logo

రహదారి ప్రమాదంలో ఇంజినీరింగ్‌ విద్యార్థి దుర్మరణం

రాజంపేట మండలం బోయనపల్లి వై కూడలిలో సోమవారం సాయంత్రం జరిగిన రహదారి ప్రమాదంలో ఇంజినీరింగ్‌ విద్యార్థి షేక్‌ ఫకృద్దీన్‌ (18) దుర్మరణం చెందాడు.

Published : 07 Feb 2023 05:38 IST

రాజంపేట గ్రామీణ న్యూస్‌టుడే: రాజంపేట మండలం బోయనపల్లి వై కూడలిలో సోమవారం సాయంత్రం జరిగిన రహదారి ప్రమాదంలో ఇంజినీరింగ్‌ విద్యార్థి షేక్‌ ఫకృద్దీన్‌ (18) దుర్మరణం చెందాడు. రాజంపేటలోని అన్నమాచార్య ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈసీఈ మొదటి సంవత్సరం చదువుతున్న వైయస్‌ఆర్‌ జిల్లా సింహాద్రిపురం గ్రామానికి చెందిన షేక్‌ ఫకృద్దీన్‌, అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బ్రాహ్మణపల్లికి చెందిన దేవరాజు ద్విచక్రవాహనంపై రాజంపేటకు వస్తున్న సమయంలో బోయనపల్లి వై కూడలి వద్ద తిరుపతి వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొని సుమారు 400 మీటర్లు ఈడ్చుకుపోవడంతో ఫకృద్దీన్‌ అక్కడికక్కడే మృతిచెందగా, దేవరాజు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, కళాశాల యాజమాన్యం సంఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. ఫకృద్ధీన్‌ తల్లి ఇమాంబి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని