నేరవార్తలు
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని టెంకాయతోపు వద్ద జాతీయ రహదారిపై ఆగిఉన్న టిప్పర్ని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
పెళ్లకూరు, న్యూస్టుడే : తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని టెంకాయతోపు వద్ద జాతీయ రహదారిపై ఆగిఉన్న టిప్పర్ని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసుల వివరాల మేరకు.. నాయుడుపేట నుంచి తిరుపతి వైపు వెళ్తున్న టిప్పర్ టెంకాయతోపు దగ్గర ఒక్కసారిగా ఆగడంతో వెనుక వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొంది. స్థానికులు గుర్తించి బయటకు తీయగా అప్పటికే ఇద్దరు మృతిచెందినట్లు గుర్తించారు. మరకొరికి వ్యక్తి తీవ్రగాయాలు కాగా శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించారు. ప్రమాదంలో మృతి చెందిన వారిలో వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన హర్షవర్దన్రెడ్డి (28), పుత్తూరుకు చెందిన ధరయ్య(25)గా గుర్తించారు. గాయపడిన యువకుడు అన్నమయ్య జిల్లా పీˆలేరుకు చెందిన అజయ్గా గుర్తించారు. వీరంతా రేణుగుంటలోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగులు కాగా ఆదివారం పార్టీ కోసం వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
వీరపునాయునిపల్లె : ద్విచక్ర వాహనాలు ఢీకొట్టుకున్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన అనిమెల గ్రామ సమీపంలో ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అనిమెలకు చెందిన జెర్రి ఆశ్రిత్, మాకం గంగన్న ద్విచక్ర వాహనంపై వీఎన్పల్లెకు వెళ్తుండగా... అదే గ్రామానికి చెందిన మాకం మంజునాథ మరో ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని 108లో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఆశ్రిత్ (50) మార్గ మధ్యలో మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కడప నేరవార్తలు: కడప చిన్నచౌకు ఠాణా పరిధిలోని అంబేడ్కర్ కూడలి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కడప సింహపురి కాలనీలో ముత్తుకూరు రమాదేవి (55) తన కుమార్తెతో కలిసి జీవనం సాగిస్తున్నారు. ఆదివారం తన కుమార్తెను ఆర్టీసీ బస్టాండ్లో వదిలిపెట్టేందుకు రోడ్డు దాటుతుండగా వై.కూడలి నుంచి వస్తున్న ఆర్టీసీ అద్దె బస్సు ప్రమాదవశాత్తు ఆమెను ఢీకొంది. స్థానికులు ఆమెను ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుగుబాటు మొదలైంది.. జగన్ ఇంటికి పోవడం ఖాయం: చంద్రబాబు
[ 25-04-2024]
రాయలసీమలో తిరుగుబాటు మొదలైందని.. జగన్ ఇంటికి పోవడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
వైకాపాని పాతాళానికి తొక్కేద్దాం.. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం: పవన్
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దాం.. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
[ 25-04-2024]
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
[ 25-04-2024]
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
[ 25-04-2024]
సీఎం జగన్ వైకాపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు గురువారం పులివెందుల రానున్నారు. -
మీ బిడ్డనని గారాలు... నీ గడ్డపైనే ఘోరాలు!
[ 25-04-2024]
రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా నరేగా నుంచి రూ.26.02 కోట్లతో 349 మట్టి పనులను వైకాపా నేతలకు పంచిపెట్టారు. -
ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం
[ 25-04-2024]
మాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎన్డీఏ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు -
నేడు రాజంపేట, రైల్వేకోడూరులో ప్రజాగళం
[ 25-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరు పర్యటనకు రానున్నారు -
అక్రమాలకు పాల్పడకుండా గెలిచే సత్తా మీకుందా?
[ 25-04-2024]
అక్రమాలకు పాల్పడకుండా పులివెందులలో గెలిచే సత్తా మీకుందా? అని తెదేపా పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి సీఎం జగన్కు సవాల్ విసిరారు -
నీళ్లు గరళం... పారిశుద్ధ్యం అధ్వానం
[ 25-04-2024]
నియోజకవర్గ కేంద్రాలు ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు పట్టణ ప్రాంతాల్లోని కాలనీల ప్రజలు కనీస వసతులకు నోచుకోలేక తల్లడిల్లుతున్నారు -
జగన్ పాలనలో పర్యాటకాభివృద్ధి శూన్యం
[ 25-04-2024]
పర్యాటకుల నుంచి ఛార్జీలు, పన్నులు తదితరాల పేరుతో ఆదాయం వస్తున్నా ఆ రంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. -
జగనన్న హామీలు...నీటి మూటలు
[ 25-04-2024]
ఆరునూరైనా అభివృద్ధి చేసి తీరుతాం.. మైదుకూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామంటూ జగన్ ప్రభుత్వంలో పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ