అధికారుల అండగా... అక్రమాలు దండిగా!
అధికార పార్టీకి చెందిన ఓ నేత ప్రభుత్వ భూమిని కబ్జా చేసేయడమే కాకుండా సర్కారు నుంచి పరిహారం పొందడానికి అన్నీ చక్కబెడుతున్నారు.
సర్కారు భూములపై అధికార పార్టీ నాయకుల కన్ను
పరిహారానికి ఒకరు... అమ్మకానికి మరొకరు యత్నం
ఈనాడు డిజిటల్, కడప, న్యూస్టుడే, మైదుకూరు
అధికార పార్టీకి చెందిన ఓ నేత ప్రభుత్వ భూమిని కబ్జా చేసేయడమే కాకుండా సర్కారు నుంచి పరిహారం పొందడానికి అన్నీ చక్కబెడుతున్నారు. మరో నేత కాజేసిన ప్రభుత్వ భూమిని ఇతరులకు చక్కగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ రెండు అక్రమాలు స్థానిక అధికారులకు తెలిసినా నేతల అధికార దర్పం ముందు తలూపుతూ అధికారికంగా పచ్చజెండా ఊపడం గమనార్హం.
చిత్రంలో కనిపిస్తున్నవి అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం పెద్దఓరంపాడు రెవెన్యూ గ్రామ పరిధిలో వందలాది ఎకరాల్లోని ప్రభుత్వ భూములు. ఇక్కడ మండల ప్రజాప్రతినిధిగా ఉన్న అధికార పార్టీకి చెందిన ఓ నేత తన పేరిటే కాకుండా.. భార్య, తల్లి పేరిట 23 ఎకరాల భూమిని కబ్జా చేసి ఉద్యాన పంటల సాగు చేపట్టారు. తన సోదరి, మామ పేరిట బొట్టిమీదపల్లె వద్ద మరో 20 ఎకరాలను ఆక్రమించారు. బొట్టిమీదపల్లె వద్ద ఆక్రమించుకున్న భూమిలో మూడెకరాలను అమ్మకానికి సైతం పెట్టారు. తన బినామీలు, అనుచరులకు దాదాపు 150 ఎకరాల వరకు ప్రభుత్వ భూములను కట్ట బెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. రెవెన్యూ అధికార యంత్రాంగం ద్వారా అధికారికంగా రికార్డుల్లో నమోదు చేయించుకునే ప్రయత్నాలు దశలవారీగా పూర్తిచేస్తున్నారు. భవిష్యత్తులో రాజకీయంగా ఎలా ఉంటుందో... ఏమోననే ఆలోచనతో రికార్డులకు ఎక్కిన భూములను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడి తంతు రెవెన్యూశాఖాధికారులకు తెలిసినా అధికార పార్టీ నేత ముందు తలవాల్చుతూ... అన్ని సవ్యంగా చేసిపెడుతున్నారు. ఈ వ్యవహారంపై సోమవారం రాజంపేట సబ్కలెక్టరుకు ఫిర్యాదు అందింది. ఈ విషయమై తహసీల్దారు పీరుమున్ని మాట్లాడుతూ ‘గతంలో కొందరు అధికారులు డీకేటీ భూములను కొందరికి కట్టబెట్టారు. వారికి అర్హత ఉందా?.. లేదా? అని పరిశీలించారా...లేదో తెలియదు. ప్రస్తుతం వారిని ప్రశ్నిస్తే తమకు అన్ని రకాల హక్కులున్నాయంటున్నారు. ఈ వ్యవహారం నానుతూ ఉంది’ అని పేర్కొన్నారు.
ఇది వైయస్ఆర్ జిల్లా మైదుకూరు మండలం నంద్యాలంపేట రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబరు 789లోని 4.17 ఎకరాల ప్రభుత్వ భూమి. ఈ భూమిలోకి ఎవరూ ప్రవేశించరాదంటూ నాలుగేళ్ల కిందట హెచ్చరిక బోర్డు నాటుతున్న రెవెన్యూ సిబ్బందిని చిత్రంలో చూడొచ్చు. వైకాపా అధికారంలోకి రాగానే మైదుకూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కబ్జా చేశారు. ఉద్యాన పంటలు సాగు చేయడంతో పాటు ప్రభుత్వం నుంచి బిందుసేద్యంతో పాటు ఇతరత్రా రాయితీలు దర్జాగా పొందారు. జాతీయ రహదారి పక్కనున్న భూమి కావడంతో అత్యంత విలువ కూడా చేస్తోంది. తాజాగా కర్ణాటక నుంచి కష్ణపట్నం నౌకాశ్రయానికి రహదారి అనుసంధానంలో భాగంగా జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టారు. రెవెన్యూ అధికారులు భూసేకరణ చేపట్టారు. నంద్యాలంపేట వద్ద వైకాపాకు చెందిన బడా నేత ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమికి పరిహారం ఇచ్చేందుకు వీలుగా అవార్డు అమలు చేసి ప్రతిపాదనలు సైతం సిద్ధం చేశారు. ఆక్రమణలపై గతేడాది స్పందనలో ఓ వ్యక్తి ఫిర్యాదు చేయగా... సంబంధిత పొలంలో వేరుసెనగ పంట ఉన్నందున పంట నూర్పిడి పూర్తికాగానే స్వాధీనం చేసుకుంటామనే సమాధానం అధికారుల నుంచి వచ్చింది. ఈ భూమి ఎవరిదో తెలియదనే విధంగా సహ చట్టం కింద మండల వ్యవసాయాధికారి సమాధానమిచ్చారు. ఈ- క్రాప్లోనూ నమోదు చేసుకోలేదని పేర్కొన్నారు. ఇంత వ్యవహారం నడిచిన భూమికి తాజాగా అక్రమంలో భాగస్వాములై దాదాపు రూ.2 కోట్ల పరిహారం చెల్లింపునకు అన్ని రకాలుగా సన్నాహాలు చేశారు. మరోపక్క ఈ వ్యవహారాన్ని బయటపెడుతూ జిల్లా వినియోగదారుల ఫోరం మాజీ సభ్యుడు ఎం.రామచంద్రనాయుడు సోమవారం స్పందన కార్యక్రమంలో జేసీ సాయికాంత్వర్మకు ఫిర్యాదు చేశారు. ఎర్రచందనం స్మగ్లరుగా కేసులున్న వ్యక్తి కాజేసిన భూమికి పరిహారం ఇవ్వడానికి జరిగిన సన్నాహాలను ఆధారాలతో సహా ఫిర్యాదులో పేర్కొన్నారు. 67వ నెంబరు జాతీయ రహదారి విస్తరణకు సేకరించిన భూమికి పరిహారం చెల్లింపును నిలుపుదల చేసి ప్రజాధనాన్ని కాపాడాలని కోరారు. ఈ విషయమై తహసీల్దారు అనూరాధ మాట్లాడుతూ ప్రభుత్వ భూమికి పరిహారం చెల్లింపులు జరగలేదని, నిలుపుదలకు చర్యలు తీసుకుంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాయంచపై రాములోరి రాజసం
[ 19-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు గురువారం రాత్రి రాయంచపై రాములోరి విహారం కనులపండువగా సాగింది. -
మొదలైన నామినేషన్ల సందడి
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ గురువారం మొదలైంది. కలెక్టర్ విజయ రామరాజు ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం కలెక్టరేట్లోని తన ఛాంబరులో నామపత్రాల స్వీకరణను ఆయన ప్రారంభించారు. -
జగన్ను నమ్మాం... నిండా మునిగాం!
[ 19-04-2024]
‘నేను ఉన్నానన్నావ్... నేను విన్నానన్నావ్... నిజమే అనుకున్నాం... నీ మాటలు విని మా బాధలు తెలుసుకుంటావని, పరిష్కారం చూపుతావని ఎంతో ఆశతో నిన్ను గెలిపించాం... తీరా చూస్తే నువ్వు ఉన్నావు... కానీ వినే ఓపికే లేకుండా పోయింది. -
షర్మిలకు మద్దతుగా పులివెందులలో సునీత ప్రచారం
[ 19-04-2024]
కడప పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల తరఫున మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత దంపతులు గురువారం నుంచి ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. -
బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మరథం
[ 19-04-2024]
బ్రహ్మాండ నాయకుడైన శ్రీరాముడి రథోత్సవం గురువారం వాల్మీకి క్షేత్రంలో వైభవంగా జరిగింది. ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
మరో వైకాపా ఫ్యానుపై వేటు
[ 19-04-2024]
వృత్తి ఉద్యోగమైనా... నిబంధనలు ఉల్లంఘించి అత్యుత్సాహంతో ముఖ్యమంత్రి జగన్కు ఊడిగం చేసే వారికి తగిన శాస్తి జరుగుతుందనడానికి నిదర్శనమే... ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై వేటు. -
పెద్దిరెడ్డి కుటుంబ దోపిడీని ఓటుతో అడ్డుకోండి
[ 19-04-2024]
రాజంపేట పార్లమెంట్ పరిధిలో పెద్దిరెడ్డి దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ముఖ్యమంత్రి, భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. -
జగన్ బాటలో బస్సులు.. జనానికి ‘ముప్పు’తిప్పలు!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో పల్లెలకు బస్సులు దూరమయ్యాయి... కొత్త బస్సులు రాకపోగా, ఉన్న బస్సులు మరమ్మతులకు గురయ్యాయి... పల్లె బస్సులు రద్దయ్యాయి. అవీ ఎప్పుడొస్తాయో తెలియదు. -
బ్రహ్మోత్సవ శోభ... ఆధ్యాత్మిక ప్రభ
[ 19-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రామయ్య క్షేత్రంలో రెండో రోజు గురువారం ఉదయం యాగశాలలో తితిదే ఆగమ సలహాదారు కల్యాణపురం రాజేష్ భట్టార్ ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించారు. -
జగనన్న చెప్పాడంటే చెయ్యడంతే
[ 19-04-2024]
మైకు పట్టుకుని రాజకీయ నాయకులేం చెబుతారో ఎన్నికల తర్వాత ఆ పని చేయకపోతే రాజీనామా చేసిపోయే పరిస్థితి రావాలన్నావు. నీ మాటలు నమ్మి ప్రశ్నిస్తే.. కేసులు పెట్టిస్తున్నావ్.. నీ అనునాయులతో ఉరికించి ఉరికించి కొట్టిస్తున్నావ్.. చెప్పిన మాటకు కట్టుబడక పోతే ఎలాగన్నా. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి
[ 19-04-2024]
కేంద్రం, రాష్ట్రంలో తమ ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే చేనేత కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తామని కడప ఎంపీ తెదేపా అభ్యర్థి భూపేష్రెడ్డి, జమ్మలమడుగు అసెంబ్లీ భాజపా అభ్యర్థి ఆదినారాయణరెడ్డి హామీ ఇచ్చారు. -
జిల్లాకు చేరుకున్న కేంద్ర ఎన్నికల పరిశీలకులు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై పర్యవేక్షణకు కేంద్ర ఎన్నికల పరిశీలకులు గురువారం జిల్లాకు చేరుకున్నారు. తొలుత కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, ఎస్పీ కృష్ణారావు, ఇతర జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. -
రాజంపేట వైకాపాలో ముసలం
[ 19-04-2024]
రాజంపేట వైకాపాలో ముసలం పుట్టింది. నియోజకవర్గానికి చెందిన వైకాపా నాయకులు, కార్యకర్తలు ఇటీవల తెదేపాలో చేరారు. ఈ క్రమంలో హైదరాబాద్లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో బుధవారం జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు, తెదేపా నాయకుడు పోలి సుబ్బారెడ్డి, సుగవాసి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో నందలూరు, రాజంపేట మండలాలకు చెందిన వైకాపా నేతలు పార్టీలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి