ప్రాధాన్యం ప్రగతి తడబాటు!
గ్రామీణులకు మెరుగైన సేవలందించాలని, పాలనలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని పాలకులు సంకల్పించారు. కార్యాలయాల నిర్వహణకు శాశ్వత భవనాలను నిర్మించాలని ప్రభుత్వం ముందుకొచ్చింది.
భవన నిర్మాణాల్లో మందగమనం
ఒంటిమిట్ట : కొండమాచుపల్లిలో అసంపూర్తిగా డిజిటల్ గ్రంథాలయ భవనం
న్యూస్టుడే, కడప: గ్రామీణులకు మెరుగైన సేవలందించాలని, పాలనలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని పాలకులు సంకల్పించారు. కార్యాలయాల నిర్వహణకు శాశ్వత భవనాలను నిర్మించాలని ప్రభుత్వం ముందుకొచ్చింది. ఉపాధిహామీ పథకం నిధులతో చేపట్టాలని అనుమతిచ్చారు. క్షేత్రస్థాయిలో పనుల ప్రగతి తడబడింది. బిల్లులు రాకపోవడంతో నిర్మాణాలు మందగమనంగా సాగుతున్నాయి. అయిదు రకాల ప్రాధాన్య భవనాల్లో మూడింటిపైనే అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మరో రెండింటిపై చిన్నచూపు చూడటంతో నిదానంగా చేపడుతున్నారు.
జిల్లాలో 557 పంచాయతీలుండగా గ్రామ సచివాలయాలు 427 చోట్ల ఏర్పాటు చేశారు. పరిపాలనలో ప్రక్షాళన చేసి ప్రజలకు ఉత్తమ సేవలందించాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, రాయితీ పథకాలను లబ్ధిదారులకు పారదర్శకంగా అందించాలని నిర్ణయించారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లీనిక్ భవనాలు 1,181 మంజూరు చేశారు. వీటి అంచనా విలువ రూ.319.9 కోట్లు. ఈ మూడు రకాలను ప్రాధాన్య విభాగం కేటగిరి-1లో చేర్చారు. ఇప్పటికీ 669 చోట్ల పూర్తి చేశారు. పునాది వరకు 66, గోడలు 148, పైకప్పు వరకు వచ్చినవి 293 ఉండగా, కొన్ని పల్లెల్లో మొదలుకాలేదని అధికారులు చెబుతున్నారు. కేటగిరి-2లో పాలశీతలీకరణ (బీఎంసీయూ) కేంద్రాలు, డిజిటల్ గ్రంథాలయాలను చేర్చారు. ఈ రెండు విభాగాల్లో 322 భవనాలను నిర్మించాలని అనుమతిచ్చారు. నరేగా నిధులను మంజూరు చేస్తామని ప్రకటించారు. ఇప్పటికీ కేవలం 12 మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 234 చోట్ల అసలు భూమి పూజ కూడా చేయలేదు. గుంతల వరకు వచ్చినవి 17, పునాదులు 23, గోడలు 22, పైకప్పు వేసినవి 14 ఉన్నట్లు నిర్మాణ పనులను పర్యవేక్షణ చేస్తున్న పంచాయతీరాజ్శాఖ సాంకేతిక నిపుణులు తెలిపారు. వాస్తవంగా చూస్తే గతేడాది నుంచి ఆశించిన స్థాయిలో వేగంగా సాగడం లేదు. భవన నిర్మాణ సామగ్రి ధరలు ఆమాంతం పెరిగాయి. అంచనా వ్యయాన్ని పెంచాలని అధికారులపై గుత్తేదారులు తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచుతున్నారు. జిల్లా నుంచి ప్రతిపాదనలు పంపినా రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదు.
వేగంగా చేయిస్తాం: జిల్లాలో కేటగిరి-1లోని గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్క్లీనిక్ భవనాల పనులను వేగంగా చేయిస్తాం. కేటగిరి-2లో బీఎంసీయూలు, డిజిటల్ గ్రంథాలయాలను చేర్చాం. క్షేత్ర స్థాయిలో కొన్నిచోట్ల పనులు ఆగిపోయాయి. మరికొన్నిచోట్ల నిదానంగా సాగుతున్నాయని మా దృష్టికి వచ్చింది. ఇందుకు గల కారణమేంటని క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని సేకరించాం. ఈ ఏడాది జూన్లోపు అన్నింటినీ పూర్తి చేసేలా ప్రణాళికను రూపొందించాం. ప్రభుత్వం నుంచి బిల్లులు రావాల్సి ఉంది.
శ్రీనివాసులురెడ్డి, ఎస్ఈ, పంచాయతీరాజ్శాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
[ 20-04-2024]
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
జనంపై జగనాసురుడి దండయాత్ర!
[ 20-04-2024]
జగన్ అయిదేళ్ల పాలనలో ఊరికో అసురుడు తయారయ్యాడు... కనిపించిన భూములన్నింటికీ కబ్జా చేశారు... సహజ వనరులను ఇష్టారీతిన కొల్లగొట్టారు... తమ ఆగడాలపై ప్రశ్నించినవారిపై దాడులకు తెగబడ్డారు... హత్యలకు సైతం వెనకాడలేదు. -
హామీలకు మంగళం... ఖాకీలకు ద్రోహం!
[ 20-04-2024]
జిల్లా వ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు సబ్ డివిజన్లు ఉన్నాయి. -
నేడు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నామినేషన్
[ 20-04-2024]
పీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల శనివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈమె ఉదయం 8 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి కడప నగరం ఐటీఐ సర్కిల్కు 9.15 గంటలకు చేరుకుని ర్యాలీ ప్రారంభిస్తారు. -
తెదేపా రాజంపేట నియోజకవర్గ పరిశీలకుడిగా దుర్గాప్రసాద్
[ 20-04-2024]
రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంపై తెదేపా అధిష్ఠానం ప్రత్యేక దృష్టిసారించింది. కడపకు చెందిన కీలక నేత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుధా దుర్గాప్రసాద్ను పరిశీలకుడిగా నియమించింది. -
ఏం చేశావ్ మేలు... కౌలు రైతు కుదేలు..!
[ 20-04-2024]
జిల్లాలో 4,88,672 మంది రైతులుండగా, పంటలు సాగు చేసే నికర భూమి 2,70,985 హెక్టార్లు ఉంది. సొంత పొలం లేని 50 వేల మందికి పైగా కౌలురైతులు సొంతూర్లు, ఇతర ప్రాంతాల్లో మిగతా సాగు దారులకు చెందిన భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. -
సింహ వాహనంపై సీతాపతి
[ 20-04-2024]
ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు శుక్రవారం రాత్రి సింహ వాహనంపై సీతాపతి ఊరేగారు. -
అశ్వవాహనంపై శ్రీరాముడు
[ 20-04-2024]
వాల్మీకిపురంలో తితిదే ఆధ్వర్యంలోని పట్టాభిరాముడి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అశ్వవాహనంపై శ్రీరాముడు అధిరోహించి తిరుమాడవీధుల్లో ఊరేగారు. -
మామయ్యనంటూ ఊదరగొట్టేశావ్.. చిన్నారుల భద్రతను గాలికొదిలేశావ్..!
[ 20-04-2024]
జగన్ మామయ్య మాయమాటలకు చిన్నారులూ మోసపోయారు. పిల్లలకు మేనమామనని ఊదరగొట్టి వారి భద్రతను పూర్తిగా గాలికొదిలేశారు. -
అరాచక పాలన పోవాలంటే తెదేపా రావాలి
[ 20-04-2024]
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన పోవాలంటే తెదేపా అధికారంలోకి రావాలని ప్రొద్దుటూరు శాసనసభ తెదేపా అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు. -
చిన్నారులతో రాజకీయ ప్రచారం?
[ 20-04-2024]
అధికార పార్టీ ఉల్లంఘనలకు కాదేదీ అనర్హం అన్నట్లు ప్రచారంలోనూ నాయకులు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. చిన్నారుల చేతికి జెండాలిచ్చి ప్రచారం చేయించుకుంటున్నారు. -
వేడుకగా ఊంజల్ సేవ
[ 20-04-2024]
రామయ్య క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం కల్యాణ మండపంలో ఊంజల్ సేవ నిర్వహించారు. -
పాలకుల నిర్లక్ష్యం... ప్రజలకు శాపం
[ 20-04-2024]
పురపాలక హోదా కల్గి పద్దెనిమిదేళ్లు కావస్తున్నా ఇంకా బద్వేలులో పలువార్డులు కనీస సౌకర్యాలకు నోచుకోలేదు. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
తెదేపాలో చేరిన పగిడాల దస్తగిరి
[ 20-04-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు. -
ప్రభుత్వ స్థలం... రాచమల్లు పరం
[ 20-04-2024]
వైకాపా ప్రభుత్వంలో ప్రభుత్వ భూములు, స్థానిక సంస్థల భూములను అధికార పార్టీ నేతలు తమ ఆధీనంలో పెట్టేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, వారి అనుయాయులు, పార్టీ నేతలు, ఓ మోస్తరు నాయకులు, కార్యకర్తలు సైతం మున్సిపల్ స్థలాలపై కన్నేసి వాటిని తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారు. -
నిందితుల అరెస్టు
[ 20-04-2024]
బాలఓబిగారి వీధిలో ఈ నెల 17న రాత్రి ఓ మహిళ విషయంలో యువకుల మధ్య జరిగిన ఘర్షణ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఒకటో పట్టణ ఠాణా సీఐ శ్రీకాంత్ తెలిపారు.