ఆగిన బిల్లులు.. అసంపూర్తిగా భవనాలు
చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యనందించే బాలబడులు నేటికీ అందుబాటులోకి రావడం లేదు. అసౌకర్యాల అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.
అద్దె గదుల్లో చిన్నారులకు పాఠాలు
అసౌకర్యాల మధ్య అంగన్వాడీ కేంద్రాలు
బసినికొండలో గోడల వరకు నిర్మించి వదిలేసిన అంగన్వాడీ కేంద్ర భవనం
మదనపల్లె గ్రామీణ, న్యూస్టుడే: చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యనందించే బాలబడులు నేటికీ అందుబాటులోకి రావడం లేదు. అసౌకర్యాల అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పక్కా భవనాల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టినా అవి మొండిగోడలకే పరిమితయ్యాయి. గుత్తేదారులకు బకాయిల కారణంగా నిర్మాణాలు పూర్తి చేయాల్సిన భవనాలు అర్ధాంతరంగా నిలిపి వేశారు. అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాలు మొండిగోడలకే పరిమితం అయ్యాయి. స్త్రీ, శిశు సంక్షేమశాఖ పరిధిలో చాలా వరకు అద్దె భవనాల్లో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ సాగుతోంది.
* అన్నమయ్య జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు తొమ్మిది ఉండగా ప్రధాన కేంద్రాలు 1,858, మినీ విభాగంలో 417 పనిచేస్తున్నాయి. గర్భిణులు 12,537, బాలింతలు 12,069 మంది ఉన్నారు. వీటిలో 1,017 సొంత భవనాలు కాగా, ప్రభుత్వ, పంచాయతీ ఇతర అద్దెలేనివి 425 కేంద్రాలున్నాయి. 833 కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. అద్దెలకు సంబంధించి రూ.1,20,16,400 ఖర్చు చేస్తున్నారు. 577 భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలు పెట్టారు. పదేళ్ల క్రితం నాబార్డు, స్త్రీశిశు సంక్షేమ, ఉపాధి హామీ పథకం అనుసంధాన నిధులతో పలు ప్రాంతాల్లో భవనాలు మంజూరయ్యాయి. కాగా ప్రభుత్వాలు మారుతున్న కారణంగా నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాకపోవడంతో గుత్తేదారులు భవన నిర్మాణాలు నిలిపి వేసినట్లు తెలుస్తుంది. పలు ప్రాంతాల్లో మొండిగోడలకు పరిమితం కాగా, కొన్ని కేంద్రాలు సిమెంట్ మోల్డింగ్ వేసి వదిలేశారు.
* వైయస్ఆర్ జిల్లాలో సమగ్ర శిశు సేవా పథకాలు 12 ఉన్నాయి. ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు 2,212, మినీ విభాగంలో మరో 177 పనిచేస్తున్నాయి. గర్భిణులు 15,327 మంది ఉంటే 14,509 మందిని నమోదు చేశారు. వీరిలో 13,385 మంది లబ్ధి పొందుతున్నారని ఐసీడీఎస్ అధికారులు చెబుతున్నారు. బాలింతలు 15,372 మంది ఉండగా 14,312 మంది పేర్లను నమోదు చేసుకోగా వీరిలో 13,100 మందికి పౌష్టికాహారం తీసుకొంటున్నారని తెలిపారు. ఇక్కడా అదే పరిస్థితి నెలకొంది.
* మదనపల్లె ప్రాజెక్టు పరిధిలో మొత్తం 309 ప్రధాన, మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 121 సొంత భవనాలుండగా, 39 ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన భవనాల్లో నిర్వహిస్తున్నారు. 149 అద్దె భవనాల్లో పిల్లలకు చదువు చెబుతున్నారు. ఇక్కడ వివిధ స్కీమ్ల కింద అంగన్వాడీ కేంద్రాలు అయిదేళ్ల కిందట 13 భవనాలు మంజూరయ్యాయి. మదనపల్లెలో 4, నిమ్మనపల్లె రెండు, కురబలకోటలో ఒకటి, బి.కొత్తకోట మండలంలో ఆరు మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టారు. ఇవి వివిధ దశల్లో నిర్మాణాల్లోనే ఆగిపోయాయి.
* మదనపల్లె గ్రామీణ మండలం బసినికొండలో 2018లో ఉపాధి హామీ పథకం, స్త్రీశిశు సంక్షేమశాఖ అనుసంధాన నిధులు రూ.7 లక్షలతో భవనం మంజూరు చేశారు. దీన్ని ప్రారంభించిన గుత్తేదారులు గోడల నిర్మాణాలు పూర్తి చేయగా బిల్లులు మంజూరు కాకపోవడంతో నిర్మాణాన్ని నిలిపి వేశారు. ప్రస్తుతం ఈ భవన ప్రాంగణం పిచ్చిమొక్కలు, తీగ మొక్కలతో అధ్వానంగా మారింది. బకాయిలు మంజూరు కాకనే భవనం అసంపూర్తిగా ఉన్నట్లు పంచాయతీరాజ్ ఏఈ వెంకటరమణ పేర్కొన్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం
మదనపల్లె ప్రాజెక్టు పరిధిలో 13 భవనాలు వివిధ పథకాల కింద మంజూరు చేశారు. వీటిలో స్లాబ్, లెంటల్, పునాదుల నిర్మాణాలతో ఆగిపోయాయి. నిర్మాణ పనులు ఎందుకు ఆగిపోయాయో మాకు తెలియదు. దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.
సుజాత, సీడీపీవో, ఐసీడీఎస్, మదనపల్లె
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
[ 20-04-2024]
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
జనంపై జగనాసురుడి దండయాత్ర!
[ 20-04-2024]
జగన్ అయిదేళ్ల పాలనలో ఊరికో అసురుడు తయారయ్యాడు... కనిపించిన భూములన్నింటికీ కబ్జా చేశారు... సహజ వనరులను ఇష్టారీతిన కొల్లగొట్టారు... తమ ఆగడాలపై ప్రశ్నించినవారిపై దాడులకు తెగబడ్డారు... హత్యలకు సైతం వెనకాడలేదు. -
హామీలకు మంగళం... ఖాకీలకు ద్రోహం!
[ 20-04-2024]
జిల్లా వ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు సబ్ డివిజన్లు ఉన్నాయి. -
నేడు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నామినేషన్
[ 20-04-2024]
పీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల శనివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈమె ఉదయం 8 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి కడప నగరం ఐటీఐ సర్కిల్కు 9.15 గంటలకు చేరుకుని ర్యాలీ ప్రారంభిస్తారు. -
తెదేపా రాజంపేట నియోజకవర్గ పరిశీలకుడిగా దుర్గాప్రసాద్
[ 20-04-2024]
రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంపై తెదేపా అధిష్ఠానం ప్రత్యేక దృష్టిసారించింది. కడపకు చెందిన కీలక నేత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుధా దుర్గాప్రసాద్ను పరిశీలకుడిగా నియమించింది. -
ఏం చేశావ్ మేలు... కౌలు రైతు కుదేలు..!
[ 20-04-2024]
జిల్లాలో 4,88,672 మంది రైతులుండగా, పంటలు సాగు చేసే నికర భూమి 2,70,985 హెక్టార్లు ఉంది. సొంత పొలం లేని 50 వేల మందికి పైగా కౌలురైతులు సొంతూర్లు, ఇతర ప్రాంతాల్లో మిగతా సాగు దారులకు చెందిన భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. -
సింహ వాహనంపై సీతాపతి
[ 20-04-2024]
ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు శుక్రవారం రాత్రి సింహ వాహనంపై సీతాపతి ఊరేగారు. -
అశ్వవాహనంపై శ్రీరాముడు
[ 20-04-2024]
వాల్మీకిపురంలో తితిదే ఆధ్వర్యంలోని పట్టాభిరాముడి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అశ్వవాహనంపై శ్రీరాముడు అధిరోహించి తిరుమాడవీధుల్లో ఊరేగారు. -
మామయ్యనంటూ ఊదరగొట్టేశావ్.. చిన్నారుల భద్రతను గాలికొదిలేశావ్..!
[ 20-04-2024]
జగన్ మామయ్య మాయమాటలకు చిన్నారులూ మోసపోయారు. పిల్లలకు మేనమామనని ఊదరగొట్టి వారి భద్రతను పూర్తిగా గాలికొదిలేశారు. -
అరాచక పాలన పోవాలంటే తెదేపా రావాలి
[ 20-04-2024]
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన పోవాలంటే తెదేపా అధికారంలోకి రావాలని ప్రొద్దుటూరు శాసనసభ తెదేపా అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు. -
చిన్నారులతో రాజకీయ ప్రచారం?
[ 20-04-2024]
అధికార పార్టీ ఉల్లంఘనలకు కాదేదీ అనర్హం అన్నట్లు ప్రచారంలోనూ నాయకులు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. చిన్నారుల చేతికి జెండాలిచ్చి ప్రచారం చేయించుకుంటున్నారు. -
వేడుకగా ఊంజల్ సేవ
[ 20-04-2024]
రామయ్య క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం కల్యాణ మండపంలో ఊంజల్ సేవ నిర్వహించారు. -
పాలకుల నిర్లక్ష్యం... ప్రజలకు శాపం
[ 20-04-2024]
పురపాలక హోదా కల్గి పద్దెనిమిదేళ్లు కావస్తున్నా ఇంకా బద్వేలులో పలువార్డులు కనీస సౌకర్యాలకు నోచుకోలేదు. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
తెదేపాలో చేరిన పగిడాల దస్తగిరి
[ 20-04-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు. -
ప్రభుత్వ స్థలం... రాచమల్లు పరం
[ 20-04-2024]
వైకాపా ప్రభుత్వంలో ప్రభుత్వ భూములు, స్థానిక సంస్థల భూములను అధికార పార్టీ నేతలు తమ ఆధీనంలో పెట్టేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, వారి అనుయాయులు, పార్టీ నేతలు, ఓ మోస్తరు నాయకులు, కార్యకర్తలు సైతం మున్సిపల్ స్థలాలపై కన్నేసి వాటిని తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారు. -
నిందితుల అరెస్టు
[ 20-04-2024]
బాలఓబిగారి వీధిలో ఈ నెల 17న రాత్రి ఓ మహిళ విషయంలో యువకుల మధ్య జరిగిన ఘర్షణ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఒకటో పట్టణ ఠాణా సీఐ శ్రీకాంత్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
-
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
-
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత