మూడేళ్ల నాటి వజ్రాల కేసు ఛేదన
మూడేళ్ల కిందట జరిగిన వజ్రాల చోరీ కేసును కడప రిమ్స్ ఠాణా పోలీసులు ఛేదించారు. అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు.
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
వజ్రాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ అన్బురాజన్, పక్కన ఏఎస్పీ తుషార్ డూడి
కడప నేరవార్తలు, న్యూస్టుడే : మూడేళ్ల కిందట జరిగిన వజ్రాల చోరీ కేసును కడప రిమ్స్ ఠాణా పోలీసులు ఛేదించారు. అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. ‘గోవా రాష్ట్రానికి చెందిన వజ్రాల వ్యాపారి ఇస్మాయిల్ షాహిద్కు కడప అల్మాస్పేటకు చెందిన ఖాదర్బాషాతో పరిచయం ఏర్పడింది. ఖాదర్బాషా తన వద్ద తొమ్మిది వజ్రాలున్నాయని, వాటిని విక్రయించమని ఇస్మాయిల్ షాహిద్ను కోరారు. ఎలాగైన వాటిని దొంగలించాలని ఇస్మాయిల్ షాహిద్ పథకం వేశాడు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన గణశ్యామ్ శేషుభాయ్, ఇమ్రాన్, కర్ణాటకకు చెందిన మహమ్మద్ ఇనాముల్లాను పిలుచుకుని 2020 జనవరి 16న కడప రిమ్స్ ఠాణా పరిధిలో ఉన్న ఓ లాడ్జిలో దిగారు. ఖాదర్బాషాకు ఫోన్ చేసి వజ్రాలు కొనుగోలు చేయడానికి ముంబై నుంచి సేఠ్లు వచ్చారు, వజ్రాలు తీసుకుని లాడ్జికి రావాలని చెప్పారు. లాడ్జిలో ఖాదర్బాషా వజ్రాలు చూపిస్తుండగా ఇస్మాయిల్ షాహిద్తో పాటు వచ్చిన వారందరూ ఒక్కసారిగా అతనిపై దాడి చేసి, అరవకుండా నోటికి ప్లాస్టర్ వేసి బాత్రూంలో పడేసి, తొమ్మిది వజ్రాలు దోచుకెళ్లారు. ఖాదర్బాషా కుమారుడు ఆసిఫ్ఖాన్ రిమ్స్ ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసును ఛేదించాలని ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందం కర్ణాటక, గోవా రాష్ట్రాలు, అహమ్మదాబాద్, సూరత్, ముంబాయి తదితర నగరాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. గోవా రాష్ట్రం మపుసా సిటీ, డీఎంసీ కళాశాల వద్ద ఉంటున్న ఇస్మాయిల్ షాహిద్ను అరెస్టు చేసి అతని నుంచి రూ.53 లక్షలు విలువ చేసే మూడు చిన్న వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు’ అని ఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన పోలీసులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. సమావేశంలో ఏఎస్పీ తుషార్ డూడి, డీఎస్పీ వెంకట శివారెడ్డి, సీఐ రామచంద్ర, ఎస్సై ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరవు సీమగా మార్చేసిన పాపం జగన్దే
[ 28-03-2024]
‘నేను రాయలసీమ వాసిని. చిత్తూరు జిల్లాలో పుట్టాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమను రత్నాలసీమగా మారిస్తే, నేడు సాగు, తాగునీరు లేక కరవు సీమగా మార్చేసిన పాపం సీఎం జగన్దే’ అని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. -
సీఎం ఇలాకా.... కుర్చీలు ఖాళీగా!
[ 28-03-2024]
సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సుయాత్ర... అందులోనూ ప్రారంభం అదిరేపోయేలా ఉండాలనుకున్న వైకాపా నేతలు... సీఎం ఇలాకాలోని ఐదు నియోజకవర్గాల మీదుగా సాగే యాత్రలో ప్రత్యేకించి ప్రొద్దుటూరులో కడప పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల నుంచి జనసమీకరణ... -
వైకాపా సేవకు బస్సులు... ప్రయాణికులకు ఇక్కట్లు
[ 28-03-2024]
సీఎం జగన్ బహిరంగ సభలకు జిల్లా నుంచి నాలుగు రోజులపాటు 6 డిపోల నుంచి 90 ఆర్టీసీ బస్సులను తరలించడంతో గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
ముడిపట్టు రాయితీకి మంగళం!
[ 28-03-2024]
వేలాది చేనేత కుటుంబాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. బడుగు జీవుల వెతలు, కన్నీటి ఘోషను పాలకులు ఆలకించడం లేదు. -
భాజపా జమ్మలమడుగు అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి
[ 28-03-2024]
భాజపా జమ్మలమడుగు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, బద్వేలు నియోజకవర్గ అభ్యర్థిగా బొజ్జా రోషన్నకు టిక్కెట్లు లభించాయి. -
సీ విజిల్ ఫిర్యాదులకు సత్వర పరిష్కారం : కలెక్టర్
[ 28-03-2024]
రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి జిల్లాలో సీ విజిల్, ఎన్ కోర్, ఈ ఎస్ఎంఎస్ల ద్వారా అందిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరిస్తున్నామని ఎన్నికల అధికారి, కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. -
అనుమతులతో పనేంటి... తవ్వేద్దాం
[ 28-03-2024]
ఒంటిమిట్ట చెరువులో గత మూడు రోజులుగా అడ్డగోలుగా మట్టి తవ్వేస్తున్నారు. -
ఇళ్లు ధ్వంసం చేయడం సిగ్గుచేటు
[ 28-03-2024]
బద్వేలు పట్టణంలో ఇళ్లు లేని నిరుపేదలైన దివ్యాంగులు దరఖాస్తులు చేసుకుని విసిగి వేసారిపోయారని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మండిపడ్డారు. -
‘రాయలసీమను ఎడారిగా మార్చిన ప్రభుత్వాలు’
[ 28-03-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోగా, అటు 400 స్థానాలు వస్తాయని, ఇటు 175 స్థానాలు వస్తాయని చెబుతూ మభ్యపెడుతున్నారని రాకపా రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్రెడ్డి ఆరోపించారు. -
అనర్హులకు మూల్యంకన విధులపై విచారణ
[ 28-03-2024]
‘సస్పెండైనవారు... పది జవాబుపత్రాలు దిద్దుతారంట’ శీర్షికన బుధవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై పదోతరగతి పరీక్షల జిల్లా పరిశీలకులు వెంకటకృష్ణారెడ్డి స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
-
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
-
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
-
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
-
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత