ప్రొద్దుటూరు సీఐ, ఏఎస్ఐలపై వేటు
ప్రొద్దుటూరులో పోలీసు వ్యవస్థ పనితీరుపై ఎస్పీ అన్బురాజన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అధికారులపై వేటు వేశారు.
డీజిల్ వ్యవహారంలో ఆరోపణలే కారణం
ఈనాడు డిజిటల్, కడప: ప్రొద్దుటూరులో పోలీసు వ్యవస్థ పనితీరుపై ఎస్పీ అన్బురాజన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అధికారులపై వేటు వేశారు. బయోడీజిల్తో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న డీజిల్పై చర్యలు తీసుకోలేదన్న కారణంగా ప్రొద్దుటూరు గ్రామీణ ఠాణా సీఐ మధుసూదన్గౌడ్, ఏఎస్ఐ అహ్మద్ బాషాను వీఆర్కు బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ మధుసూదన్గౌడ్ కర్నూలులో, ఏఎస్ఐ అహ్మద్ బాషాను కడప వీఆర్లో రిపోర్టు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రొద్దుటూరు గ్రామీణ ఠాణా పరిధిలో బయోడీజిల్, కర్ణాటక డీజిల్ దిగుమతి వ్యవహారంలో ఆరోపణలు రావడంతో విచారించిన పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. పొరుగు రాష్ట్రాల నుంచి బయోడీజిల్, డీజిల్ అక్రమంగా దిగుమతి చేసుకుని పెద్ద ఎత్తున ప్రొద్దుటూరులో విక్రయాలు జరుగుతున్నాయి. మైదుకూరు రోడ్డు, ఆటోనగర్ తదితర ప్రాంతాల్లో డీజిల్ అక్రమంగా నిల్వ ఉంచుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలో లీటరుపై దాదాపు రూ.10 తక్కువ ఉండటంతో ట్యాంకుల కొద్దీ అక్కడి నుంచి అక్రమంగా దిగుమతి చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఆ ఇంధనాన్ని ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు, లారీలు, ఇతర వాహనాలకు వినియోగిస్తున్నారు. ఈ వ్యవహారంపై ‘ఈనాడు’లో ఈ నెల 17న ‘ప్రొద్దుటూరుకు కర్ణాటక డీజల్’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఎస్పీ ఆదేశాలతో ప్రొద్దుటూరులో బయోడీజిల్, కర్ణాటక డీజిల్ అక్రమ నిల్వలపై పోలీసు అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. గ్రామీణ పోలీసుస్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించినా..ఆ తనిఖీల్లో గ్రామీణ ఠాణా పోలీసులు లేకపోవడం గమనార్హం. కడప స్పెషల్ పార్టీ పోలీసులు, ప్రొద్దుటూరులోని మిగతా ఠాణాల సీఐలు, ఎస్.ఐ.లు, ఇతర శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భారీగా కర్ణాటక డీజిల్ బయట పడింది. వేలాది లీటర్ల కర్ణాటక డీజిల్ సీజ్ చేయడంతో పాటు పలువురు నిందితులపై కేసులు సైతం నమోదయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
[ 25-04-2024]
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
[ 25-04-2024]
సీఎం జగన్ వైకాపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు గురువారం పులివెందుల రానున్నారు. -
మీ బిడ్డనని గారాలు... నీ గడ్డపైనే ఘోరాలు!
[ 25-04-2024]
రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా నరేగా నుంచి రూ.26.02 కోట్లతో 349 మట్టి పనులను వైకాపా నేతలకు పంచిపెట్టారు. -
ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం
[ 25-04-2024]
మాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎన్డీఏ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు -
నేడు రాజంపేట, రైల్వేకోడూరులో ప్రజాగళం
[ 25-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరు పర్యటనకు రానున్నారు -
అక్రమాలకు పాల్పడకుండా గెలిచే సత్తా మీకుందా?
[ 25-04-2024]
అక్రమాలకు పాల్పడకుండా పులివెందులలో గెలిచే సత్తా మీకుందా? అని తెదేపా పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి సీఎం జగన్కు సవాల్ విసిరారు -
నీళ్లు గరళం... పారిశుద్ధ్యం అధ్వానం
[ 25-04-2024]
నియోజకవర్గ కేంద్రాలు ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు పట్టణ ప్రాంతాల్లోని కాలనీల ప్రజలు కనీస వసతులకు నోచుకోలేక తల్లడిల్లుతున్నారు -
జగన్ పాలనలో పర్యాటకాభివృద్ధి శూన్యం
[ 25-04-2024]
పర్యాటకుల నుంచి ఛార్జీలు, పన్నులు తదితరాల పేరుతో ఆదాయం వస్తున్నా ఆ రంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. -
జగనన్న హామీలు...నీటి మూటలు
[ 25-04-2024]
ఆరునూరైనా అభివృద్ధి చేసి తీరుతాం.. మైదుకూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామంటూ జగన్ ప్రభుత్వంలో పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా