‘కేసుల మాఫీకే సీఎం దిల్లీ పర్యటన’
‘శాసనమండలి ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు వైకాపాను ఛీకొట్టారు. రాయలసీమ పట్టభద్రులు వద్దంటూ ఓటుతో బుద్ధి చెప్పారు.
మాట్లాడుతున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, పక్కన నాయకులు
అరవిందనగర్ (కడప), న్యూస్టుడే : ‘శాసనమండలి ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు వైకాపాను ఛీకొట్టారు. రాయలసీమ పట్టభద్రులు వద్దంటూ ఓటుతో బుద్ధి చెప్పారు. ఇంత జరిగినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 175 సీట్లు గెలుస్తామంటూ ఉపన్యాసాలిస్తున్నారు. ఎన్నికలు, శాసనసభ సమావేశాలు జరుగుతుంటే కేసుల మాఫీ కోసం హుటాహుటిన దిల్లీ వెళ్లారు’ అని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని తెదేపా జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి సొంత గడపలో రూ.40 కోట్లు ఖర్చు పెట్టినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవలేకపోయారన్నారు. నాలుగేళ్ల పాలనలో వైకాపా అరాచకాలను చూసిన యువత తమ శక్తిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపించారన్నారు. ప్రస్తుతం 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్పారన్నారు. నియంత పాలన ఎక్కువ కాలం ఉండదని, మీ బిడ్డనంటూ సీఎం జగన్ ప్రజలను మోసం చేశారన్నారు. ప్రతిపక్షాల నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు అందరూ అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిర్ణయిస్తే, సీఎం జగన్ మూడు రాజధానుల పేరుతో విశాఖను రాజధాని చేస్తామన్నారని, ఉత్తరాంధ్ర ప్రజలు ఓటుతో మాకు రాజధాని వద్దు, పులివెందుల ఫ్యాక్షనిజం వద్దని చెప్పారన్నారు. వచ్చే ఎన్నికల్లో 155 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అన్నపూర్ణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనవెంట తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్రెడ్డి, జడ్పీ మాజీ వైస్ ఛైర్మన్ లక్ష్మీరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వికాస్ హరికృష్ణ, నగర అధ్యక్షుడు శివకొండారెడ్డి, నాయకులు మన్మోహన్రెడ్డి, మునిరెడ్డి, గుర్రప్ప, జనార్దన్, శ్రీనివాసులు, ఖాసీం తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చూసిన కనులదే భాగ్యం!
[ 23-04-2024]
జగదభిరాముడి కల్యాణానికి జగమే ఊయలూగింది. సర్వమంగళ స్వరూపుడు శ్రీరాముడు, సకల జన శుభధాత్రి సీతాదేవి మూడు ముళ్లబంధంతో ఒక్కటైన వేళ భక్తజనం ఆనందంతో పులకించిపోయారు. -
జగన్ను నమ్మినందుకు నట్టేట ముంచారు!
[ 23-04-2024]
సీఎం జగన్ సొంత జిల్లాలో వైకాపా నుంచి పలువురు కీలక నేతలు వరుసగా జారుకుంటున్నారు. ఏళ్ల తరబడి పార్టీలో సేవలందించి.. సొంత ఆస్తుల్ని అమ్ముకున్న వారు... ఇప్పుడు ఆ పార్టీపై, అగ్రనేతలపై విశ్వాసం కోల్పోయి బయటకొచ్చేస్తున్నారు. -
జగన్ పాలన ఫలితమిది!
[ 23-04-2024]
పదోతరగతి ఫలితాల్లో 86.67 ఉత్తీర్ణత శాతంతో జిల్లా రాష్ట్రంలో 17వ స్థానంలో నిలిచింది. బాలురు 83.65, బాలికలు 89.71 ఉత్తీర్ణత శాతం నమోదుతో బాలికలు పైచేయి సాధించారు. -
బద్వేలులో వైకాపాకు భంగపాటు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల తరుణంలో బద్వేలు నియోజకవర్గ వైకాపాలో విభేదాలు రోడ్డెక్కాయి. -
వాలంటీర్ల కోసం వెతుకులాట!
[ 23-04-2024]
తాము రాజీనామా చేసేందుకు ససేమిరా అంటూ గ్రామ/ వార్డు వాలంటీర్లు వైకాపా నేతలకు కంట కనిపించకుండా తిరుగుతున్నారు. -
బాలికలదే పైచేయి!
[ 23-04-2024]
పదోతరగతి ఫలితాల్లో 92.10 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో జిల్లా మూడో స్థానంలో నిలిచింది. -
స్వామిభక్తిని చాటుకున్న పోలీసులు
[ 23-04-2024]
పోలీసులు పక్షపాత ధోరణిని వీడడంలేదు. వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్ల సందర్భంగా వివక్ష చూపిస్తున్నారు. -
కడపలో ఏకమవుతున్న తెదేపా నేతలు
[ 23-04-2024]
కడపలో తెదేపా నేతలందరూ ఏకతాటిపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
అయిదేళ్ల వైకాపా పాలనలో... సాగునీటి ప్రాజెక్టులకు ఒక్క పైసా విదల్చలేదు
[ 23-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో సాగునీటి ప్రాజెక్టులకు ఒక్క పైసా విదల్చలేదని భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి విమర్శించారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం... నిధులు నిరుపయోగం
[ 23-04-2024]
జిల్లాలో తొలి చెత్త సంపద మండల కేంద్రం రాజుపాళెంలో నిర్మించి గత ప్రభుత్వంలో జిల్లాకు ఆదర్శంగా ఇక్కడ కంపోస్టు ఎరువులు చేసిన ఘణత ఉంది. -
కూటమి అభ్యర్థుల గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి
[ 23-04-2024]
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉమ్మడి పార్టీల అభ్యర్థులను గెలిపించాలని ఎన్డీఏ అభ్యర్థులు, పార్టీల నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. -
‘పది’లో విద్యార్థుల ప్రతిభ
[ 23-04-2024]
జిల్లాలో సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. -
శాసనసభ స్థానాలకు నామపత్రాల దాఖలు
[ 23-04-2024]
ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఆయా ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ నామపత్రాలను సమర్పించారు. -
జగన్ పాలన... అభివృద్ధికి ఆమడ దూరాన
[ 23-04-2024]
బద్వేలు పురపాలకలోని శివారు వార్డులు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. -
ఆర్టీపీపీలో ఉద్యోగోన్నతికి అడ్డదారులు
[ 23-04-2024]
డాక్టర్ ఎంవీఆర్ తాప విద్యుదుత్పత్తి కేంద్రం (ఆర్టీపీపీ)లో కొందరు ఉద్యోగులు ఉద్యోగోన్నతికి అడ్డదారులు తొక్కుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM