బాల వనం... నారు ఘనం!
వైయస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో టమోట నారుకు భారీగా గిరాకీ పెరిగింది. రెండు జిల్లాల్లో రబీలో టమోట సాధారణ సాగు విస్తీర్ణం 6,930 హెక్టార్లు కాగా, అనధికారికంగా మరో 5 వేల హెక్టార్ల పైమాటే.
700కు పైగానే నర్సరీల్లో పెంపకం
మదనపల్లె వద్ద నర్సరీలో పెంచుతున్న టమోట నారు
న్యూస్టుడే, రామసముద్రం, మదనపల్లె పట్టణం: వైయస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో టమోట నారుకు భారీగా గిరాకీ పెరిగింది. రెండు జిల్లాల్లో రబీలో టమోట సాధారణ సాగు విస్తీర్ణం 6,930 హెక్టార్లు కాగా, అనధికారికంగా మరో 5 వేల హెక్టార్ల పైమాటే. నారు పెంపకానికి ఇరు జిల్లాల్లో 700కు పైగానే నర్సరీ (బాల వనం)లు సిద్ధమయ్యాయి. రబీలో నర్సరీల ద్వారా రూ.10 కోట్లకుపైగా లావాదేవీలు జరగనున్నాయి. ప్రధానంగా అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రాంతం టమోట సాగుకు పెట్టింది పేరు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద టమోట మార్కెట్ ఇక్కడే ఉంది. ఇక్కడ నుంచే దేశ, విదేశాలకు టమోట ఎగుమతి అవుతుంటుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి, వైయస్ఆర్ జిల్లాపులి వెందుల, కమలాపురం, జమ్మలమడుగు, మైదుకూరు ప్రాంతాల్లో జనవరి నుంచే టమోట సాగు ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి, మార్చిలలో మొక్కల నాటడం నూరు శాతం పూర్తవుతుంది.
* హెక్టారు విస్తీర్ణంలో 20 వేల మొక్కలు అవసరమవుతాయి. వీటిలో సాహో, త్రీ, ఫోర్, ప్రభాకర్ తదితర కంపెనీ విత్తన నార్లకు డిమాండును బట్టి రూపాయి నుంచి రూ.1.50 వరకు నర్సరీల్లో అమ్మకాలు జరుగుతాయి. సాగు మొత్తం నార్ల నాణ్యత, కల్తీ లేని విత్తనాలపైనే ఆధారపడి ఉంటుంది. గత కొంతకాలంగా నారు నాణ్యత లేక మొక్కలు చనిపోవడం, కల్తీ విత్తనాలతో రైతులు మోసపోయి నష్టాలకు గురయ్యారు. రైతుల పరిస్థితిని గమనించిన ప్రభుత్వం నర్సరీలను ఉద్యానశాఖ పరిధిలోనికి తీసుకొచ్చి నర్సరీల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి చేసింది. టమోట నర్సరీలన్నింటిపై ఉద్యానశాఖాధికారుల పర్యవేక్షణ ఉండడమే కాకుండా నారు కొనుగోలు చేసిన రైతులు తప్పనిసరిగా రసీదు పొందాలనే నిబంధన అమల్లోకి వచ్చింది. నారులో కల్తీలున్నట్లు ఉద్యానశాఖ అధికారుల ధ్రువీకరణతో చర్యలు, కంపెనీ నుంచి పరిహారం పొందే వెసులుబాటు ఉంటుంది. దీంతో టమోట రైతులంతా నారు కోసం నర్సరీలపైనే ఆసక్తి చూపుతూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు.
రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి
టమోట నర్సరీలపై నిత్యం పర్యవేక్షణ ఉంటుంది. ఆయా గ్రామ సచివాలయాల్లోని గ్రామ ఉద్యానశాఖ సహాయకులు పర్యవేక్షిస్తారు. నియోజకవర్గంలోని ఉద్యానశాఖ అధికారి 15 రోజులకొకసారి పర్యవేక్షిస్తూ నారు తాజా పరిస్థితిని యజమానికి తెలియజేస్తారు. రైతులు కొనుగోలు చేసే సమయంలో కంపెనీ పేరు, విత్తన రకం, మొక్కల సంఖ్య, నగదు మొత్తాన్ని నమోదు చేసిన రసీదును తప్పనిసరిగా పొందాలి.
ఈశ్వర్ప్రసాద్, ఉద్యానశాఖ అధికారి, మదనపల్లె
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనాసురుడికి పగ్గాలు.. కన్నీళ్లలో చేనేత మగ్గాలు!
[ 24-04-2024]
‘నేను ఉన్నాను... నేను విన్నాను’ అంటూ సీఎం జగన్ చేనేత కార్మికులను నమ్మించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నట్టేట ముంచారు. గత ప్రభుత్వాల హయాంలో అమలు చేసిన పథకాలకు మంగళం పాడేశారు. -
ఉన్నవి రద్దు చేసి... పక్క జిల్లాలకు సర్దేసి..!
[ 24-04-2024]
‘జాబ్ క్యాలెండరు విడుదల చేసి ఏటా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తాం, డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తాం’ అంటూ హామీలిచ్చి గద్దెనెక్కిన సీఎం జగన్ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. -
రేపు రాజంపేట, రైల్వేకోడూరుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాక
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరుకు రానున్నారు. -
రథంపై దాశరథి... మురిసిన భక్తజన హృది!
[ 24-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం రథోత్సవం కనులపండువగా జరిగింది. -
పెద్దిరెడ్డి కాళ్ల కింద పీలేరు ఆత్మగౌరవం!
[ 24-04-2024]
పీలేరు ఆత్మగౌరవాన్ని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్ల కింద పెట్టారని, ఆయన చేతిలో కీలుబొమ్మగా మారారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, తెదేపా పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిశోర్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. -
గోప్యంగా సునీత ప్రచారం!
[ 24-04-2024]
మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఎన్నికల ప్రచారాన్ని గోప్యంగా నిర్వహిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నేతలను కలుస్తూ మద్దతు కూడగడుతున్న ఆమె.. -
వంతెనకేదీ మోక్షం... జగన్ పాలనే సాక్ష్యం!
[ 24-04-2024]
కడప - తాడిపత్రి జాతీయ రహదారిలో పాపఘ్ని నదిపై వంతెన నిర్మాణం పూర్తికాకపోవడంతో రాకపోకలకు ఇక్కట్లు తప్పడం లేదు. 2021, నవంబరు 20న వరద ప్రవాహనికి ఇక్కడ పాత వంతెన కూలి పోయింది. -
కడపలో చెడ్డీగ్యాంగ్ కలకలం
[ 24-04-2024]
జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ సంచారంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయిదు రోజుల కిందట కడప నగరంలోని ఓ శివారు ప్రాంతంలోని బహుళ అంతస్తు భవనంలోకి ఈ గ్యాంగ్ ప్రవేశించినట్లు సీసీ పుటేజీల ద్వారా తెలిసింది. -
అభ్యర్థుల ఆస్తిపాస్తులివే
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల పర్వం నడుస్తోంది. మంగళవారం పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అఫిడవిట్లు దాఖలు చేస్తూ అందులో ఆస్తులు, కేసుల వివరాలు పేర్కొన్నారు. -
వైకాపా నేత... మార్కెట్ మేత
[ 24-04-2024]
అవినీతి లేని పాలన అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా పసిడిపురి ప్రొద్దుటూరులో తాత్కాలిక కూరగాయల మార్కెట్ ఏర్పాటు వ్యవహారమంతా ప్రజాప్రతినిధి వర్గీయులకు ఆదాయ వనరుగా మారిందనేది బహిరంగ రహస్యం. -
అయిదేళ్లు జగన్కు అధికారం... ఆవిరైంది జనానికి ఆహ్లాదం..!
[ 24-04-2024]
వైకాపా పాలనలో ఉద్యానవనాలు అంతులేని నిర్లక్ష్యానికి గురయ్యాయి. నిర్వహణను గాలికొదిలేయడంతో పార్కుల పరిస్థితి దయనీయంగా మారింది. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు వచ్చే జనం కూర్చోడానికి కనీసం బల్లల్లేని దుస్థితి నెలకొంది. -
సమస్యలు అనేకం... ప్రభుత్వానిదే పాపం
[ 24-04-2024]
-
పడకేసిన ప్రగతి... జగన్ పాలనలో అథోగతి
[ 24-04-2024]
పురపాలక ఆరో వార్డులోని కొత్తకొట్టాలు, వాసవీనగర్లో సమస్యలు వేధిస్తున్నాయి. ప్రధానంగా కొత్తకొట్టాలు, చిన్నమసీదు వీధుల మధ్య ప్రవహించే ఎర్రచెరువు అలుగువంక స్థానికులకు మురుగుకాలువగా ఉపయోగపడుతోంది. -
ఏఎస్పీ కేశప్పపై ఎంసీసీ అధికారుల విచారణ
[ 24-04-2024]
ఏఎస్పీ కేశప్పపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు అధికారులు, ఎంపీడీవో భానుప్రసాద్ మంగళవారం విచారణ చేపట్టారు. మదనపల్లె మండలం బొమ్మనచెరువులో ఆదివారం -
ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
[ 24-04-2024]
సీఎం జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డిపై వీరపునాయునిపల్లెకు చెందిన నాగప్రసాద్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్