జూన్ నుంచి యోవేవిలో దూరవిద్య కోర్సులు
యోగి వేమన విశ్వవిద్యాలయంలో దూర విద్య కోర్సులు ప్రారంభిస్తున్నట్లు ఉపకులపతి ఆచార్య జింక రంగ జనార్దన్ వెల్లడించారు.
ఉపకులపతి రంగ జనార్దన్
మాట్లాడుతున్న ఉపకులపతి రంగ జనార్దన్, పక్కన రిజిస్ట్రార్ వెంకటసుబ్బయ్య, డీడీఈ డైరెక్టర్ షావలిఖాన్
వైవీయూ (కడప), న్యూస్టుడే : యోగి వేమన విశ్వవిద్యాలయంలో దూర విద్య కోర్సులు ప్రారంభిస్తున్నట్లు ఉపకులపతి ఆచార్య జింక రంగ జనార్దన్ వెల్లడించారు. డీడీఈ డైరెక్టర్ పి.ఎస్.షావలిఖాన్ అధ్యక్షతన కులసచివులు వెంకటసుబ్బయ్య, ప్రధానాచార్యులు కృష్ణారెడ్డితో కలిసి దూరవిద్యపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపకులపతి మాట్లాడారు. మూడు విడతల్లో 22 కోర్సులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జూన్ నుంచి తొలివిడతగా ఏడు డిగ్రీ, ఏడు పీజీ, రెండు డిప్లొమా కోర్సులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సుల గురించి డీన్లతో సమీక్షించారు. కొత్త కోర్సులకు సంబంధించి సిలబస్, విధివిధానాలపై బోర్డ్ ఆఫ్ ఛైర్మన్లతో చర్చించారు. అధ్యయన కేంద్రాలను గుర్తించాలని, నాణ్యమైన అభ్యసన సామగ్రిని రూపొందించాలని సూచించారు. డీడీఈ సంచాలకులు షావలిఖాన్ మాట్లాడుతూ.. జూన్ లోపు కోర్సులకు సంబంధించి యూజీసీ నుంచి అనుమతి పొందుతామన్నారు. కులసచివులు వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ వివిధ కారణాలతో సహిత విద్యను అందుకోలేని వారికి ఇది అద్భుత అవకాశమన్నారు. కార్యక్రమంలో డీడీఈ డిప్యూటీ డైరెక్టర్ శ్రీధర్బాబు, డీన్లు, బీవోఎస్ ఛైర్మన్లు, అన్ని శాఖల అధిపతులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదేశాలకు పాతర.. ఇసుకాసురుల జాతర!
[ 29-03-2024]
పర్యావరణ అనుమతుల్లేకుండా ఇసుక తవ్వకాలు జరపొద్దని హైకోర్టు స్పష్టం చేసినా అధికార పార్టీ నేతలు ఖాతరు చేయడం లేదు. -
కీలక నేతలతో చంద్రబాబు భేటీ!
[ 29-03-2024]
మదనపల్లెలో బుధవారం రాత్రి, గురువారం ఉదయం తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ కీలక నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు -
రాయచోటిపై తెదేపా ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
రాయచోటి నియోజకవర్గంపై తెదేపా ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలను పిలిపించుకుని గెలుపు వ్యూహాలపై చర్చించారు. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథరెడ్డితో చంద్రబాబు పలుమార్లు మాట్లాడారు -
రెండో రోజూ ప్రయాణికులకు తిప్పలే
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సభలకు జిల్లా నుంచి బస్సులు కేటాయించడంతో వరుసగా రెండోరోజూ గురువారం ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు. -
ఒంటిమిట్టలో ఆదర్శ పోలింగ్ కేంద్రం
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒంటిమిట్ట ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఆదర్శ పోలింగ్ (పీఎస్-47) కేంద్రం ఏర్పాటు చేశారు. ఉద్యోగుల విధుల నిర్వహణ, ఓటర్లతో మాట్లాడాల్సిన తీరు, ఈవీఎంల పనితీరుపై వీఆర్వోలు, వీఆర్ఏలు, బీఎల్వోలు, సిబ్బందికి అవగాహన కల్పించారు -
దాహమో.... రఘురామ!
[ 29-03-2024]
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది సీఎం జగన్ సొంత ఇలాకాలోని మైదుకూరు పురపాలక సంఘం ప్రజల పరిస్థితి -
మైనార్టీ విద్యకు గ్రహణం!
[ 29-03-2024]
కేంద్ర ప్రాయోజిత నిధులతో నిర్మించతలపెట్టిన ముస్లిం, దూదేకులు, దళిత క్రిస్టియన్ల పిల్లలకు 6 నుంచి 10వ తరగతి వరకు గురుకుల పాఠశాలలు, వసతిగృహ సముదాయాలు ప్రతిపాదనలకే పరిమిత మయ్యాయి -
‘దోషులను వెంట పెట్టుకుంది జగనే’
[ 29-03-2024]
శామాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిని వెంటపెట్టుని తిరుగుతున్నది సీఎం జగనే అని మాజీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు సనసభ తెదేపా అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి ఆరోపించారు -
వివేకా హత్య కేసులో నిందితుడు అవినాష్ ఎంపీ టికెట్టా?
[ 29-03-2024]
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడు వై.ఎస్.అవినాష్రెడ్డిని పక్కన పెట్టుకుని, తన చిన్నాన్నను ఎవరో చంపేశారని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని భాజపా జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్రెడ్డి అన్నారు. -
తాగునీటి గండం..విద్యార్థులకు శాపం
[ 29-03-2024]
దేశ సరిహద్దులో భద్రత ఏర్పాట్లు చూసే సైనికులు... పశువైద్య విజ్ఞానాన్ని అవపోశన పడుతున్న విద్యార్థులను తాగునీటి సమస్య విపరీతంగా వేధిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం