడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
వైకాపాని పాతాళానికి తొక్కేద్దాం.. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం: పవన్
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దాం.. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
[ 25-04-2024]
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
[ 25-04-2024]
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
[ 25-04-2024]
సీఎం జగన్ వైకాపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు గురువారం పులివెందుల రానున్నారు. -
మీ బిడ్డనని గారాలు... నీ గడ్డపైనే ఘోరాలు!
[ 25-04-2024]
రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా నరేగా నుంచి రూ.26.02 కోట్లతో 349 మట్టి పనులను వైకాపా నేతలకు పంచిపెట్టారు. -
ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం
[ 25-04-2024]
మాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎన్డీఏ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు -
నేడు రాజంపేట, రైల్వేకోడూరులో ప్రజాగళం
[ 25-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరు పర్యటనకు రానున్నారు -
అక్రమాలకు పాల్పడకుండా గెలిచే సత్తా మీకుందా?
[ 25-04-2024]
అక్రమాలకు పాల్పడకుండా పులివెందులలో గెలిచే సత్తా మీకుందా? అని తెదేపా పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి సీఎం జగన్కు సవాల్ విసిరారు -
నీళ్లు గరళం... పారిశుద్ధ్యం అధ్వానం
[ 25-04-2024]
నియోజకవర్గ కేంద్రాలు ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు పట్టణ ప్రాంతాల్లోని కాలనీల ప్రజలు కనీస వసతులకు నోచుకోలేక తల్లడిల్లుతున్నారు -
జగన్ పాలనలో పర్యాటకాభివృద్ధి శూన్యం
[ 25-04-2024]
పర్యాటకుల నుంచి ఛార్జీలు, పన్నులు తదితరాల పేరుతో ఆదాయం వస్తున్నా ఆ రంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. -
జగనన్న హామీలు...నీటి మూటలు
[ 25-04-2024]
ఆరునూరైనా అభివృద్ధి చేసి తీరుతాం.. మైదుకూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామంటూ జగన్ ప్రభుత్వంలో పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM