వచ్చే ఎన్నికల్లో తెదేపా గెలుపు తథ్యం
యువతలో ఆత్మస్థైర్యం నింపేందుకు నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్కుమార్రెడ్డి, మదనపల్లె నియోజకవర్గ తెదేపా బాధ్యుడు దొమ్మలపాటి రమేష్ పేర్కొన్నారు.
యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ వెంట తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్కుమార్రెడ్డి
కలికిరి, న్యూస్టుడే: యువతలో ఆత్మస్థైర్యం నింపేందుకు నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్కుమార్రెడ్డి, మదనపల్లె నియోజకవర్గ తెదేపా బాధ్యుడు దొమ్మలపాటి రమేష్ పేర్కొన్నారు. శనివారం పూతలపట్టు నియోజకవర్గంలో జరిగిన యువగళం పాదయాత్రలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ను వేర్వేరుగా కలసి మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు, ప్రజల అండదండలు ఉన్నంత వరకు నారా లోకేశ్ పాదయాత్రను ఎవరూ అడ్డుకోలేరని, ఒక వేళ అడ్డుకోవాలని ప్రయత్నిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హితవు పలికారు. కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్
రాయచోటి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో ఆయన ప్రచార రథాన్ని పోలీసులు అడ్డుకోవడం పిరికిపంద చర్య అని మాజీ ఎమ్మెల్యే, తెదేపా రాయచోటి నియోజకవర్గ ఇన్ఛార్జి ఆర్.రమేష్కుమార్రెడ్డి వివర్శించారు. పూతలపట్టు మండలం అరకొండ దగ్గర నుంచి శనివారం లోకేశ్ను కలిసి పాదయాత్రలో ఆయనతోపాటు నడిచినట్లు తెలిపారు. స్థానిక తెదేపా కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. లోకేశ్ పాదయాత్రతో వైకాపా నేతల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయని, పాదయాత్రకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెదేపా విజయం తథ్యమన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
[ 25-04-2024]
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
[ 25-04-2024]
సీఎం జగన్ వైకాపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు గురువారం పులివెందుల రానున్నారు. -
మీ బిడ్డనని గారాలు... నీ గడ్డపైనే ఘోరాలు!
[ 25-04-2024]
రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా నరేగా నుంచి రూ.26.02 కోట్లతో 349 మట్టి పనులను వైకాపా నేతలకు పంచిపెట్టారు. -
ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం
[ 25-04-2024]
మాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎన్డీఏ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు -
నేడు రాజంపేట, రైల్వేకోడూరులో ప్రజాగళం
[ 25-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరు పర్యటనకు రానున్నారు -
అక్రమాలకు పాల్పడకుండా గెలిచే సత్తా మీకుందా?
[ 25-04-2024]
అక్రమాలకు పాల్పడకుండా పులివెందులలో గెలిచే సత్తా మీకుందా? అని తెదేపా పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి సీఎం జగన్కు సవాల్ విసిరారు -
నీళ్లు గరళం... పారిశుద్ధ్యం అధ్వానం
[ 25-04-2024]
నియోజకవర్గ కేంద్రాలు ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు పట్టణ ప్రాంతాల్లోని కాలనీల ప్రజలు కనీస వసతులకు నోచుకోలేక తల్లడిల్లుతున్నారు -
జగన్ పాలనలో పర్యాటకాభివృద్ధి శూన్యం
[ 25-04-2024]
పర్యాటకుల నుంచి ఛార్జీలు, పన్నులు తదితరాల పేరుతో ఆదాయం వస్తున్నా ఆ రంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. -
జగనన్న హామీలు...నీటి మూటలు
[ 25-04-2024]
ఆరునూరైనా అభివృద్ధి చేసి తీరుతాం.. మైదుకూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామంటూ జగన్ ప్రభుత్వంలో పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా