వద్దన్నా అవే పనులు
ఒంటిమిట్ట కోదండరామాలయంలో ఈ నెల 30వ తేదీ నుంచి శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి తితిదే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రామాలయ పరిసరాల్లో మళ్లీ రేకులతో పందిళ్లు
ఒంటిమిట్టలో భద్రతపై భక్తుల ఆందోళన
ఒంటిమిట్టలో 2018 మార్చి 30న గాలివాన బీభత్సానికి రామాలయం, పరిసర ప్రాంతాల్లో కూలిన చలువ పందిళ్లు, షెడ్లు (పాత చిత్రం)
న్యూస్టుడే, కడప : ఒంటిమిట్ట కోదండరామాలయంలో ఈ నెల 30వ తేదీ నుంచి శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి తితిదే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రకృతి విపత్తులను తట్టుకునేలా ప్రమాదరహిత (జర్మనీ షెడ్లు) పందిళ్లు వేయాలని అనుమతిచ్చారు. ఇందుకు విరుద్ధంగా ఇక్కడ జన సమూహం, భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇనుప రేకులతో పందిళ్లు వేస్తున్నారు. అంతా సాఫీగా జరిగితే ఎలాంటి సమస్య రాదు. గతంలోలా గాలివాన వస్తే ప్రమాదం ముంచుకొచ్చినట్లే.
* 2018 మార్చి 30న సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించాలని సాయంత్రం 5 గంటల తర్వాత శోభా యాత్రను ప్రారంభించారు. ఆ సమయంలో ఈదురుగాలులు, జోరు వర్షం కురవడంతో రామాలయం పరిసర ప్రాంతాలు, కల్యాణ వేదిక ప్రాంగణంలో ఇనుప రేకులతో వేసిన పందిళ్లు నేలమట్టమై నలుగురు మృతి చెందగా, 55 మందికి పైగా గాయపడ్డారు. వర్ష బీభత్సంతో భక్తులు వణికిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రక్షిత ప్రాంతాల వైపు పరుగు తీశారు. విద్యుత్తు స్తంభాలు విరిగి.. తీగలు తెగిపోయి కరెంటు సరఫరా ఆగిపోయింది. 2019 ఏప్రిల్ 20న నిర్వహించిన ఉత్సవాల సమయంలోనూ గాలివానకు పెద్ద కటౌట్లు నేలవాలాయి. కరెంటు వ్యవస్థ చిన్నాభిన్నమైంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రేకులతో పందిళ్లు వేయరాదని ఉన్నత స్థాయిలో నిర్ణయించారు. అయినా ఈసారి మళ్లీ పాత పంథానే అనుసరిస్తున్నారు.
ఎక్కడెక్కడ వేశారంటే.. : అన్నప్రసాదం కేంద్రం ముంగిట కాలిబాటలో రేకులతో పందిరి వేస్తున్నారు. భక్త సంజీవరాయస్వామి ఆలయం బయట, లోపల ఇప్పటికే వేశారు. ఆలయం ఈశాన్య దిశలో ఉన్న మాడ వీధిలో రేకులు పరిచి ఆనక ఎందుకనో తీసేశారు. కల్యాణ వేదిక ప్రాంగణంలో వంటశాల కోసం మళ్లీ పద్ధతిలోనే తాత్కాలికంగా నిర్మించారు. వేసవిలో ఈ ప్రాంతంలో ఈదురుగాలులు వేగంగా వీస్తాయి. పైగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. గాలివాన జత కడితే విధ్వంసమే. ఇది తెలిసినా తితిదే అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఉన్నతాధికారులు మాత్రం ప్రమాదరహితమైన జర్మనీ షెడ్డు తరహాలో పందిళ్లు వేయించాలని పదేపదే చెబుతున్నారు. ఇక్కడ పనిచేసే యంత్రాంగం మాత్రం ఎందుకనో ఆలకించడం లేదు. అనుకోని విపత్తులొచ్చి నష్టం వాటిల్లితే ఎవరు బాధ్యత వహిస్తారని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
మార్పు చేయిస్తాం
ఆలయ పరిసర ప్రాంతాల్లో ఇనుప రేకులతో షెడ్లు, పందిళ్లు వేయరాదని ముందుగానే సివిల్ విభాగం అధికారులకు స్పష్టంగా చెప్పాం. కరెంటు దీపాల హోర్డింగులు, కటౌట్లు పటిష్టంగా ఏర్పాటు చేయాలని విద్యుత్తు యంత్రాగాన్ని ఆదేశించాం. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. అన్నప్రసాదం, ఇతర ప్రాంతాల్లో రేకులతో పందిళ్లు వేశారని మా దృష్టికి వచ్చింది. వెంటనే మార్పు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించాం. విపత్తులను తట్టుకునేలా జర్మనీ షెడ్లు ఏర్పాటు చేయిస్తాం.
వి.వీరబ్రహ్మం, జేఈవో, తితిదే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!