రహదారులే పార్కింగ్ స్థలాలు!
కడప పురపాలక స్థాయి నుంచి నగరపాలక సంస్థ స్థాయికి ఎదిగి సుమారు 20 ఏళ్లు కావస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం పన్నులు, జరిమానాలు వసూలు చేస్తున్న నగరపాలక యంత్రాంగం ఆ స్థాయికి తగిన వసతులను కల్పించడంలో విఫలమవుతోంది.
జరిమానాలతో హడలెత్తిస్తున్న పోలీసులు
అసహనానికి గురవుతున్న నగరవాసులు
మద్రాస్ రోడ్డులో నిబంధనలకు విరుద్దంగా ఆపిన కార్లు
న్యూస్టుడే, కడప నగరపాలక : కడప పురపాలక స్థాయి నుంచి నగరపాలక సంస్థ స్థాయికి ఎదిగి సుమారు 20 ఏళ్లు కావస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం పన్నులు, జరిమానాలు వసూలు చేస్తున్న నగరపాలక యంత్రాంగం ఆ స్థాయికి తగిన వసతులను కల్పించడంలో విఫలమవుతోంది. నిధుల అవసరం లేకుండా కల్పించదగిన వసతుల విషయంలోనూ శ్రద్ధ చూపకపోవడం నగరవాసులను ఆవేదనకు గురిచేస్తోంది. కడపలో నాలుగు చక్రాల వాహనాల పార్కింగ్ తీవ్ర సమస్యగా మారింది. నగరంలో వన్టౌన్ ఠాణా కూడలి అత్యంత కీలకమైన ప్రాంతం. చుట్టుపక్కల వస్త్ర, నగల దుకాణాలు, కిరాణ, కూరగాయల మార్కెట్లు ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రోజూ ప్రజలు పెద్దసంఖ్యలో వచ్చిపోతుంటారు. వారిలో చాలామంది నాలుగు చక్రాల వాహనాలను వినియోగిస్తున్నారు. వన్టౌన్ ఠాణా సమీపంలో అవసరమైన స్థాయిలో కార్ల పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో ద్విచక్ర వాహనాలకు కేటాయించిన స్థలాల్లో నిలుపుతున్నారు. అనుమతి లేని ప్రాంతంలో వాహనాలను పార్కింగ్ చేశారన్న కారణంపై పోలీసులు జరిమానా విధిస్తున్నారు. కార్ల యజమానులకు ఇది భారంగా మారుతోంది. రహదారులపైనే వాహనాలను నిలుపుతుండడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించేవారు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రధాన తపాలా కార్యాలయం ఎదురుగా ఉన్న స్థలాన్ని కార్ల పార్కింగ్ కోసం కేటాయించగా కొన్ని నెలల క్రితం జడ్పీ అధికారులు ఆ స్థలం చుట్టూ కంచె వేశారు. దిశ పోలీస్స్టేషన్ ఎదురుగా ఉన్న స్థలంలో కొంతభాగాన్ని తోపుడుబండ్ల వారు ఆక్రమించారు. మిగిలిన స్థలంలో 10 కార్లకు మించి పట్టవు. ఇక్కడ పార్కింగ్ చేసిన కార్లను పని ముగించుకున్న తర్వాత బయటకు తీయడానికి తగిన మార్గమే ఉండదు.
* క్రిస్టియన్లైన్లో రోగులు, వైద్యులు వాహనాల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. సమీపంలో పార్కింగ్ స్థలాలు లేవు. ఎన్టీఆర్ కూడలి నుంచి ఎర్రముక్కపల్లి కూడలి వరకు రహదారులకు ఇరువైపులా ప్రముఖ వ్యాపార సంస్థలు, వైద్యశాలలు, హోటళ్లు, బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థలున్నాయి. దీని పరిధిలో ఎక్కడా కార్ల పార్కింగ్కు స్థలాలు లేవు. దేవునికడప ఆలయం, పెద్ద దర్గా తదితర ప్రాంతాల్లో వాహనాలను నిలపడానికి ఇబ్బందులు తప్పడం లేదు. సమస్యపై నగరపాలక ప్రణాళిక విభాగం అధికారి నాగేంద్రకుమార్ను వివరణ కోరగా వాహనాల పార్కింగ్కు తగిన స్థలాలను ఎంపిక చేయాలని కమిషనర్ ఇప్పటికే ఆదేశించారన్నారు. ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని రెండు సార్లు నిర్వహించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు పార్కింగ్ స్థలాలను ఎంపిక చేయనున్నామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చూసిన కనులదే భాగ్యం!
[ 23-04-2024]
జగదభిరాముడి కల్యాణానికి జగమే ఊయలూగింది. సర్వమంగళ స్వరూపుడు శ్రీరాముడు, సకల జన శుభధాత్రి సీతాదేవి మూడు ముళ్లబంధంతో ఒక్కటైన వేళ భక్తజనం ఆనందంతో పులకించిపోయారు. -
జగన్ను నమ్మినందుకు నట్టేట ముంచారు!
[ 23-04-2024]
సీఎం జగన్ సొంత జిల్లాలో వైకాపా నుంచి పలువురు కీలక నేతలు వరుసగా జారుకుంటున్నారు. ఏళ్ల తరబడి పార్టీలో సేవలందించి.. సొంత ఆస్తుల్ని అమ్ముకున్న వారు... ఇప్పుడు ఆ పార్టీపై, అగ్రనేతలపై విశ్వాసం కోల్పోయి బయటకొచ్చేస్తున్నారు. -
జగన్ పాలన ఫలితమిది!
[ 23-04-2024]
పదోతరగతి ఫలితాల్లో 86.67 ఉత్తీర్ణత శాతంతో జిల్లా రాష్ట్రంలో 17వ స్థానంలో నిలిచింది. బాలురు 83.65, బాలికలు 89.71 ఉత్తీర్ణత శాతం నమోదుతో బాలికలు పైచేయి సాధించారు. -
బద్వేలులో వైకాపాకు భంగపాటు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల తరుణంలో బద్వేలు నియోజకవర్గ వైకాపాలో విభేదాలు రోడ్డెక్కాయి. -
వాలంటీర్ల కోసం వెతుకులాట!
[ 23-04-2024]
తాము రాజీనామా చేసేందుకు ససేమిరా అంటూ గ్రామ/ వార్డు వాలంటీర్లు వైకాపా నేతలకు కంట కనిపించకుండా తిరుగుతున్నారు. -
బాలికలదే పైచేయి!
[ 23-04-2024]
పదోతరగతి ఫలితాల్లో 92.10 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో జిల్లా మూడో స్థానంలో నిలిచింది. -
స్వామిభక్తిని చాటుకున్న పోలీసులు
[ 23-04-2024]
పోలీసులు పక్షపాత ధోరణిని వీడడంలేదు. వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్ల సందర్భంగా వివక్ష చూపిస్తున్నారు. -
కడపలో ఏకమవుతున్న తెదేపా నేతలు
[ 23-04-2024]
కడపలో తెదేపా నేతలందరూ ఏకతాటిపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
అయిదేళ్ల వైకాపా పాలనలో... సాగునీటి ప్రాజెక్టులకు ఒక్క పైసా విదల్చలేదు
[ 23-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో సాగునీటి ప్రాజెక్టులకు ఒక్క పైసా విదల్చలేదని భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి విమర్శించారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం... నిధులు నిరుపయోగం
[ 23-04-2024]
జిల్లాలో తొలి చెత్త సంపద మండల కేంద్రం రాజుపాళెంలో నిర్మించి గత ప్రభుత్వంలో జిల్లాకు ఆదర్శంగా ఇక్కడ కంపోస్టు ఎరువులు చేసిన ఘణత ఉంది. -
కూటమి అభ్యర్థుల గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి
[ 23-04-2024]
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉమ్మడి పార్టీల అభ్యర్థులను గెలిపించాలని ఎన్డీఏ అభ్యర్థులు, పార్టీల నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. -
‘పది’లో విద్యార్థుల ప్రతిభ
[ 23-04-2024]
జిల్లాలో సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. -
శాసనసభ స్థానాలకు నామపత్రాల దాఖలు
[ 23-04-2024]
ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఆయా ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ నామపత్రాలను సమర్పించారు. -
జగన్ పాలన... అభివృద్ధికి ఆమడ దూరాన
[ 23-04-2024]
బద్వేలు పురపాలకలోని శివారు వార్డులు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. -
ఆర్టీపీపీలో ఉద్యోగోన్నతికి అడ్డదారులు
[ 23-04-2024]
డాక్టర్ ఎంవీఆర్ తాప విద్యుదుత్పత్తి కేంద్రం (ఆర్టీపీపీ)లో కొందరు ఉద్యోగులు ఉద్యోగోన్నతికి అడ్డదారులు తొక్కుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు